నీటి యాజమాన్యంసేంద్రియ వ్యవసాయం

Dal Lake Weeds to Organic Manure: సేంద్రియ ఎరువుగా దాల్ సరస్సు కలుపు మొక్కలు.!

2
Dal Lake Weeds to Organic Manure
Dal Lake Water Weeds to Organic Manure

Dal Lake Weeds to Organic Manure: శ్రీనగర్లోని దాల్ సరస్సు కలుపు మొక్కల ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేసేందుకు లైక్ కన్జర్వేటివ్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎల్ సి ఎం ఎ) ప్రారంభించింది . ఈ ప్రాజెక్టు క్లీన్ ఎఫెంటెక్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ( సి ఇ ఎఫ్)మరియు నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది ఆగస్టులో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు .

70 వేల టన్నుల పప్పు వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చడం

ఈ ప్లాంట్ దాదాపు 20 వేల టన్నులకు పైగా సేంద్రియ ఎరువు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పని చేయనుంది. ఎల్ సిఎంఏ వైస్ చైర్మన్ డాక్టర్ బషీర్ రెహ్మాన్ బట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ఇప్పటికీ కార్య రూపం దాల్చినట్టు పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన యంత్ర సామాగ్రి, పరికరాలు ఏర్పాటు చేసుకున్నారని, పనులను ఆగస్టులో ప్రారంభించడానికి నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇందులో కలుపు మొక్కలు, లిల్లీ పూలతో సహా 70వేల టన్నుల పప్పు వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చడం జరుగుతుందన్నారు. దీని ద్వారా లోయలోని వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూరు తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ వ్యవసాయంలో ఉన్న సమస్యలకు గల కారణాన్ని తెలుసుకునే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు పని చేయనుందని అధికారులు పేర్కొన్నారు.

Also Read: Tuna Fish: ట్యూనా చేప కు అధిక డిమాండ్.!

Dal Lake Weeds to Organic Manure

Dal Lake Weeds to Organic Manure

ప్రతి ఏడాది దాల్ సరస్సు నుండి వచ్చే వేలాది టన్నుల వ్యర్థాలు పర్యావరణాన్ని కలుషితం చేస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేయడం ద్వారా వ్యర్ధాల నిర్వహణకు పరిష్కార మార్గాలను అందించడంతో పాటు రైతులకు సేంద్రియ ఎరువులను అందుబాటు ధరలకు అందించడం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.

జీవవైవిద్యానికి భంగం కలగకుండా చర్యలు

దాల్ సరస్సులో పర్యావరణ ఇబ్బందులు లేకుండా, జీవావరణ సమస్యలు తలెత్తకుండా, జీవవైవిద్యానికి భంగం కలిగించకుండా శాస్త్రీయ ప్రక్రియ ద్వారా ఈ ప్రాజెక్టు నిర్వహణ ఉండాలని అక్కడి పర్యావరణ న్యాయవాది నదీమ్ ఖాద్రి సూచించారు . కలుపు మొక్కలను సేంద్రియ ఎరువుగా మార్చే శాస్త్రీయ ప్రక్రియ ప్రోత్సాహకరమైనదని ఎల్ సి ఎం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించాలని ఆయన సూచించారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముందు ఎల్ సి ఎం ఏ ద్వారా సరైన శాస్త్రీయ విశ్లేషణ నిర్వహించినట్లు తాను అభిప్రాయపడుతున్నానని పేర్కొన్నారు. కాగా సి ఈ ఎఫ్ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు సీఈవో మహేందర్ సింగ్ నగర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అవలంబించేలా ఈ ప్రాజెక్టు ప్రోత్సహిస్తుందన్నారు .

దాల్ సరస్సులో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయని పేర్కోన్నారు . ఈ ప్రాంతంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. వ్యర్ధాల ప్రాసెసింగ్ ప్లాంట్ ఇక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. కాశ్మీర్లోని రైతులు సేంద్రియ ఎరువు కోసం ఉత్తర ప్రదేశ్ మరియు హర్యానా వంటి రాష్ట్రాల పై ఆధారపడి నందున వాటి కోసం అధిక ధరలు చెల్లించవలసి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ తో రవాణా ఖర్చులు కూడా తగ్గనున్నాయి.

Also Read: Agriculture Department Advices: అధిక వర్షాలకు ఇలా చేస్తే పంటలను రక్షించుకోవచ్చు. వ్యవసాయ శాఖ సూచనలు.!

Leave Your Comments

Tuna Fish: ట్యూనా చేప కు అధిక డిమాండ్.!

Previous article

Methods of Raising Rice Seedlings: వరి నారుమడులు పెంచుకునే పద్ధతులు – చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు

Next article

You may also like