సమకాలీన సమాజంలో భారతదేశంలోని సుమారు 55% శాతం ప్రజానీకం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించి ఆహార భద్రతా వ్యవస్థకు ఇతోధికంగా తోడ్పడుతున్నాయి. మన దేశం ధరణిలో 2వ వ్యవసాయ వ్యవస్థగా రూపొందింది. మనదేశం పాలు, అపరాలు (పప్పుధాన్యాలు), మరియు సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. అంతేకాకుండా పండ్లు, కూరగాయలు, గోధుమ, వరి, పత్తి చెరుకు పంటల ఉత్పత్తిలే 2వ స్థానం ఆక్రమించి ఉంది. పర్యవసానంగా 2025 లో మనదేశ వ్యవసాయం అభివృద్ధి రేటు 5.4% గా నమోదైంది. 2025 ఆర్థిక సంవత్సరంలో దేశం 440,000 కోట్ల రూపాయల విలువైన ($ 51.86 బిలియన్లు) వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. 2024 తో పోలిస్తే (395,793 క్లోట్లు) ఈ ఎగుమతులు ($ 48.15 బిలియన్లు) అధికంగా ఉన్నాయి. 2020 – 2025 కాలంలో వ్యవసాయ మరియు మత్స్య పరిశ్రమల అభివృద్ధి 7.82%గా నమోదైనది. 2024-25 లో మన దేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి 3539.59 లక్షల టన్నులుగా నమోదైనది. దీనిలో కేవలం వరి ధాన్యం ఉత్పత్తి 1490.74 లక్షల టన్నులుగా ఉండడం గమనార్హం. ఉద్యాన పంటల ఉత్పత్తి 367.72 మిలియను టన్నులుగా పెరిగింది. ఈ విధమైన వ్యవసాయాభివృద్ధి దేశ స్థూల జాతీయ నిష్పత్తికి (GDP) 17.8% (2023-24) తోడ్పడింది. దేశంలో సగం జనాభా జీవనాధారమై, 51.8 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసి దేశ ఆర్థిక వ్యవస్థను బలో పేతం చేయడానికి తోడ్పడుతుంది. వ్యవసాయాధారిత పరిశ్రమలు దీనికో ఇతోధికంగా సహకరించాయి. 2025లో బియ్యం ఎగుమతుల నిషేధం సడలించిన పిదప మనదేశం 21.55 మిలియను మెట్రిక్ టన్నుల బియ్యం (19% అధికం) ను విదేశాలకు ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యం ఆర్జించింది.
దేశ వ్యవసాయ రంగంలోని పైర్ల ఉత్పత్తియేగాక అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, వ్యవసాయ ప్రాసెసింగ్, వ్యవసాయ పెట్టుబడులు, వ్యవసాయ స్థూల జాతీయ ఉత్పత్తికి 40 శాతం తోడ్పడుతున్నాయి . కేవలం పైర్ల ఉత్పత్తియేగాక, ఉత్పత్తులకు విలువ చేర్చడానికి అనుబంధ పరిశ్రమలు ఇతోధికంగా తోడ్పడుతున్నాయి . పైర్ల ఉత్పాదన, ఉత్పాదకవలు ఇనుమడించడం లో జీవ ఎరువులు, జీవ సస్యరక్షణ విధానాలు తోడ్పడి భూసారం, ఆరోగ్యం కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.
మన దేశ కొంగొత్త ఆర్థిక వ్యవస్థలో మౌలిక సదుపాయాల రూపకల్పన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎంతగానో తోడ్పడుతుంది. వ్యవసాయ పరిశ్రమలు వ్యవసాయోత్పత్తికి అండగా నిలవడమే గాక వ్యవసాయం యొక్క రూపురేఖలు మార్చివేయడం గమనార్హం. ఆధునిక నీటి పారుదల విధానాలు సౌర నీటి పంపులు వాడడంవలన నీటి వినియోగ సామర్థ్యం 30 – 40% పెరగడమేగాక, పైర్ల ఉత్పాదకత పెరిగి, డీజిల్, విద్యుత్తుల మీద ఆధార పడటం తగ్గి ఎంతో ప్రయోజన కారిగా పరిణమించింది. దేశం మొత్తం మీద ఈ నీటి పంపులు బిగించటం వలన 3000 – 4500 మందికి గ్రామీణ ఉపాధి కల్పిచబడిందని ఒక అంచనా. తద్వారా ఉపాధి కొరకు గ్రామాల నుండి పట్టణాలకు వలసలు చాలా వరకు తగ్గుతాయి. పట్టణాల్లో జనాభా వత్తిడి కొంతమేర తగ్గుతుంది.
భారతదేశ ఆత్మనిర్భర ప్రస్థానం దేశ వ్యవసాయ క్షేత్రాల్లో మొదటి అడుగు వేస్తుంది. వ్యవసాయ రంగం దేశ ఆహార భద్రత, జీవనశైలి, ఆర్థిక వ్యవస్థలను మౌనంగా ప్రభావితం చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. వ్యవసాయ రంగం ప్రతి రోజు ఒక బిలియన్ ప్రజలకు ఆహారం అందించి, ఉద్యోగావకాశాలు కల్పించి, స్థిరీకరణగావిస్తుంది. ప్రజానీకం భుజించే ఆహారం మొదలుకొని , ధరించే వస్త్రాలు, జీవ ఇంధనం నుండి ఆరోగ్యానిక వసరమైన ఔషధాలు వరకు మన దేశ వ్యవసాయం ఆర్థిక సామాజిక సాంస్కృతిక అంశాల చుట్టూ పరిభ్రమిస్తోంది. వివిధ రంగాలైన సాంకేతిక పరిజ్ఞానం, తయారీ రంగం, రియల్ ఎస్టేట్ రంగం మౌలిక సదు పాయ కల్పన రంగం పతాక శీర్షిక లై ఆకర్షిస్తుంటే, వ్యవ సాయ రంగం మత్రం మౌనంగా తన పని తాను చేసుకుంటూ జాతికి ఊతాన్నిచ్చి అభివృద్ధికి తోడ్పడు తోంది.
ఆహార భద్రత, ఆర్థికభద్రత :
భారతావనికి స్వాతంత్య్రం వచ్చిన పిదప సుమారు 50 మిలియన్ టన్నులుగా ఉన్న ఆహారోత్పత్తి క్రమేపీ వృద్ధి పొందుతూ 2024 – 25నాటికి 353.9 మిలియన్ టన్నులుగా నమోదై గణనీయమైన వృద్ధిసాధించిందనడానికి తార్కణం . ప్రస్తుతం ఉత్పత్తి సుమారు 373 మిలియనన్ టన్నులకు చేరవచ్చని అంచనా. ఈవిధ మైన వృద్ధికి హరిత విప్లవం కారణమని నిస్సంకోచంగా చెప్పుకోవచ్చును. తోలి నాట ఆహార ధాన్యాల కొరత వలన దిగుమతి చేసుకోవలసిన అగత్యం ఉండేది . విపత్కర పరిస్థితు లను అధిగ మించి ప్రస్తుతం భారతదేశం ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే స్థితికి చేరుకోవడం ఒక మంచి పరిణామం . దేశానికి ఆహార భద్రత కల్పించడం మన వ్యవసాయ రంగం సాధించిన ప్రగతిగా అభివర్ణించ వచ్చును.
జులై 2025 లో ఎగుమతుల ద్వారా 4.4 లక్షల కోట్లు రూపాయలు ($ 51.86 బిలియన్లు) ఆర్జించడం మన దేశ ఆహారోత్పత్తులకు పెరుగుతున్న నమ్మకం, గిరాకీలకు తార్కాణం అంతర్జాతీయ విపణి వీధిలే. వ్యవసాయం దేశం కడుపునింపడమేగాక, ధరల స్థిరీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాన్ని పెంచడం మరియు పేదరిక నిర్మూలన, బలోపేతమైన దేశీయ పంపిణీ వ్యవస్థకు ఆధార భరితమై విరాజిల్లుతోంది. ప్రస్తుతం మనదేశ ఆహారోత్పత్తులు ఆసియాదేశాలు, ఆఫ్రికా, గల్ఫ్ దేశాలు మార్కె ట్ లకు చేరుతున్నాయి . మనదేశంలో పండించిన బియ్యం 90 దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి, ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మరియు బంగ్లాదేశ్ లాంటివి.
ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం :
ప్రస్తుత దశకంతో కృషి రంగంలో పలు ఆదునిక ప్రక్రియలు వెలుగు చూశాయి. అవి వ్యవసాయ ఉత్పాదనను సులభతరం చేసి రైతుల బారాన్ని కొంతమేర తాగించాయి. నేల ఆరోగ్య కార్డులు పైర్లకు సరియైన విధానంలో ఎరువులను అందించడానికి దోహదపడుతున్నాయి. డ్రోన్ టెక్నాలజీ సున్నిత పరికరాలు పైర్ల ఆరోగ్య పరిస్థితి సమీక్షకు, పైర్లపై సస్యరక్షణకు పిచికారి చేయడానికి ఉపయోగ పడుతున్నాయి. AI (కృత్రమ మేధ) ను ఉపయోగించి వాతావరణ స్థితిగతులను రైతుల కందించడం మూలంగా పొలం పనులు తదనుగుణంగా చేసుకుని పైర్ల నష్ట నివారణకు తోడ్పడుతుంది. డిజిటల్ మార్కెట్ స్థానాలు ద్వారా ఎప్పటి కప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల ధరల వివరాలను రైతాంగానికి అందించబడి అమ్ముకోడానికి సులువుగా ఉంటుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పైర్లకు సూక్ష్మ తడులు అందించడం, నీరు నిల్వ విధానాలు రూపాందించు కోవడం చేసుకోవచ్చు. రైతాంగం ఆధునిక సాంకేతికాలు అవలంబించడానికి దేశమంతటా విస్తారంగా 731 కృషి విజ్ఞాన కేంద్రాలు స్థాపించ బడి వ్యవసాయ శాస్త్ర సాంకేతిక లను విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించబడినాయి. సాంప్రదాయ వ్యవసాయం నుండి ‘తెలివైన వ్యవసాయం’ కు మార్గం సుగమంగావి౦చ బడుతోంది.
ప్రస్తుత ఆధునిక ‘స్మార్ట్ అగ్రికల్చర్ ‘యుగంలో దాదాపు 33%, స్త్రీలు వ్యవసాయ పనులకు తోడ్పడుతున్నారు. వీరు (రైతు పారిశ్రామికవేత్త) గా రూపొందుతున్నారు. స్వయం సహాయక గ్రూప్ లీడర్లు, వ్యవసాయ ప్రోస్సింగ్, పాడి పరిశ్ర దారులు గా స్త్రీలు పురోగతి సాధించడం జరుగుతోంది. వ్యవసాయ పనులకు గ్రామీణ యువతలు ఇతోధికంగా తోర్పడుతున్నారు. 2024 లో గ్రామీణ స్త్రీలు పట్టణ యువతులతో సహా 64.4 % వ్యవసాయ రంగంలో పనిపోయడం జరిగిందನಿ అంచనా.
సుస్థిర వ్యవసాయ విధానాలు :-
భవిషత్తు తరాలకు వ్యవసాయ రంగంలో “ఆత్మ నిర్భరత” సాధించా లంటే సుస్థిత వ్యవసాయ విధానాలను రూపొందించి అనుసరిరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్కర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని అదిగమించాలంటే సుస్థిర వ్యవసాయ విధానాలు ఎంతో అవసరం . దీని ద్వారా ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించడం సుగమం అవుతుంది. ఈ దశలో మనదేశం ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయం, సమర్థవంతమైన నీటి పారుదల విధానాలు, వాతావరణ మార్పులకు అనువైన పైర్ల వంగడాల / హైబ్రిడ్ ల రూపకల్పన, పంటల వికేంద్రీకరణ లాంటి ప్రక్రియలను ప్రోత్సహిస్తోంది.
“ఆత్మ నిర్భరత” భారత సాధనకు, ప్రపంచ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి మన వ్యవసాయ రంగం బలిష్ఠుగా పటిష్ఠంగా ఉండాలి, తద్వారా ఆహార భద్రత లభిస్తుంది. ఫలితంగా గ్రామీణ ఉపాధి మెరుగవుతుంది. ఎగుమతులు పెరుగుతాయి, దిగుమతులు తరుగుతాయి. దేశంలో పంపిణీ విధానం మెరుగువు తుంది. అందరికీ ఆర్థిక లాభాలు అందుతాయి. ఆర్థిక అసమానతలు తగ్గిసమ సమాజ నిర్మాణానికి తోడ్పడుతుంది .
చిరుధాన్యాల పాత్ర :-
ఆసియా ఖండంలో నానాటికి విస్తరిస్తున్న మధుమేహ వ్యాధిని నియంత్రించుటకు ప్రజా నీకం ఈ మధ్య కాలంతో చిరుధాన్యాల వైపు మొగు చుపుతున్నారు. అందువలన వీటి సాగుకు ప్రభుత్వం తగు ప్రోత్సాహం అందిస్తోంది. అనాది నుండి మన దేశం చిరుధాన్యాలైన జొన్న, సజ్జ, రాగి, కొర్రలు, సామలు, వరిగలు లాంటి పంటలు సాగు చేస్తూ వచ్చారు. చిరుధాన్యాలు వరి, గోధుమల కంటె అధిక పోషక విలువులు కల్గి తక్కువ నీటితో వర్షాధారంగా మెట్ట సాగు ప్రాంతాల్లో సాగుచేయ డానికి మిక్కిలి అనువైనవి. ఇవి బెట్టను సమర్థవంతంగా తట్టుకుని వాతావరణ మార్పులకు అనువైనవి. భారతదేశం మొత్తం చిరుధాన్యాల ఉత్పత్తిలో 38.4% అగ్ర గామిగా నిలిచింది.
2024 – 25 లో మనదేశం 180.15 లక్షల టన్నుల చిరుదాన్యాలు ఉత్పత్తి చేసింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 4.43 లక్షల టన్నులు అధికంగా నమోదైంది. అదే సంవత్సరంలో దేశం 89,164 టన్నుల చిరుధాన్యాలు ఎగుమతి చేసి 5.37 మిలియన్ డాలర్ల విదేశ మారక ద్రవ్యం ఆర్జించింది. చిరుదాన్యాల ఉత్పత్తిలో సజ్జలు అగ్రగామిగా నిలిచింది. మన దేశ ప్రతిపాదన మూలంగా UN జనరల్ అసెంబ్లీ 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవవ్సరంగా డిక్లేర్ చేసింది. దానికి 72 దేశాలు తమ మద్దతును తెలిపడం జరిగింది .
జులై 2025లో రోమ్ దేశంలో నిర్వహించబడిన 88వ కోడెక్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సదస్సులో మనదేశం ప్రతిపాదించిన ప్రపంచ నాణ్యతా ప్రమాణాలకు ఆమోదం లభించడం మనదేశానికి లభిస్తున్న ప్రాధాన్యతకు తార్కాణం. అంతకు పూర్వం ధాన్య సేకరణ, విదానాల నిర్ణయాలకు కేవలం గోధుమ, బియ్యం పైర్ల కు మాత్రమే ప్రధాన్యం ఉండేది. ప్రస్తుతం చిరుధాన్యాలకు ప్రాధాన్యత లభించడం . హర్షించతగ్గ భిన్నమైన పరిగామంగా భావించవచ్చు . వాతావరణ మార్పుల కనుగుణంగా పంటల వికేంద్రీకరణ దిశలో ప్రభుత్వం ఈ విధానాలు ఇంతకు పూర్వమున్న అసమానత లను సరి చేయడం జరుగుతోంది. ప్రపంచ ఆహార భద్రతను దృష్టిలో ఉంచు కొని ప్రభుత్వం చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం వలన అనేక చిరుదాన్యాల మూలమైన పరిశ్రమలు, వ్యాపారాలు దినదినం దినదిన ప్రవర్ధమానమౌతున్నాయి.
ప్రస్తుతం మనదేశం ప్రపంచంతో చిరుధాన్యాల ఎగుమతిలో 5వ స్థానం ఆక్రమించి ఉంది. రాను రాను చిరుధాన్యాల ఉత్పత్తులకు ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రపంచ చిరుధాన్యాల ఉత్పత్తులైన బిస్కట్లు, పాస్తా, అల్పహారాలు, భోజనం లాంటి వాటికి గిరాకీ పెరుగుతోంది. ఈ విలువ జోడింపబడిన ఉత్పత్తులను ఇతర దేశాలకు గణనీయంగా ఎగుమతి చేస్తున్నారు. ఎగుమతి ప్రముఖంగా UAE, సౌదీ అరేబియా, నేపాల్ , USA, సెనెగల్, జర్మనీ, జపాన్ దేశాలుకు చేయబడుతోంది. మన దేశ వాణిజ్య మంత్రీత్వం ఆధ్వర్యంలో ఉన్న వ్యవసాయ శిధిలాలు మరియు ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ అంకితమైన పోషక తృణధాన్యాల ఎగుమతి ప్రోత్సాహక ఫోరమ్ (DNCEPF) ను నెలకొల్పడం జరిగింది. ఈ ఫోరమ్ చిరుధాన్యాల ప్రత్యేక వాణిజ్య పోర్టల్ (millet-specific trade Portal) ను స్థాపించింది. ఈ వాణిజ్య పోర్టల్ ద్వారా మనదేశం ప్రపంచంలో వివిధ దేశాల్లో జరిగే ప్రధాన ఆహార మేళాల్లో ” పాల్గొనడానికి అవకాశం ఉంటుంది.
మారుతున్న కాలం, వాతావరణం, అవసరాలు, ఎగుమతుల కనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించి మనదేశ వ్యవసాయ రంగ పురోభివృద్ధికి తోడ్పడి సుస్థిర వ్యవసాయ విదానాలను అక్కున చేర్చుకుని దేశ ఆర్థిక పరిపుష్టికి తోడ్పడ వలసిన అవసరం ఎంతైనా ఉంది . అక్కున చేరుకుని దేశ ఆర్థిక పరిపుష్టికి తోడ్పడ వలసిన అవసరం ఎంతైనా ఉంది.
డా. చెరుకూరి. వీరరాఘవయ్య,”విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త” ICAR-IIOR హైదరాబాద్ -500048, Ph : 9441352640























