తెలంగాణవార్తలు

రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ప్రత్యేక తనిఖీలు – మంత్రి తుమ్మల

0
  • రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ప్రత్యేక తనిఖీలు
  • ⁠ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
  • ⁠రైతులకు మెరుగైన సౌకర్యాలు, గిట్టుబాటు ధరలు కల్పించడమే లక్ష్య  – మంత్రి తుమ్మల
                 రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా తీర్చిదిద్ది రైతులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు వారి వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు చేపట్టాలని గౌరవ వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు శనివారం అధికారులను ఆదేశించారు.
                     గౌరవ మంత్రి ఆదేశాల మేరకు వ్యవసాయ & సహకార శాఖ ముఖ్య కార్యదర్శి (APC & Secretary) రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీల పనితీరును సమగ్రంగా పరిశీలించేందుకు ఆరు (6) ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు.
                    ఈ బృందాలు వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకుల నియంత్రణలో పనిచేస్తూ రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఈ వారం యాదృచ్ఛికంగా తనిఖీ చేయనున్నాయి.
               ప్రత్యేక బృందాలు మార్కెట్ కమిటీల పరిపాలన, రైతులకు అందుతున్న సేవలు, మార్కెట్ నిర్వహణ, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ ఆదాయ పరిరక్షణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించనున్నాయి.
తనిఖీలలో ముఖ్యంగా క్రింది అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు:
  • రైతులు తమ పంటలను విక్రయించే సమయంలో ఎదుర్కొంటున్న ఆచరణాత్మక సమస్యలు,
  • కనీస మద్దతు ధర (MSP) కొనుగోలు కార్యకలాపాల్లో ఉన్న లోపాలు, ఇబ్బందులు,
  • రైతులు తమ పంటలను నష్టపోయే ధరలకు (Distress Sale) విక్రయించాల్సిన పరిస్థితులకు దారితీస్తున్న కారణాలు.
  • ⁠మార్కెట్ సెస్ (Market Cess) ఎగవేతను నివారించేందుకు అవసరమైన చర్యలు.
  • మార్కెట్ కమిటీల పరిపాలన, మౌలిక సదుపాయాలు మరియు సేవలపై సూచనలు.
  • రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర పొందుతున్నారా? వేలం ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందా? అనే అంశాలను పరిశీలించడం.
  • కనీస మద్దతు ధర (MSP) కొనుగోలు కేంద్రాల నిర్వహణ, కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, చెల్లింపులు సకాలంలో జరుగుతున్నాయా అనే అంశాలను పరిశీలించడం.
  • మార్కెట్ కమిటీలలో అమలవుతున్న డిజిటల్ సేవలు, రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ మార్గదర్శకాల అమలును పరిశీలించడం.
             ప్రత్యేక బృందాలు ప్రతి వారం తమ తనిఖీ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనున్నాయి. నివేదికల్లో గుర్తించిన లోపాలు, తక్షణ చర్యలు అవసరమైన అంశాలు, విధానపరమైన సంస్కరణలు, మార్కెట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన సూచనలు పొందుపరుస్తాయి.
ఈ నివేదికలపై వచ్చే వారం గౌరవ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ & సహకార శాఖ ముఖ్య కార్యదర్శితో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
రైతుకు గిట్టుబాటు ధర, మార్కెట్‌లో మెరుగైన సౌకర్యాలు, పారదర్శకమైన లావాదేవీలు, ప్రభుత్వ ఆదాయ పరిరక్షణే ఈ  ప్రత్యేక తనిఖీల ప్రధాన లక్ష్యం అని బాధ్యతాయుత పరిపాలన ఈ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అని మంత్రి పేర్కొనారు
Leave Your Comments

టమాటా ధరలు పడినా… లాభాలు తెచ్చే విలువ ఆధారిత ఉత్పత్తులు

Previous article

తెలంగాణాలో అధిక దిగుబడినిచ్చే సన్నగింజ వరి వంగడాలు

Next article

You may also like