ఆంధ్రప్రదేశ్పశుపోషణపాలవెల్లువవార్తలు

పశుసంవర్థక రంగానికి భారీ ఊరట – మంత్రి అచ్చెన్నాయుడు

0
  • పట్టణాల్లో పశుపోషకులకు అభివృద్ధి ఛార్జీల నుంచి మినహాయింపు.
  • భవన అనుమతుల రుసుములో సడలింపు.
  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి.
                       రాష్ట్రంలో పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేస్తూ పశుపోషకులు, చిన్న రైతులకు పెద్ద ఎత్తున ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పురపాలక పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీవో ప్రకారం రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు (ULBs), పట్టణ అభివృద్ధి సంస్థలు (UDAs) పరిధిలో డెయిరీ ఫారాలు, గొర్రెలు/మేకల పెంపకం కేంద్రాలు, పందుల పెంపకం యూనిట్లు, ఇతర పశుసంవర్ధక ఫారాలకు బెటర్‌మెంట్ చార్జీలు, డెవలప్‌మెంట్ చార్జీల నుండి పూర్తిగా మినహాయింపు మంజూరు చేయబడిందని తెలిపారు. అదేవిధంగా ఈ ఫారాలకు భవన అనుమతి/లైసెన్స్ రుసుమును గ్రామ పంచాయతీల్లో వసూలు చేసే రుసుముకు సమానంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా పట్టణ ప్రాంతాల్లో పశుపోషణపై ఆధారపడిన రైతులు, చిన్న వ్యవసాయదారులకు ఆర్థిక భారం గణనీయంగా తగ్గి వారి జీవనోపాధి మెరుగుపడుతుందని, మరింత మందికి స్వయం ఉపాధి, సంవృద్ది లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. గత జూన్ నెలలో జరిగిన సీఎం కాంక్లేవ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
పిఆర్వో – వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రివర్యుల కార్యాల‌యం.
Leave Your Comments

చరిత్ర నేర్పిన పాఠం.. కష్టకాలంలోనే ‘జాన్ డీర్’స్వర్ణయుగం..

Previous article

షెడ్యూల్ కుల రైతులకు– కూరగాయల సాగులో ఆధునిక పద్దతులు శిక్షణ కార్యక్రమలు

Next article

You may also like