ఆంధ్రప్రదేశ్వార్తలు

మామిడి కోకోతో పాటు అన్ని పంటల ధరలపై ముందస్తు అంచనాలు – మంత్రి అచ్చెన్నాయుడు

0

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఉద్యాన శాఖ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు, సీనియర్ ఆఫీసర్లు ఎం. వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏపీఎంఐపి సీబీ హరినాథ్ రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ (ఎంఐ) డిహెచ్ అశోక్ కుమార్, జాయింట్ డైరెక్టర్ (ఆయిల్ పామ్) లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. మామిడి పూత, పిందె దశలో తెగుళ్ల నివారణకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కోకోతో పాటు అన్ని పంటల ధరలపై ముందస్తు అంచనాలు సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాబోయే మిరప సదస్సులో రైతులు మరియు భాగస్వాములతో కలిసి సాగు పద్ధతులు, రేట్లు, నాణ్యత ప్రమాణాలపై విస్తృత చర్చలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్, తుంపర్ సేద్య పరికరాలు కోరిన ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు మైక్రో ఇరిగేషన్‌లోని కొత్త విధానాలు, ముఖ్యంగా రైన్‌పోర్ట్, ఆటోమేషన్ విధానాలపై అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రధాన పంటలన్నింటికీ పంటలవారీ ప్రణాళికలు, రేట్ల ముందస్తు అంచనాలను సిద్ధంగా ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Leave Your Comments

రైతన్నకో ప్రశ్న ?

Previous article

స్మార్ట్ ఇరిగేషన్‌తో సుస్థిర వ్యవసాయం దిశగా ఆంధ్రప్రదేశ్ – అచ్చెన్నాయుడు

Next article

You may also like