పంటల సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే అనుకూలమైన వాతావరణం చాలా అవసరం. వివిధ వాతావరణ అంశాలలో పంట కాలంలో కురిసిన వర్షపాతము మరియు వర్షపాత వితరణ కీలిక పాత్ర పోషిస్తాయి. అయితే, తాజా వాతావరణ అంచనాల ప్రకారం, 2026 నైరుతి ఋతుపవనాలు కాలంలో ఎల్నినో పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో సాధారణంగా జూన్ నుండి నవంబర్ వరకు నమోదయ్యే 838 మి.మీ. వర్షపాతంకు బదులుగా, ఈ కాలంలో సుమారు 25–30 శాతం వర్షపాతం లోటు సంభవించే అవకాశం ఉందని అంచనా వేయబడింది. జూన్ నెలలో ఇప్పటికే 25 శాతం వర్షపాతం లోటు నమోదైంది. అలాగే జూలైలో (-41%), ఆగస్టులో (-14%), సెప్టెంబరులో (-24%), అక్టోబరులో (-30%) మరియు నవంబరులో (-11%) సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వర్షపాతం లోటు కారణంగా వ్యవసాయం, ఉద్యానవనం, జలవనరులు, తాగునీటి సరఫరా, భూగర్భజలాల పునరుద్దరణ, సాగునీటి లభ్యత, పశుసంపద, విద్యుత్ రంగం, ప్రజారోగ్యం వంటి వాతావరణానికి సున్నితమైన అనేక రంగాలు ప్రతికూల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది.
అంతేకాకుండా, వర్షాధార ప్రాంతాలు మరియు భూగర్భజలాలపై ఆధారపడిన సాగు ప్రాంతాలు మరింత ప్రమాదానికి గురయ్యే అవకాశమున్నట్లు ఈ అంచనాలు సూచిస్తున్నాయి. అందువల్ల మన రాయలసీమ జిల్లాలోని రైతులు తాము సాగు చేస్తున్న పంటలలో ముందస్తు సంసిద్ధత చర్యలు చేపట్టడంతో పాటు, సమయానుకూల నష్ట నివారణ చర్యలను అమలు చేయడం అత్యంత అవసరం.
రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా మొక్కజొన్న, కంది, మినుము, సోయా చిక్కుడు, ప్రత్తి, వేరుశనగ, సజ్జ మరియు ఆముదం పంటలను సాగు చేయడం జరిగింది. జూలై మాసంలో రాయలసీమ జిల్లాలో అధిక మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
ఎల్ నినో నేపధ్యంలో ప్రస్తుతం జిల్లాలో సాగులో ఉన్న పంటలకి బెట్ట పరిస్థితులలో పాటించవలసిన మెళకువలు
మొక్కజొన్న : –
- నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో బోదెలు మరియు కాలువలు పద్దతిలో నీటి తడులు ఇవ్వాలి.
- నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఒక వరుస మార్చి వరుస పద్దతిలో నీటి తడులు ఇవ్వాలి.
- ఆరుతడి క్రింద పూతకి ముందు, పూత దశ మరియు గింజ పాలు పోసుకునే దశలలో రక్షక తడిని సూక్ష్మ నీటి పారుదల పద్దతి ద్వారా అందించాలి.
- పొటాషియం నైట్రేట్ 5 గ్రా/లీటరు నీటికి (లేదా) యూరియా 20 గ్రా/లీటరు నీటికి (లేదా) 19:19:19 5 గ్రా/లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
- నేలలో తేమ నిల్వ ఉండేందుకు రెండు నుంచి మూడు సార్లు అంతర కృషి చేయాలి.
కంది :-
- మొక్కల సాంద్రత ఎక్కువ ఉన్న వరుసలలో మొక్కలను పలుచన చేయాలి.
- సాధ్యమైనంత వరకు రక్షక తడిని సూక్ష్మ నీటి పారుదల పద్దతి ద్వారా అందించాలి.
- పొటాషియం నైట్రేట్ 5 గ్రా/లీటరు నీటికి (లేదా) యూరియా 20 గ్రా/లీటరు నీటికి (లేదా) 19:19:19 5 గ్రా/లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
- నేలలో తేమ నిల్వ ఉండేందుకు రెండు నుంచి మూడు సార్లు అంతర కృషి చేయాలి.
- తేమ సంరక్షణ చాళ్ళను ప్రతి సాలు పక్కన ఏర్పాటు చేసుకోవాలి.
పత్తి :-
- పొటాషియం నైట్రేట్ 5 గ్రా/లీటరు నీటికి (లేదా) యూరియా 20 గ్రా/లీటరు నీటికి (లేదా) 19:19:19 5 గ్రా/లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
- నేలలో తేమ నిల్వ ఉండేందుకు రెండు నుంచి మూడు సార్లు అంతర కృషి చేయాలి.
- వర్షాభావ పరిస్థితుల్లో రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు, ఇమిడాక్లోప్రిడ్ (కాన్ఫిడార్) 80 మి.లీ. (లేదా) అసిటమాప్రిడ్ (అస్సాయిల్) 40 గ్రా. (లేదా) థయోమిథాక్సాం (అక్టారా) 40 గ్రా.ను 200 లీ. నీటిలో కలిపి ఒక ఎకరా పొలంలో పిచికారీ చేసుకోవాలి.
వేరుశనగ :-
- పొటాషియం నైట్రేట్ 5 గ్రా/లీటరు నీటికి (లేదా) యూరియా 20 గ్రా/లీటరు నీటికి (లేదా) 19:19:19 5 గ్రా/లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
- నేలలో తేమ నిల్వ ఉండేందుకు రెండు నుంచి మూడు సార్లు అంతర కృషి చేయాలి.
- ప్రతి 12 వరుసలకు ( 3.6 మీ.) ఒక తల్లి సాలు వేయడం ద్వారా తేమ సంరక్షణ జరుగుతుంది.
సజ్జలు :-
- పొటాషియం నైట్రేట్ 5 గ్రా/లీటరు నీటికి (లేదా) యూరియా 20 గ్రా/లీటరు నీటికి (లేదా) 19:19:19 5 గ్రా/లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
- మొక్కల సాంద్రత ఎక్కువ ఉన్న వరుసలలో మొక్కలను పలుచన చేయాలి.
చిరుధాన్యాలు :-
- పొటాషియం నైట్రేట్ 5 గ్రా/లీటరు నీటికి (లేదా) యూరియా 20 గ్రా/లీటరు నీటికి (లేదా) 19:19:19 5 గ్రా/లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
- మొక్కల సాంద్రత ఎక్కువ ఉన్న వరుసలలో మొక్కలను పలుచన చేయాలి.
మినుము :-
- ఆరుతడి క్రింద, పూత మరియు కాయ ఏర్పడే కీలక దశలలో రక్షక తడిని సూక్ష్మ నీటి పారుదల పద్దతి ద్వారా అందించాలి.
- పొటాషియం నైట్రేట్ 5 గ్రా/లీటరు నీటికి (లేదా) యూరియా 20 గ్రా/లీటరు నీటికి (లేదా) 19:19:19 5 గ్రా/లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
ఆముదం :-
- పొటాషియం నైట్రేట్ 5 గ్రా/లీటరు నీటికి (లేదా) యూరియా 20 గ్రా/లీటరు నీటికి (లేదా) 19:19:19 5 గ్రా/లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- నేలలో తేమ నిల్వ ఉండేందుకు రెండు నుంచి మూడు సార్లు అంతర కృషి చేయాలి నిర్వహించాలి.
- తేమ సంరక్షణ చాళ్ళను ప్రతి సాలు పక్కన ఏర్పాటు చేయాలి.
సోయాబీన్ :-
- ఆరుతడి క్రింద పూత మరియు కాయ ఏర్పడే కీలక దశలలో రక్షక తడిని సూక్ష్మ నీటి పారుదల పద్దతి ద్వారా అందించాలి.
- పొటాషియం నైట్రేట్ 5 గ్రా/లీటరు నీటికి (లేదా) యూరియా 20 గ్రా/లీటరు నీటికి (లేదా) 19:19:19 5 గ్రా/లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పంటల ప్రణాళిక :-
ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపద్యంలో కాలువలు మరియు భూగర్భ జలాల నీటి లభ్యత తక్కువ ఉన్నందున రైతులు వరి మరియు మొక్కజొన్న సాగు చేయకుండా ఉండడం శ్రేయస్కరం. ఇప్పుడున్న పరిస్థితులలో వర్షం వచ్చిన ఎడల, ఈ క్రింది ప్రత్యామ్నాయ పంటలు ఆగష్టు మాసంలో సాగు చేసుకోవడానికి అనువుగా ఉంటాయి.
పంట : కంది :-
రకాలు : ఎల్. ఆర్.జి –52, ఎల్. ఆర్.జి –105, ఎల్. ఆర్.జి –133-33, ఆశ (ICPL 87119), లక్ష్మి(ICPL 85063), పి.ఆర్.జి.-176
విత్తన మోతాదు (కిలోలు/ఎకరా) : 2-3
యాజమాన్య పద్దతులు : 2 టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని మరియు 20 కిలోల భాస్వరం ఎరువులు దుక్కిలో వేసుకోవాలి.
పంట : మినుము
రకాలు : ఎల్. ఎల్. బి. జి. –884, ఎల్. బి. జి.-904, ఎల్. బి. జి.-932, టి. బి. జి.-129, పి.యు.-31
విత్తన మోతాదు (కిలోలు/ఎకరా) : 8-10
యాజమాన్య పద్దతులు :- 2 టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని మరియు 20 కిలోల భాస్వరం ఎరువులు దుక్కిలో వేసుకోవాలి.
పంట : సజ్జ :-
రకాలు :ఎ.బి.వి. -04, ఎ.పి.హెచ్.బి.-126
విత్తన మోతాదు (కిలోలు/ఎకరా) : 1.6-2.0
యాజమాన్య పద్దతులు : ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువును ఆకరి దుక్కిలో వేసి కలియదున్నాలి. ఎకరాకు 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం మరియు 8 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులు దుక్కిలో వేసుకోవాలి, నత్రజని ఎరువును రెండు సమ దఫాలుగా విత్తేప్పుడు 30 రోజులలో వేయాలి.
పంట : కొర్ర
రకాలు : సూర్యనంది, మహానంది , గరుడ, మహానంది, ఎస్.ఐ.ఎ. – 3156
విత్తన మోతాదు (కిలోలు/ఎకరా) : వరుసలో నాటడానికి : 2 , వెదజల్లుటకు: 4-7
యాజమాన్య పద్దతులు : ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువును ఆకరి దుక్కిలో వేసి కలియదున్నాలి. ఎకరాకు 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం విత్తేటపుడు వేసుకోవాలి. విత్తిన 2-3 వారాల తరువాత నేలలో తగిన తేమ చూసి పైపాటుగా 8 కిలోల నత్రజని వేయాలి.
పంట : ఆముదము
రకాలు : ఐ.సి.హెచ్. -5, ఐ.సి.హెచ్. -66
విత్తన మోతాదు (కిలోలు/ఎకరా) : 2
యాజమాన్య పద్దతులు : 2 టన్నుల పశువుల ఎరువు దుక్కిలో వేసి కలియదున్నాలి. 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులు విత్తేప్పుడు వేసుకోవాలి, పై పాటుగా 6 కిలోల నత్రజనిని విత్తిన 30-35 రోజులకి, 6 కిలోల నత్రజనిని విత్తిన 60-65 రోజులకి, మరొక 6 కిలోల నత్రజనిని విత్తిన 90-95 రోజులకి వేసుకోవాలి.
పంట : ప్రొద్దుతిరుగుడు
రకాలు : ఎన్.డి.ఎస్.హెచ్ -1012
విత్తన మోతాదు (కిలోలు/ఎకరా) : 2
యాజమాన్య పద్దతులు : 3 టన్నుల పశువుల ఎరువు దుక్కిలో వేసి కలియదున్నాలి. 12 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులు విత్తేప్పుడు వేసుకోవాలి, పై పాటుగా 12 కిలోల నత్రజనిని విత్తిన 30-35 రోజులకి వేసుకోవాలి.
నల్ల రేగడి నేలల్లో సెప్టెంబర్ మాసంలో సాగుకు అనుకూలంగా ఉన్న పంటలు :
పంట : జొన్న
రకాలు : ఎన్. టి. జె.- 4, ఎన్. టి. జె. – 5, పి.ఎస్.వి. – 56, ఎన్.-15 (పచ్చ జొన్న)
విత్తన మోతాదు (కిలోలు/ఎకరా) : 3-4
యాజమాన్య పద్దతులు : 4 టన్నుల పశువుల ఎరువు దుక్కిలో వేసి కలియదున్నాలి. 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులు దుక్కిలో వేసుకోవాలి, నత్రజని ఎరువును రెండు సమ దఫాలుగా విత్తేప్పుడు మరియు మోకాలు ఎత్తు పైరు దశలో వేయాలి.
పంట : కంది (లేట్ ఖరీఫ్)
రకాలు : ఎల్. ఆర్.జి –52, ఎల్. ఆర్.జి –105, ఎల్. ఆర్.జి –133-33, ఆశ (ICPL 87119), లక్ష్మి(ICPL 85063), పి.ఆర్.జి.-176
విత్తన మోతాదు (కిలోలు/ఎకరా) : 6-8
యాజమాన్య పద్దతులు : 2 టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని మరియు 20 కిలోల భాస్వరం ఎరువులు దుక్కిలో వేసుకోవాలి. లేట్ ఖరిఫ్ కంది లో విత్తే దూరం వరుసల మద్య 45-90 సెం.మీ మరియు మొక్కల మధ్య 10 సెం.మీ ఉండేలా చూసుకోవాలి.
పైన తెలియపరిచిన సూచనలతో పాటు రైతులు సకాలంలో సస్య రక్షణ చర్యలు చేపట్టినట్లైతే పంట దిగుబడిపై ఎల్ నినో ప్రభావాన్ని కొంత వరకు తగ్గించవచ్చు.
డా. కె. అశోక్ కుమార్, ప్రధాన శాస్త్రవేత్త, డా. ఎ. మల్లీశ్వర రెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త, డా . ఆర్. నసీరుద్దిన్, శాస్త్రవేత్త మరియు డా . వి. జయలక్ష్మి, సహ పరిశోధన సంచాలకులు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, నంద్యాల, ఫోన్ : 9966505285
























