తెలంగాణలో పత్తి పంటను ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. గత సంవత్సరం పత్తిని దాదాపు 45 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరిగింది. ప్రస్తుతం రైతులందరూ బి.టి. పత్తిని సాగు చేస్తున్నారు. కాని ఈ బి.టి. పత్తిని తొలిదశలో కొన్ని రకాల రసం పీల్చే పురుగులు ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలుగచేస్తున్నాయి. పత్తి పంటను తొలి 60 రోజుల దశలో రసం పీల్చే పురుగులైన పేనుబంక, తామర పురుగు మరియు పచ్చదోమ ఆశించి నష్ట పరుచడం వలన సుమారుగా పంట దిగుబడి దాదాపు 12%. వరకు తగ్గే అవకాశం వుంది. కావున పంట తొలిదశలో వీటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉండడం వలన మొక్కల పెరుగుదల చాలా వరకు కుంటుపడి దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. అంతే కాకుండా పంట తొలిదశలో రసాయనిక మందులు పిచికారి చేయడం వలన పెట్టుబడి గణనీయంగా పెరిగే అవకాశము వుంది.
కావున పత్తి సాగు చేసె రైతులందరూ కాండం పూత పద్ధతిని పాంటించినట్టైతే తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగుల బారినుండి పంటను కాపాడు కోవడానికి అవకాశం వుంది.
పేనుబంక :- పేనుబంక పిల్ల మరియు తల్లి పురుగులు ఎక్కువగా మొక్క లేత భాగాలను ఆశించి నష్టపరుస్తాయి.
- పేనుబంక ఆశించిన ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకి మరి కిందకి ముడుచుకొని పోవడం గమనించవచ్చు.
- పత్తిలో అంతర పంటగా పెసర పంట వేసినప్పుడు ఈ పురుగు ఉధృతి చాలా వరకు తగ్గిపోవును.
- అధిక వర్షాలకు ఈ పురుగు ఉధృతి పూర్తిగా తగ్గిపోతుంది.
పచ్చదోమ :-
- అధిక వర్షం, మబ్బులతో కూడుకున్న వాతావరణంలో ఈ పురుగు ఉధృతి అధికంగా ఉంటుంది.
- ఆకులపై నూగు ఎక్కువగా ఉన్న రకాలలో దీని ఉధృతి తక్కువగా ఉంటుంది.
- పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి.
- పురుగు ఆశించిన ఆకుల అంచులు మొదటగా పసుపు రంగులోకి మారి కిందికి ముడుచుకొని ఆ తర్వాత ఆకు అంచులు ఎర్రబడి కమేపి ఎండి రాలిపోతాయి.
- ఈ పురుగు పైరు లేత దశ నుండి పంటకాలం చివరి వరకు ఆశిస్తుంది.
- పత్తి లో అంతర పంటలుగా సోయాచిక్కుడు, బొబ్బర (అలసందలు) వంటి పంటలను వేసినప్పుడు ఈ పురుగు ఉధృతి చాలా వరకు తగ్గుతుంది.
తామర పురుగు :
- పత్తి పంటలో తొలిదశ నుండే దీని ఉధృతి కనబడుతుంది. తొలిదశలో దీని ఉధృతి ఎక్కువగా ఉంటే మొక్క గిడసబారి పెరుగుదల పూర్తిగా తగ్గిపోతుంది.
- ఈ పురుగులు సన్నగా పసుపు గోధుమ రంగులో ఉంటాయి. వీటి పిల్ల, పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకులను గీకి రసానికి పీలుస్తాయి. దీని వలన చెట్ట వాతావరణ పరిస్థితులంణ ఈ పురుగు ఉధ్భ ఎక్కువ.
పంట తొలిదశలో వచ్చే ఈ రసం పీల్చే పురుగుల నివారణకు మొదటి నుండే విచ్చలవిడిగా రసాయన మందులు పిచికారి చేయకుండా విత్తిన రెండు నెలల వరకు పత్తి కాండానికి (పైన ఉన్న లేత ఆకుపచ్చ భాగంలో) మందు పూత ద్వారా తొలిదశలో ఆశించే ఈ రసం పీల్చే పురుగులను సమర్ధవంతంగా నివారించు కోవచ్చు. దీనికి గాను పత్తి పంట 30,45 మరియు 60 రోజుల దశలో ఉన్నప్పుడు. మోనోక్రోటోఫాస్, నీరు 1:4 నిష్పత్తి లేదా ఫ్లోనికామిడ్, నీరు 1:20 నిష్పత్తిలో కలుపుకొని కాండానికి పై భాగంలో పూయాలి.
ఈ పద్ధతిలో మిత్ర పురుగులకు ఎటువంటి హాని లేకుండా కేవలం రసం పీల్చే పురుగులు నివారించవచ్చు. దీని ద్వారా రైతులకు సుమారు ఎకరకు 2000/- రూ వరకు ఖర్చు తగ్గే అవకాశమున్నది.
డా. యస్. ఓంప్రకాశ్, డా. వై. ప్రశాంత్, డా. వి. వెంకన్న, డా. ఎమ్. శ్రీధర్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, వరంగల్, ఫోన్ : 9866373563

























