కొబ్బరిని ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతిలో రసాయన గోవుఆధారిత జీవన ఎరువులను (Bio-stimulants) ఉపయోగించడం ద్వారా సుస్థిర దిగుబడికి Rythu Sadhikara Samstha (APCNF) ద్వారా శిక్షణ తీసుకున్న రైతులను పరిశీలించగ, కొబ్బరిలో కొన్ని ముఖ్యప్రకృతి సాగు పద్ధతులను పాటించి సుస్థిర దిగుబడిపొందుతున్న యాజమాన్య పద్దతులను ఈ క్రింద తెలియజేయడమైనది. ముందుగా ప్రకృతి వ్యవసాయసాగులో నేల సారవసంతం కాపాడడంతోపాటు, తోటలో లభ్యం అయ్యే వనరులను(కొబ్బరి డొక్కలను, ఎండుటాకులు మరియు డోలకలను) విరివిగా వినియోగించి నేలలో జీవవైవిధ్యం, సేంద్రీయ కర్బనం, పోషకాలు మరియు తోటలో సూక్ష్మ వాతావరణం పెంపొందించి సుస్థిరమైన దిగుబాడులను పొందడమే ముఖ్య సిద్ధాంతం గా చెప్పుకోవచ్చు.
ప్రకృతి వ్యవసాయం – ప్రాథమిక సూత్రాలు (APCNF Core Principles)
ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ (APCNF) పద్ధతిలో తప్పక పాటించాల్సిన తొమ్మిది ప్రధాన సూత్రాలు ఈ విధంగా ఉన్నాయి:
- నేలను సంవత్సరం పొడవునా వివిధ రకాల పంటలతో కప్పి ఉంచాలి.
- తోటలో 18 నుండి 31 రకాల పచ్చిరొట్టపంటలు సాగు చేయాలి.
- నేలను వీలైనంత తక్కువగా దుక్కుదున్నాలి.
- జీవ శిలింద్రాలు(Bio-stimulants) తప్పనిసరిగా వాడాలి.
- దేశీయ విత్తనాలను ఉపయోగించాలి.
- పశువులను వ్యవసాయంలో అంతర్భాగం చేయాలి.
- పంట అవశేషాలు, ఇతర సేంద్రీయ అవశేషాలను నేలపై పెంచాలి.
- తెగుళ్లు మరియు వ్యాధుల నిర్వహణకు సమగ్ర పురుగుల యాజమాన్యం (IPM) / సమగ్ర తెగుళ్ల యాజమాన్యం (IDM) పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి(Botanical Extracts) చివరి ప్రయత్నంగా ఉపయోగించాలి.
- ఎటువంటి రసాయన ఎరువులు, పురుగుమందులు మరియు కలుపు మందులు వాడకూడదు.
కొబ్బరి సాగుకు అనువైన వాతావరణం, నేలలు
కొబ్బరి సాగుకు గాలిలో తేమ ఎక్కువగా ఉండే కోస్తా ప్రాంతాలు, వర్షపాతం సాలీనా 1000-1250 మి.మీ.వరకు లేదా అధికముగాను, సంవత్సరంలో ఎక్కువ రోజులు వర్షాలు ఉండే ప్రాంతాలు అనువుగా ఉంటాయి.నీటి సదుపాయం, మురుగు వసతి గల సారవంతమైన డెల్టా భూములు ఈ పంటకు చాలా అనుకూలము. నీటి సదుపాయము గల గరప, ఎర్రనేలలు కూడా సాగుకు అనుకూలమే.
మొక్కలను ఎంపిక చేసుకోవడం మరియు నాటడం :
విత్తనముకాయలను మంచి లక్షణాలు గలిగిన, ఎంపిక చేసిన దేశవాళీ తల్లి చెట్లనుండి మాత్రమే సేకరించాలి. తల్లి చెట్లు ఆరోగ్యముగా ఉండి, నిలకడగా అధిక దిగుబడినిచ్చేవిగా (సగటున 100 కాయలు/సం./ చెట్టుకు) ఉండాలి, కాయ నాణ్యత (ఎండుకొబ్బరి కాయకు 120 –140 గ్రాములు, నూనె 65శాతం) కలిగి ఉండాలి. నారుమడిలో 9–12 నెలలు వయసున్న, మొదలు దృడంగా (10 సెం. మీ.) ఉన్న, ఎత్తు 1 – 1.2 మీ ఉన్న, ఆరోగ్యవంతమైన వేర్లు, పచ్చని ఆకులు, ఎలాంటి వ్యాధి లక్షణాలు లేని మొక్కలను ఎంచుకొని ఈ క్రింది విధంగా నటుకోవాలి.
నాటే విధానం:
- గుంత పరిమాణం: 100 × 100 × 100 సెం.మీ (3 × 3 × 3 అడుగులు)
- పై మట్టితో కలపవలసినవి:
- పశువుల ఎరువు – 25 కిలోలు
- వర్మీకంపోస్ట్ – 5 కిలోలు
- వేపచెక్క (నీమ్ కేక్) – 1 కిలో
- జీవామృతం – 2 లీటర్లు
- అంతరము (Spacing):
- 7.5 మీ × 7.5 మీ→సుమారు 175 చెట్లు / హెక్టారు
- నీటి లభ్యత ఆధారంగా 8 × 8 మీ కూడా అనుసరించవచ్చు
నీటి యాజమాన్యం
తేమ ఆరకుండా, భూమి స్వభావాన్ని, వాతావరణాన్ని బట్టి కొబ్బరి చెట్లకు నీరు సక్రమముగా అందించాలి. డ్రిప్పు పద్ధతి ద్వారా నీటిని తోటలకు అందించడం ద్వారా నీటిని 60 నుంచి 40 శాతం వరకు పొదుపు చేయవచ్చు.డ్రిప్పు ద్వారా చెట్టుకి ప్రతిరోజు సుమారు 60 లీటర్ల నీరుఇవ్వాలి.వేసవిలో సుమారు 80 నుండి 100 లీటర్ల నీరుఅవసరం ఉంటుంది.
కొబ్బరి సాగులో నేల జీవ వైవిధ్యత పెంచడానికి సంవత్సరం పొడవునా మొక్కలు సాగు చేయడం :
కొబ్బరి తోటలోఅంతర పంటలుమరియుబహుళ పంటల సాగుద్వారా రైతు తన ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
- లేత తోటలలో (5 సంవత్సరాలలోపు): ఏక వార్షికములైనపసుపు, అల్లంవంటి వాణిజ్య పంటలు, కంద, చేమ, కాబేజి, కాలీఫ్లవర్, మిరప, వంగ, బెండమొదలైన కూరగాయ పంటలు, అపరాలు, వేరుశనగ, పంటలను పండించవచ్చు.
- పాత తోటలలో (20 సంవత్సరాలు పైబడిన):మిరియం, బొప్పాయి, అరటి, కోకో, అనాసవంటి మరియు హెలికోనియా వంటి వాణిజ్యపరమైన పూల మొక్కలు పండించుకోవచ్చు.
- PMDS(ప్రీ మన్సూన్ డ్రై సోయిగ్ ): వేసవి కాలం లో రుతుపవనాలు ప్రారంభం కావడానికి ముందుగానే 20–30 రకాల పంటల విత్తనాలను కలిపి తోటలో వెదజల్లడం, ఇందులోపప్పుజాతిపంటలు (కంది, పెసర, మినుము, అలసంద), చిరుధాన్యాలు (సజ్జ, సామ, కొర్ర, రాగి), నూనెగింజలు (నువ్వులు, ఆవాలు, వేరుశనగ), ఆకుకూరలు (పాలకూర, తోటకూర), కూరగాయలు మరియు పచ్చిరొట్టె విత్తనాలు ఉంటాయి. దీనికోసం ప్రధానంగా రుతుపవనాలకు ముందు కురిసే జల్లులు మరియు ఇతరవనరుల నుండి లభించే తేమను ఉపయోగించి పెంచడం. పంటలు ఒకసారి మొలకెత్తి ఎదిగిన తరువాత, వాటి ఆకులతో భూమినికప్పి, నేలను సూర్యరశ్మికి గురికాకుండా కాపాడతాయి మరియు నేలకు సేంద్రీయ పదార్థాన్నిజోడిస్తాయి.
- ఈ విత్తనాలను ముందుగా ప్రకృతి సాగు పద్ధతిలో శుద్ది చేసుకున్నట్లైతే, మొలక శాతం పెరగడం మరియు తక్కువ నీటి వనరులను కూడా సమర్థవంతంగా ఉపయోచించుకొని పెరగడం గమనించ వచ్చు. విత్తన గుళికల తయారీ ఈ విధంగా చేసుకోవాలి, బంక మట్టి/పుట్టమట్టి, ఘనజీవామృతం మరియు బూడిదను జల్లెడలా చేసి నీరు కలిపి చిక్కని మిశ్రమం తయారు చేసి, 5 లీటర్ల బీజామృతంతో 25–30 కిలోల విత్తనాలనుగుళికలుగా తయారు చేసి నీడలో ఎండబెట్టాలి. ఎండిన గుళికలను వర్షానికి ముందుగా లేదా తేలికపాటి తేమ ఉన్న నేలలో వెదజల్లితే, విత్తనాలు తీవ్ర సూర్యరశ్మి నుండి తట్టుకొని, మంచి మొలక శాతం, మొక్కలు పెరుగుదల మెరుగుపడుతుంది.
- కొబ్బరి తోటలో సంవత్సరానికి రెండు సార్లు pmds విత్తనాలు జల్లుకోవాలి మార్చి –ఏప్రిల్ నెలలో (31 రకాలు) మరియు నవంబర్ – డిసెంబర్ నెలల్లో (13-18 రకాలు) ఎకరానికి 20 కిలోల చొప్పున వేసి 45–60 రోజులలో పూత దశలో కలియెదున్నాలి.
- పశువులను అనుసంధానం:కొబ్బరి తోటలో గొర్రెలు, ఆవులను ఇతర పశువులను పండస్ మేపడం ద్వారా పశువులను అనుసంధానించవచ్చు, తద్వారా సేంద్రీయ ఎరువు లభ్యత మెరుగవుతుంది. తేనెటీగల పెంపకం (Apiculture) అనుసంధానం ద్వారా కూడా ఫలాధికారణ పెరుగుతుంది. పశువుల మేత, సంచారం వలన నేల గట్టితనం తగ్గి, సేంద్రియ పదార్థం మరియు సూక్ష్మజీవుల చురుకుదనం పెరుగుతుంది. దీని ఫలితంగా కొబ్బరి చెట్లు ఆరోగ్యంగా పెరిగి, దీర్ఘకాలిక దిగుబడి మరియు తోట స్థిరత్వం మెరుగుపడుతుంది. కొబ్బరి తోటల్లో గోవులను అంతర్భాగంగా కలుపుకోవడం ద్వారా ఆవు పేడ, మూత్రం సులభంగా లభిస్తాయి.
- చెట్టు చుట్టూ పళ్లెంలో కొబ్బరి డొక్క లేదా కొబ్బరి ఆకు లేదా కొబ్బరి పొట్టును పరచి, తేమను నిల్వ ఉంచేలా చేసుకోవాలి, నీటి ఎద్దడి సమస్య అధిగమించడానికి, నీటి లభ్యత పెరిగి నీటిని తోటలకు అందించడము ద్వారా నీటిని సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. వేసవి మాసాల్లో సగటున కాపుకాసే చెట్టుకు రోజుకు సుమారు 50 నుండి 60 లీటర్ల వరకు చెట్టుకు సేద్యపు నీరు అవసరమవుతుంది
దేశీ ఆవు ఆధారిత జీవన ఎరువులు
- ప్రకృతి వ్యవసాయంలో కొబ్బరి మొక్కలకు పోషకాలు సమర్థవంతంగా అందించడానికి, వ్యాధులను నివారించడానికి దేశీ ఆవు ఆధారిత బీజామృతం, ద్రవ జీవామృతం, ఘన జీవామృతంవంటి జీవన ఎరువులను వాడాలి.
బీజామృతం (Beejamrutham)
- విత్తన శుద్ధి చేయడం వలన విత్తనాల మొలక శాతం పెరుగుతుంది. నేల ద్వారా, విత్తనం ద్వారా పంటలకు సంక్రమించే తెగుళ్ళను అరికట్టవచ్చు.
పదార్థాలు:
- స్థానిక ఆవు పేడ – 5 కిలోలు
- ఆవు మూత్రం – 5 లీటర్లు
- సున్నం – 50 గ్రాములు
- పుట్ట మట్టి – ఒక గుప్పెడు (100 గ్రాములు)
- నీరు – 20 లీటర్లు
తయారుచేయు విధానం:ఒక మట్టి పాత్రలో 100 లీటర్ల నీటిలో తాజా ఆవు పేడను గుడ్డలో మూట కట్టి కర్ర సహాయంతో 12 గంటల పాటు వ్రేలాడ దీయాలి. 12 గంటల తర్వాత పేడను గట్టిగా పిసికి ద్రావణం తీసి, అందులో 5 లీటర్ల ఆవు మూత్రం, నానబెట్టిన 25 గ్రాముల సున్నం కలిపితే బీజామృతం తయారవుతుంది. లోహపు పాత్రలు వాడకూడదు.
ఉపయోగించే విధానం:
- కొబ్బరి మొక్కలు నాటే ముందు కాయలను బీజామృతంలోమునిగేవిధంగా
- అలాగే ఇతర పంటల (వరి, ఉల్లి, టమోటా వంటి) నారు వేర్లను 15 నిమిషాలపాటు బీజామృతంలో ఉంచి నాటుకోవాలి.
- తయారైన బీజామృతాన్ని 24 గంటలలోపుఉపయోగించాలి, నిల్వ చేయకూడదు.
ఘన జీవామృతం (Ghana Jeevamrutham)
పదార్థాలు
- దేశీఆవుపేడ–100 కిలోల
- దేశీఆవుమూత్రం–2 నుండి5 లీటర్లు
- బెల్లం–2 కిలోలు
- పప్పుపిండి–2 కిలోలు
- పుట్టమట్టి–ఒకగుప్పెడు (100 గ్రాములు)
తయారుచేయువిధానం:
- 100 కిలోలఆవుపేడ, 2 కిలోలబెల్లం, 2 కిలోలపప్పుపిండి, పుట్టమట్టినికలపాలి, కొద్దిగా ఆవు మూత్రం వేసి బాగా కలపాలి, మిశ్రమాన్నివిస్తరించిఒకవారంనీడలోఉంచిఎండబెట్టాలి, తర్వాత చేతితో పొడిచేయ్యాలి, ఈవిధంగా తయారైన ఘనజీవామృతం 6 నెలలవరకునిల్వచేయవచ్చు.
ఉపయోగించే విధానం:
- ఒకసంవత్సరానికి రెండు సార్లుచెట్టుకు 10 కిలోల చొప్పున అంధించి నట్లైతే ఉపయోగకరంగా ఉంటుంది.
ద్రవ జీవామృతం (Drava Jeevamrutham)
ఇది మొక్కలకు పోషకాలను, నేల సారాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
పదార్థాలు:
- దేశీ ఆవు పేడ – 10 కిలోలు
- ఆవు మూత్రం – 5 లీటర్లు
- బెల్లం – 2 కిలోలు
- పప్పు పిండి – 2 కిలోలు
- పుట్టమట్టి – ఒక గుప్పెడు (100 గ్రాములు)
- నీరు – 200 లీటర్లు
తయారుచేయు విధానం:ఒక డ్రమ్ములో 100 లీటర్ల నీరు తీసుకుని, ఆవు పేడ, బెల్లం, శెనగపిండి, మట్టిని వేర్వేరుగా నీటిలో కరిగించి, ఆ ద్రావణాలను ఒకదాని తరువాత ఒకటి డ్రమ్ములో పోయాలి. చివరిగా దేశీ ఆవు మూత్రాన్ని పోస్తూ, అన్ని బాగా కలిసేలా కర్రతో సవ్య దిశలో 5-10 నిమిషాలు కలపాలి. గోనె పట్టాతో గాని, నూలు వస్త్రంతో గాని డ్రమ్మును కట్టి, నీడలో ఉంచాలి. 7-8 రోజుల పాటు, ఉదయం సాయంత్రం కర్రతో సవ్య దిశలో తిప్పాలి. మాగిన పండు వాసన వస్తే తయారైనట్లు.
ఉపయోగించే విధానం:
- 3-4 సంవత్సరాలు, ఆపై వయస్సు గల తోటలలో: 10 లీటర్ల ద్రవ జీవామృతంను రింగ్ బేసిన్ లో అందించాలి.నేల తేమ ఉన్నప్పుడు వేయాలి
- 1-3 సంవత్సరాల చిన్న తోటలలో: 5 లీటర్ల ద్రవ జీవామృతంను అందించాలి.
- గమనిక:తయారైన 8-10 రోజులలోపుఉపయోగించాలి.ఎక్కువ రోజులు నిల్వ ఉంటే కుళ్లిపోతుంది. వడపోసిన ద్రవ జీవామృతాన్ని డ్రిప్ లేదా తుంపర్ల సేద్యం ద్వారా కూడా వాడవచ్చు.
ఈ విధముగా పాటించిన తోటల్లో సేంద్రీయ కర్బనం 3-4 సంవత్సరాలలో 0.05-0.09 శాతం మేర పెరిగింది అని రైతులు కొంతమంది తెలియచేయడం జరిగినది.
కొబ్బరిలో పురుగుల మరియు తెగుళ్ల నివారణ (ప్రకృతి వ్యవసాయ పద్ధతులు) కొబ్బరిని ఆశించే ప్రధాన పురుగులు
- కొమ్ము పురుగు (Rhinoceros Beetle)
కొబ్బరి పంటకు అత్యంత నష్టం కలిగించే ప్రధాన పురుగులలో ఇది ఒకటి. దీని ద్వారా దిగుబడి 10% వరకు తగ్గే అవకాశం ఉంది.
లక్షణాలు: కొమ్ము పురుగు కొబ్బరి మొవ్వులోని, లేత ఆకులలోకి చొచ్చుకుపోయి తింటాయి. దీని వలన కొత్తగా విచ్చుకునే ఆకులు త్రికోణాకారంలో లేదా “V” ఆకారంలో కత్తిరించబడినట్లుగా కనిపిస్తాయి. ఇవి లేత మొవ్వులను, ఆకు కాoడమును నష్ట పరుస్తుంది. లేత కొబ్బరి మొక్కలలో మొవ్వు దెబ్బతిని చనిపోతుంది, తద్వారా తీవ్ర నష్టం కలుగుతుంది.
ప్రకృతి వ్యవసాయ నివారణా చర్యలు:
- తోటలో, తోట చుట్టూ ఉండే పెంట కుప్పలు, సేంద్రీయ వ్యర్థాలు, కుళ్ళిన చెట్ల మొద్దులను ఎప్పటికప్పుడు తొలగించాలి లేదా వాటిని ఎరువుగా మార్చాలి, ఎందుకంటే పురుగు గుడ్లు ఇక్కడే పెడుతుంది.
- పురుగు ఉదృతిని కనిపెట్టుకోవడానికి ఫెరోమోన్ ట్రాప్స్ను (Pheromone Traps) ఎకరాకు 4-5 ట్రాప్స్ చొప్పున ఏర్పాటు చేయాలి.
- పురుగు చొచ్చుకుపోయే ప్రదేశాలలో మొవ్వులో వేప పిండి (Neem Cake) లేదా ఇసుక + వేప పిండిమిశ్రమాన్ని వేయాలి.
- వర్షాకాలం ప్రారంభంలో, పురుగులు గుడ్లు పెట్టే ప్రదేశాలలో జీవ శిలీంధ్రం (Bio-fungicide) అయిన మెటారైజియం అనిసోప్లియే (Metarhizium anisopliae) పౌడర్ను 1 కిలోను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
- ఎర్ర ముక్కు పురుగు (Red Palm Weevil)
కొమ్ము పురుగు నష్టం చేసిన గాయాల ద్వారా ఈ పురుగు కొబ్బరి చెట్లలోకి సులభంగా ప్రవేశిస్తుంది. ఇది ప్రధానంగా 8-20 సంవత్సరాల వయస్సు గల చెట్లకు నష్టం కలిగిస్తుంది.
ప్రకృతి వ్యవసాయ నివారణా చర్యలు:
- కొమ్ము పురుగు ద్వారా ఏర్పడిన గాయాలు, ఇతరగాయాలను మామూలుగా ఉంచకుండాత్వరగాబీజామృతం లేదా పంచగవ్యంపూసి, పేడతో మూయాలి.
- తోటలోఫెరోమోన్ ట్రాప్స్ను (Pheromone Traps) ఎకరాకు 2-3 చొప్పున ఏర్పాటు చేసి, పురుగులను ఆకర్షించి నాశనం చేయాలి.
- పురుగు ప్రవేశించిన గాయం ద్వారావేప నూనె (Neem Oil) ఆధారిత ద్రావణాన్ని లేదా వేప కషాయాన్ని సిరంజి ద్వారా లోపలికి ఇంజెక్ట్ చేయవచ్చు.
- నివారించలేని చెట్లను నరికి, ముక్కలు చేసి, వాటిలోమెటారిజియం అనిసోప్లియేద్రావణాన్ని పోసి, ఆ తర్వాత పూడ్చి పెట్టాలి.
3.నల్లముట్టెపురుగు నివారణా చర్యలు:
- ఈ పురుగు సోకిన ఆకులనుకత్తిరించి వెంటనే నాశనం చేయాలి.
- ఈ పురుగు నివారణకు జీవ నియంత్రణ (Biological Control) పద్ధతి చాలా సమర్థవంతమైనది. పరాన్న జీవులు (Parasitoids) అయిన బ్రాకన్ హెబెటార్ (Bracon hebetor) లేదా ట్రైకోగ్రామావంటి వాటిని విడుదల చేయాలి.
- పురుగు ఉధృతిని బట్టివేప నూనె లేదానీమాస్త్రంద్రావణాన్ని 5% (5 లీటర్లు నీమాస్త్రం, 100 లీటర్ల నీరు) చొప్పున ఆకులపై బాగా తడిచేలా పిచికారీ చేయాలి.
- రూగోస్ స్పైరలింగ్ తెల్ల దోమ (Rugose Spiraling Whitefly) నివారణా చర్యలు:
- తోటలో దోమల ఉనికిని గుర్తించడానికిపసుపు రంగు జిగురు ట్రెప్లు (Yellow Sticky Traps) ఎకరాకు 10-15 వరకు ఏర్పాటు చేయాలి.
- నీమాస్త్రం/బ్రహ్మాస్త్రంద్రావణాన్ని 5% చొప్పున ఆకుల అడుగు భాగంలో తడిచేలా పిచికారీ చేయాలి.
- అపర్టోక్రయిస యాస్టర్ లేదా ఎన్కార్సియా (Encarsia) వంటి సహజ శత్రువులను (Natural Predators) తోటలో విడుదల చేయడం వలన దోమల సంఖ్యను నియంత్రించవచ్చు.
కొబ్బరిని ఆశించే ప్రధాన తెగుళ్లు
- గానోడెర్మా/ కాండం కుళ్ళు తెగులు (Basal Stem Rot – Ganoderma)
ఇది నేల ద్వారా వ్యాపించే శిలీంధ్ర తెగులు. దీనిని నివారించడం చాలా కష్టం, కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి.
లక్షణాలు:మొదట్లో ఈ తెగులు వేర్లను ఆశించి, నీరు మరియు పోషకాలు అందకుండా చేస్తుంది. దీని వలన పాత ఆకుల చివరలు పసుపు రంగులోకి మారి క్రమంగాపంట కాలిపోయినట్లుగా (Scorched) కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో కాండంపైగోధుమ రంగు శిలీంధ్రపు పుట్టగొడుగులు ఏర్పడతాయి.
ప్రకృతి వ్యవసాయ నివారణా చర్యలు :
- కొబ్బరి చెట్టు కాండముపై, వేర్లకు ఎటువంటి గాయములుచేయరాదు.
- తోటలోమురుగు నీరు నిల్వకుండామంచి మురుగు వసతి కల్పించాలి.
- తెగులు సోకిన చెట్టుకు నీరు పెట్టేటప్పుడు, ఆ నీరు ఆరోగ్యకరమైన చెట్లకు ప్రవహించకుండా జాగ్రత్త వహించాలి.
- తయారు చేసినపంచగవ్యం లేదా ద్రవ జీవామృతంద్రావణాన్ని ప్రతి 2 నెలలకు ఒకసారి మొదలుకు అందించి నేల ఆరోగ్యాన్ని పెంచాలి.
- తెగులు సోకిన కాండం భాగంలోట్రైకోడెర్మా విరిడే (Trichoderma viride) పేస్ట్ను పూయాలి.
- తెగులు అధికంగా ఉన్న నేలల్లో కొబ్బరి చెట్టుకి ప్రతి సంవత్సరం 125 గ్రా ట్రైకోడర్మా వీరిడి మరియు 125 గ్రా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ శిలీంద్రం పొడిని 5 కిలోల వేపపిండిని కలిపి సవంత్సరంలో ఒకసారి వేయాలి
- నల్ల మచ్చ తెగులు (Stem Bleeding Disease)నివారణా చర్యలు:
- కాండంపై ఎటువంటి గాయాలు లేదాచిన్న చీలికలుఏర్పడకుండా జాగ్రత్త వహించాలి.
- తెగులు సోకిన భాగాన్నిపదునైన కత్తితోతీసివేసి, శుభ్రం చేసి, ఆ భాగంలోట్రైకోడెర్మా విరిడే పేస్ట్నుపూయాలి.
- ఆవు పేడ + మూత్రం + ఇంగువమిశ్రమ ద్రావణాన్ని (6 లీటర్ల ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి) చెట్టు మొదలుకు అందించాలి లేదా కాండంపై స్ప్రే చేయాలి.
- మొవ్వు కుళ్ళు తెగులు (Bud Rot) నివారణా చర్యలు:
- నారు మొక్కలను నాటే ముందు బీజామృతం ద్రావణంలో నానబెట్టి నాటాలి.
- తెగులు సోకిన చెట్టు మొవ్వు భాగంలో కుళ్ళిన ఆకులను తొలగించి, ఆ ప్రాంతంలో సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ (Pseudomonas fluorescens) పౌడర్ను 1-5 గ్రాముల చొప్పున చల్లాలి.
- ఎండు అల్లం + పాలుకషాయాన్ని (6 లీటర్ల కషాయం 200 లీటర్ల నీటిలో కలిపి) మొవ్వు భాగంలో బాగా తడిచేలా పిచికారీ చేయాలి.
- ఆవు పేడ + మూత్రం + ఇంగువద్రావణాన్ని కూడా పిచికారీ చేయవచ్చు.
ప్రకృతి వ్యవసాయంలో స్థిర దిగుబడికి
- కొబ్బరి చెట్టు దిగుబడి రకం, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు మరియు ముఖ్యంగా యాజమాన్య పద్ధతులపై ఆధారపడి ఉంటుంది.
- అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం -కొబ్బరి తోటలోఅంతర పంటలుమరియుబహుళ పంటల సాగు (మిరియం, కోకో, పసుపు, అరటి, కూరగాయలు) చేయడం వలన ప్రధాన పంట దిగుబడితో పాటు రైతుకు నిరంతరఅదనపు ఆదాయంలభిస్తుంది. ముఖ్యంగా అంతర పంటలు నేలను కప్పి ఉంచి, నేలలోని సూక్ష్మ జీవుల సంఖ్య పెంచి, కొబ్బరి చెట్టుకు కూడా పరోక్షంగా మేలు చేస్తాయి.
- ప్రకృతి వ్యవసాయంలో PMDS (ప్రీ–మాన్సూన్ డ్రై సోయింగ్)పంట వైవిధ్యతను పాటించడంతో నేల ఎల్లప్పుడూ పచ్చగా కప్పబడి ఉంటుంది. దీని వల్ల నేలలోసేంద్రియ పదార్థం, సూక్ష్మజీవుల వైవిద్యత, సామర్థ్యం, పోషకాల లభ్యత, నీటి నిల్వ సామర్థ్యం సేంద్రీయ కార్బనము లభ్యత మెరుగుపడుతుంది. జీవామృతం, ఘనజీవామృతం క్రమం తప్పకుండా వాడటం ద్వారా కొబ్బరి చెట్ల ఆరోగ్యం మెరుగుపడి దిగుబడినిలకడగా పెరుగుతుంది అని రైతులు తెలియచేస్తున్నారు. ఫలితంగా రసాయన అవశేషాలు లేని కొబ్బరికాయల పొందవచ్చు అలాగే రానున్న రోజులలో మార్కెట్లో మంచి ధర లభించి నికర ఆదాయం పెంపొందించు కోవడానికి తోడ్పడుతుంది.
గమనిక: పైన తెలియపరచిన విధానాలు పరిశోధనల ద్వారా నిరూపితం చేయాల్సిఉంది.
ఎ. కిరీటి, వై. శ్రావణి, బి. నీరజ & వి. అనూష,ఉద్యాన పరిశోధన స్థానం, అంబాజీపేట, డా.బి.ఆర్.ఎ.కోనసీమ జిల్లా























