శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన , విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో, రాజేంద్రనగర్లోని కూరగాయల పరిశోధనా కేంద్రం ద్వారా, కూరగాయల సాగులో ఆధునిక పద్దతులు గురించి రైతు శిక్షణ కార్యక్రమం ములుగు కేంద్రంలోని సెమినార్ హాల్లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం , మరియు షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్ (SCSP) పథకం కింద అఖిల భారత కూరగాయల సమన్వయ పరిశోధన నిధుల తోనిర్వహించబడింది.కార్యక్రమానికి ప్రారంభంగా డా. డి. అనితా కుమారి గారు (జోనల్ హెడ్ & హెడ్, వెజిటబుల్ రీసెర్చ్ స్టేషన్) స్వాగతం పలికారు. అనంతరం డా. డి. లక్ష్మీనారాయణ గారు (డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్) శిక్షణ కార్యక్రమ లక్ష్యాలు మరియు ప్రాముఖ్యతను వివరించారు.
డా. టి. సురేష్ కుమార్ గారు (విస్తరణ మరియు & డీన్) కూరగాయల సాగు ప్రాధాన్యత, ఆధునిక సాగు పద్ధతులు మరియు రైతుల ఆదాయం పెంపు మార్గాలపై వివరంగా మాట్లాడారు.
ప్రత్యేక అతిథిగా పాల్గొన్న డా. ఎ. భగవాన్ గారు (రిజిస్ట్రార్) రైతులు సాంకేతికతను అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.
నార్సoపల్లి గ్రామ సర్పంచ్ శ్రీమతి లహరి శ్రీధర్ రెడ్డి గారు గ్రామీణ రైతుల అభివృద్ధికి ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా శ్రీ శ్రీధర్ గారు, జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి, మెడ్చల్ మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ములుగు వారు ఉద్యాన శాఖ ద్వారా అమలు అవుతున్న పథకాలు, ముఖ్యంగా కూరగాయల రైతులకు అందుబాటులో ఉన్న సబ్సిడీలు, డ్రిప్ సాగు, హైటెక్ సాగు విధానాలపై సమగ్రంగా వివరించారు. రైతులు ఈ పథకాలను వినియోగించుకొని ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు.
రైతులు తమ అనుభవాలను పంచుకొని, శిక్షణ కార్యక్రమంపై సానుకూల స్పందన తెలియజేశారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయ వైస్ ఛాన్సలర్ డా. డి. రాజి రెడ్డి గారు మాట్లాడుతూ, శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సాంకేతికతలను రైతుల వరకు చేరవేయడం విశ్వవిద్యాలయం ముఖ్య లక్ష్యమని తెలిపారు.
చివరగా డా. బి. సాయి కృష్ణ నిఖిల్ గారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం అనంతరం బ్యాటరీ స్ప్రేయర్స్, పసుపు మరియు పచ్చ రంగు జిగురు పలకలు రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో 35 మంది నర్సంపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు పాల్గొన్నారు.
Leave Your Comments


























