ఆరోగ్యం / జీవన విధానంఆహారశుద్ది

సుగంధ ద్రవ్యాలు – ఆరోగ్య ఉపయోగాలు

0

అప్పుడప్పుడు వచ్చే అనారోగ్యాలకు వంటిల్లు ఓ వైద్యశాల. మిరియాలు, సొంటి, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, పసుపు, ఆవాలు, జీలకర్ర, సోంపు గింజలు మొదలైనవన్నీ ఆహార పదార్థాలకు రంగును రుచిని ఇస్తాయి. వీటితోపాటు ఆరోగ్యాన్ని అందిస్తుంటాయి. సువాసన ద్రవ్యాలుగా అనాది నుంచి వంటింట్లో స్థానం సంపాదించుకున్న కొన్ని మసాలా దినుసులలో ఔషధ గుణాలను ఇప్పుడు చూద్దాం.

యాలకులు:

  • దీనిని శక్తివంతమైన సుగంధ ఉద్దీపనగా, కార్మినేటివ్‌గా, కడుపు నొప్పిని తగ్గించే మందుగా ఉపయోగిస్తారు. దీనిని నమలడం ద్వారా నోటి దుర్వాసన ను తక్షణం నివారించబడుతుంది.
  • తీవ్రమైన పంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
  • అతిసార వ్యాధి నివారణకు యాలకుల పొడిని తేనెలో కలిపి తీసుకుంటే దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
  • టీ నీటితో మరిగించిన యాలకుల పొడి టీకి చాలా ఆహ్లాదకరమైన వాసనను ఇస్తుంది మరియు దీనిని ధీర్ఘ కాలిక మూత్రవిసర్జన, విరేచనాలు, గుండె దడ, అధిక పని వల్ల అలసట, నిరాశ మొదలైన వాటికి ఔషధంగా ఉపయోగించవచ్చు.
  • ప్రతిరోజూ ఒక టేబుల్ స్పూన్ తేనెతో ఒక ఏలకులు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, నాడీ వ్యవస్థను బలపరుస్తుంది. పైత్య౦, వాతం నివారించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి
  • కఫం, రక్త విరోచనాలు, దృష్టి దోషం, దురద మరియు వాంతుల నుంచి యాలకుల ద్వారా ఉపశమనం పాందవచ్చు.
  • పుచ్చగింజలతో కలిపి యాలకుల్ని తీసుకోవడం ద్వారా కిడ్నీలోని రాళ్ళను కరిగించవచ్చు. యాలకులను పొడి చేసి కలిపి వాడితే మూత్రం సాఫీగా వస్తుంది

లవంగాలు:

  • దంతాలకు మేలు చేసే లవంగాలను ఆహార పదార్థాలలో విరివిగా ఉపయోగిస్తారు.
  • లవంగాలు నూనె తీసినవి, తీయనివి కూడా లభిస్తాయి మరియు ఘాటు తక్కువగా ఉండి చవకగా దొరుకుతాయి.
  • పైత్యం, కఫం, రక్త విరోచనాలు, వాంతులు, పంటి నొప్పి మరియు ఎక్కిళ్ళను లవంగాలునిరోధిస్తాయి
  • అజీర్ణం, కడుపులో వ్యర్థంగా గడబిడకు కారణమయ్యే వాయువులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది

జీలకర్ర :

  • ప్రతిరోజు మనం తాలింపు సామానులో ఉపయోగించే ఆరోగ్యకరమైన రుచికరమైన మసాలా దినుసులలో జీలకర్ర ఒకటి.
  • దీన్ని ఆయుర్వేద వైద్యంలో కడుపు నొప్పి, తలనొప్పి, అజీర్ణం, జ్వరం, విరేచనాలు, వాపు, అపానవాయువు, గొంతు బొంగురుపోవడం మరియు కఫ నివారణిగా ఉపయోగిస్తారు. కాల్చిన పొడిని పైల్స్‌కు పూస్తారు.
  • దీన్ని దేశంలోని అన్ని ప్రాంతాల వారు వాడుతుంటారు. కొందరు జీలకర్ర పొడి చేసి వాడుకుంటారు.
  • దీన్ని ఎక్కువగా వేపుడు కూరల్లో వాడుతున్నారు.
  • అతిసారం, ఉదర సంబంధ రోగాలు సరి చేయడంలో జీలకర్ర బాగా ఉపయోగపడుతుంది.
  • జీర్ణక్రియలో చురుకుగాపాల్గొంటుంది.

ధనియాలు:

  • ఎన్నో దేశాలలో ధనియాల వాడకం ఉంది.
  • జీలకర్ర మరియు ఏలకుల గింజలతో కలిపి విత్తనాలను కషాయం చేయడం వల్ల అపానవాయువు, అజీర్ణం, వాంతులు మరియు పేగు రుగ్మతలలో ఉపయోగపడుతుంది.
  • రోగుల్లో పేగులలో అస్తవ్యవస్థ పరిస్థితిని, వ్యర్థ వాయువుల తయారీలను అదుపు చేస్తాయి.
  • అతి దాహం, అలసట, జలుబు మరియు దగ్గులను అరికడతాయి.
  • ఇది మద్యం యొక్క మత్తు ప్రభావాన్ని తగ్గించడం లో దోహదపడుతుంది.
  • ఆహారానికి రుచిని చేకూర్చుడంతో పాటు కమ్మని వాసన కలుగజేసే ధనియాలు సులభంగా మొలకెత్తుతాయి.

జాజికాయ :

  • దీన్ని ఆంగ్లం లో నట్ మేగ్ అని పిలుస్తారు.
  • కొన్ని ప్రత్యేక వంటకాలలో మసాలా (ద్రవ్యంగా) దీన్ని చేరుస్తారు. రోజు వాడే మసాలాలలో ఇది వాడరు.
  • మలేరియా జ్వరాన్ని మరియు విరోచనాలనుఅరికడుతుంది.
  • జాజికాయలను రాతి మీద అరగదీసి వచ్చిన గంధాన్ని ప్రాథమిక దశలో కుష్టు వ్యాధికి లేపనంగా వాడవచ్చు.
  • తేలికగా ఉండే జాజికాయల కంటే బరువైన కాయలు వాడటం మంచిది.
  • దీన్ని ఔషధ రూపంలో అధికంగా వాడుతుంటారు. దుర్వాసనను కప్పిపుచ్చడానికి జాపత్రిని నమలుతారు.
  • కడుపు నొప్పి, దగ్గు మరియు జలుబు నివారించడానికి పిల్లలకు వాడుతుంటారు.

మిరియాలు :

  • వీటిలో రెండు రకాలు ఉన్నాయి ఆవి ఎర్రవి మరియు నల్లనివి.
  • నల్లమిరియాలు ఆహార పదార్థాలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
  • అనాదిగా మంచి ఔషధ విలువలు ఉన్న దినుసులుగా మిరియాలు ప్రాముఖ్యత పొందాయి.
  • వీటిని పాశ్చాత్య దేశాలలో ప్రజలు వాడుతున్నారు.
  • జలుబు మరియు దగ్గుకు ఇది దివ్య ఔషధం. దీన్ని కషాయంగా కాచి, టీలో వేసుకొని త్రాగవచ్చు.
  • వాతం, శ్వాస సంబంధ వ్యాధుల్ని నయం చేస్తుంది. శరీరానికి ఉత్తేజాన్ని కలుగజేస్తాయి. అపస్మారకం, వణుకునుఅరికడతాయి.
  • అజీర్ణం మరియు మలేరియాలలో ఇవి ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయి.
  • ప్రాథమిక దశలో కుష్టు వ్యాధినినివారిస్తాయి.
  • పొడుగ్గా ఉండే మిరియాలు నిద్రలేమి పోగొడతాయి.

మెంతులు:

  • ఆహార పదార్థాలలో జీర్ణ ప్రక్రియను అలాగే జీవక్రియను దోహదం చేస్తాయి మరియు వాతాన్ని హరిస్తాయి.
  • క్రమం తప్పుకుండా ఉపయోగించండం వలన కడుపులో పురుగులు, నొప్పి, పొట్ట మెలిమెట్టినట్లు ఉండడం వంటివి తగ్గుతాయి.
  • విత్తనాల కషాయాన్ని మశూచి రోగులకు శీతలీకరణ పానీయంగా ఇస్తారు.
  • కీళ్ల నొప్పులు మరియు నడుము నొప్పులను తగ్గించడం లో మెంతులు కీలక పాత్ర వహిస్తాయి.
  • మధుమేహ వ్యాధి నివారణలో మెంతులు పాత్ర గణనీయమైనది.
  • ప్రసవానంతర కాలంలో చనుబాలివ్వడాన్ని ప్రేరేపించే శక్తి కోసం మెంతులు దోహదపడతాయి.
  • కాలేయ శుద్ధికి, గౌట్ వ్యాధికి మరియు రికెట్స్ వ్యాధికి మెంతులును ఉపయోగిస్తారు.

సోంపు గింజలు :

  • ప్రాచీన కాలం నుండి సోంపు గింజలను నోటి దుర్వాసన నిర్మూలనలో వాడేవారు.
  • ఆకుపచ్చ సోంపు గింజలు సువాసన వెదజల్లుతూ ఆరోగ్యాభివుధ్ధి కి తోడ్పడతాయి.
  • మంచి మౌత్ వాష్, యాంటీసెప్టిక్, జీర్ణ క్రియలలో దీని పాత్ర ఎంతో ఉంది.
  • శరీరంలో వేడిని హరిస్తుంది. ఎండబెట్టిన సోంపు గింజలు గొప్ప జీర్ణ కారిణిగా పనిచేస్తాయి.
  • ఆస్తమా నివారణలో కూడాదీనినివాడతారు.

దాల్చిన చెక్క:

  • దాల్సిన చెక్కను ఎక్కువగా రుచికి, సువాసనకు వాడుతారు.
  • వేడి శరీరం గలవారు దీన్ని తక్కువగా తినడం మంచిది.
  • పొట్టలోని ఇబ్బందుల్ని తగ్గిస్తుంది. గొంతుకి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
  • ఇది శరీర రంగులో నిగారింపు తీసుకు రాగలదు, కనుక లేపనాలలో సౌందర్య సాధనాలలో దీనిని వాడుతారు.
  • గరం మసాలాల్లో దీని వాడకం అధికం.

గసగసాలు:

  • ఇది అరుదు గాను, ఖరీదుగాను లభించే పదార్థం.
  • వీటి నుంచి తీసే నూనె అతిసారం, విరోచనాలకు మంచి మందుగా పనిచేస్తుంది.
  • కాలిన గాయాలు, బొబ్బలు, గసగసాలతో నయం చేయవచ్చు.

ఇంగువ :

  • దీనిని ముఖ్యంగా తాలింపులో సువాసన ద్రవ్యంగానే ఉపయోగించినప్పుటికీ ఔషధ గుణాలు ఇంగువలో అధికంగా ఉన్నాయి.
  • ఇది గట్టిపడిన పాల జిగురు వంటి పదార్థం అనిచెప్పవచ్చు.
  • రుచికరాన్ని ప్రసాదించే ఇంగువ ఆరోగ్యకారిణిగాకూడా ఉపయోగపడుతుంది.
  • గాస్ట్రిక్ లేదా అసిడిటీ సమస్యను నివారించి పొట్టకు మేలు చేస్తుంది.
  • వాతం నొప్పులు, దగ్గు నివారిస్తుంది, శరీరంలోని వాపు తగ్గేందుకు సహకరిస్తుంది.
  • నాడీ వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది.
  • జీర్ణ క్రియ, శ్వాసక్రియలకు చురుకైన ఔషధం.
  • కలరా వ్యాధిలో యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది.

వాము :

  • పూర్వం నుంచి జీర్ణక్రియలో ప్రధాన పాత్ర పోషించే దినుసుగా వాముకు ప్రత్యేకత ఉంది.
  • శరీరాన్ని హానికరమైన సూక్ష్మజీవుల నుండి రక్షిస్తుంది.
  • కొన్ని ఆహారాలకు వాము వల్లనే సుగంధం ఏర్పుడుతుంది. శ్వాసనాళాలను శుభ్రపరచి దగ్గు, జలుబు తగ్గిస్తుంది.
  • దీనివలన కడుపులో వికారం, గ్యాస్ ట్రబుల్ నివారించబడటమే కాక కఫం, గొంతులో గరగరకూడాతగ్గుతాయి.

పసుపు :

  • పసుపు మనకు సర్వరోగ నివారిణి గా ఉంటుంది.
  • అనేకమైన అనారోగ్యాలకు ఇది మంచి ఔషధం.
  • దెబ్బలు, పుండ్లు కాలిన గాయాలలో పసుపు వాడుతున్నారు.
  • వాతం, పిత్తం, కఫంను నివారిస్తుంది.
  • రక్తశుద్ధికి సహకరిస్తుంది. యాంటీబయాటిక్ ఇది.

అల్లం (శొంఠి):

  • అల్లం సుగంధ ద్రవ్యంగా ప్రసిద్ధి చెందింది. తాజా అల్లాన్ని వంటకాల్లో విరివిగా వాడతారు.
  • పచ్చి అల్లం మీద ఉన్న పొట్టు తీసి సున్నపు నీళ్ళతో శుద్ధి చేసి ఎండబెట్టిన అల్లాన్ని శొంఠి అంటారు.
  • దీన్ని ఉదర సంబంధమైన, పంటి సంబంధమైన రోగాలకు బాధా నివారణిగాను, ఔషధంగాను ఉపయోగిస్తారు. అజీర్ణానికి మంచి ఔషధం.
  • వయస్సు మళ్ళిన వారిలో జీర్ణ క్రియ కు బాగా దోహదం చేయగలవు.
  • కడుపుబ్బరం, కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్నివారిస్తాయి.

వెల్లుల్లి :

  • జీర్ణ క్రియ కు దోహదం చేస్తుంది.
  • ఏ ఇతర పదార్థాలతో కలిపి తీసుకోకుండా పరిగడుపున దీన్ని తీసుకోవడం ఉత్తమం.
  • సహజమైన యాంటిసెప్టిక్,
  • వెల్లుల్లి రసం చర్మవ్యాధుల నివారణలో వాడతారు.
  • ఈ రసానికి కొంత నీటిని చేర్చి లోపలకు తీసుకుంటే అల్సర్లు నయమవుతాయి.
  • వెల్లుల్లి ఆకులు ఆస్తమాను నివారిస్తాయి. హైబీపీ, క్యాన్సర్ ట్యూమర్స్ ను తగ్గిస్తాయి.
  • వెల్లుల్లి రేకుల్ని పాగ వేయడం ద్వారా దోమలను పారదోలవచ్చు.

కాబట్టి తరతరాలుగా మనం వాడే పైన చెప్పబడిన సుగంధ ద్రవ్యాలలో మసాలా దినుసులు ఎన్నో బెషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో రకాల ఔషధ గుణాలున్న పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అవగాహనతో వీటి గురించి తెలుసుకొని ఆచరణలో పెట్టడం ద్వారా ఆరోగ్యాన్ని పొందిన వారమవుతాము. ఈ సమాచారాన్ని అందరికీ చేరవేద్దాం.

డా. సీలోతు రాకేష్, కొబ్బరి అభివృద్ది బోర్డు, డా. జె. చీనా, శ్రీ కొండా  లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, phone : 87900 12858   

Leave Your Comments

మిద్దెతోటలో పెంచుకోదగిన ఔషధ మరియు సుగంధ తైల మొక్కలు

Previous article

అమెరికా టారిఫ్ తగ్గింపు ఆక్వా రంగానికి శుభవార్త

Next article

You may also like