వార్తలు

రైతులకు అందుబాటులోకి అధునాతన చెరకు రసం యంత్రాలు..

0

రైతు పంటను నేరుగా వినియోగదారుడికి అమ్ముకోగలిగితే అధిక ఆదాయం పొందవచ్చు. రాష్ట్రంలో విస్తరిస్తున్న చెరకు రసం వ్యాపారం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 265 మంది వరకు రైతులు తాము పండించిన చెరకు నుంచి రసం తీసి విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల మధ్య ధర ఉన్న అధునాతన చెరకు రసం యంత్రాలు అందుబాటులోకి రావడంతో చిన్న, సన్నకారు రైతులు అనేక మంది ఈ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. చెరకు ధర బాగా పతనమైన దశలో చేపట్టిన ఈ వ్యాపారం లాభసాటిగా ఉందని రైతులు చెప్పారు. ఈ వ్యాపారం రైతులకు ఏటీఎం తరహాలో నిత్యం ఆదాయాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
నాబార్డులోని నాబ్ – కిసాన్ విభాగం వ్యక్తులు జీవనోపాధి, ఆదాయ పెంపు కార్యకలాపాలకు రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్ పీ వో లు) ద్వారా రుణం ఇస్తుంది. ఎఫ్ పీవోలో ఉండే మూలధనానికి ఐదు రెట్ల రుణాన్ని ఎటువంటి పూచీకత్తు లేకుండా ఇస్తుంది. సక్రమ చెల్లింపుల అనంతరం వడ్డీ రాయితీ కూడా వర్తింపచేస్తుంది. వ్యక్తులకు నేరుగా నాబార్డు రుణం ఇవ్వదని నాబార్డు ఏపీ సీజీఎం సుధీర్ కుమార్ చెప్పారు. ఆత్మనిర్భర భారత్ ఓ భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ చిరు వ్యాపారులకు 35 శాతం సబ్సీడీ పై రుణాలు ఇస్తోంది.
ఆధునిక చెరకు రసం తీసే యంత్రం ఏటీఎం మెషిన్ తరహాలో ఉంటుంది. చెరకు ముక్కల్ని ఉంచితే గ్లాస్ లోకి రసం వస్తుంది. నిమ్మకాయ, అల్లాన్ని కూడా మెషిన్ లోనే కలిపి ఇవ్వొచ్చు. టన్ను చెరకు నుంచి 500 లీటర్ల వరకు రసాన్ని తీయొచ్చు. ప్రస్తుతం మార్కెట్ లో లీటరు రూ. 60 నుంచి రూ. 80 వరకు అమ్ముతున్నారు. రైతులే ఈ వ్యాపారంలోకి దిగితే దాన్ని రూ. 50 కి అమ్మినా 500 లీటర్ల రూ. 25 వేల వరకు ఆదాయం వస్తుంది. ఇందులో ఖర్చులు పోగా టన్ను చెరకుకు నికరంగా రూ. 17 వేల నుంచి రూ. 18 వేలు మిగులుతాయి. ప్రస్తుతం చెరకు టన్ను రూ. 7వేల వరకు కొనుగోలు చేస్తున్నారు.

Leave Your Comments

విటమిన్ “సి” ఉన్న ఆహారం తినడం వలన కలిగే ప్రయోజనాలు..

Previous article

ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏఐఎఫ్ రుణాల కోసం అధిక దరఖాస్తులు..

Next article

You may also like