తెలంగాణవార్తలువ్యవసాయ పంటలు

పీజేటీఏయూలో భారత్–ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్‌వర్క్ ప్రారంభం

0
2047 నాటికి మానవ రహిత వ్యవసాయం దిశగా అడుగులు: ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వెల్లడి.
రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH), చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ (CSU), ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU), బెంగళూరు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ (BeST), సిఓఈ-ఎఫ్‌పీఓ బెంగళూరు సంయుక్త ఆధ్వర్యంలో PJTAU – “ఇండియా–ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్‌వర్క్” (IASFN) కార్యక్రమాన్ని గురువారం  ప్రారంభించాయి.
ఈ కార్యక్రమం ద్వారా వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయ సాంకేతికతలు, ప్రిసిషన్ ఫార్మింగ్, నవకల్పనలు, స్థిరమైన వ్యవసాయ విధానాల్లో భారత్–ఆస్ట్రేలియా దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ వేదిక ద్వారా రెండు దేశాల విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌లు, పరిశ్రమలు మరియు ఇతర భాగస్వామ్య సంస్థల మధ్య సంయుక్త పరిశోధనలు, పైలట్ ప్రాజెక్టులు, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఈ సదస్సు లో భారత్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌లు, పరిశ్రమల భాగస్వాములు పాల్గొన్నాయి.
భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ (Philip Green) మాట్లాడుతూ రైతులు వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు భారత్–ఆస్ట్రేలియా భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు.
ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య  మాట్లాడుతూ విద్యా సంస్థలు, పరిశ్రమలు, సాంకేతిక నిపుణులు, రైతుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. 2047 నాటికి మానవ రహిత వ్యవసాయం దిశగా దేశం ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం (OPSA) ప్రతినిధి డాక్టర్ విశాల్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వాస్తవ సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయ శాస్త్రీయ భాగస్వామ్యాలు ఎంతో అవసరమన్నారు.
చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ ప్రో వైస్ చాన్స్‌లర్ మైకేల్ ఫ్రెండ్ (Michael Friend) మాట్లాడుతూ పరిశోధన, ఆవిష్కరణల ద్వారా స్థిరమైన మరియు వాతావరణ అనుకూల వ్యవసాయ అభివృద్ధికి ప్రపంచ స్థాయి భాగస్వామ్యాలు అవసరమని పేర్కొన్నారు.
‘RICH’, CEO, రష్మీ పింపాలే మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఉపయోగపడే స్థిరమైన పరిష్కారాల అభివృద్ధికి పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌లు, పరిశ్రమలు, ప్రభుత్వ విభాగాల మధ్య బలమైన అనుసంధానం ఏర్పడుతుందని తెలిపారు.
ఈ భారత్–ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్‌వర్క్ ద్వారా స్మార్ట్ వ్యవసాయ సాంకేతికతలు, వాతావరణ అనుకూల వ్యవసాయ విధానాలు, సంయుక్త ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం లభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి ఈ సి హెచ్ విద్యాసాగర్, పరిశోధన సంచాలకులు డాక్టర్ బలరాం, హిల్లరీ మాక్గీచీ (Ms. Hilary McGeachy), ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్, బెంగళూరు, అనంత రామన్, CEO , బెంగళూరు సైన్స్ టెక్నాలజీ క్లస్టర్, శ్రీమతి దీప్తి సునీల్, శ్రీమతి రామలక్ష్మి, సంయుక్త సంచాలకులు తెలంగాణ ఉద్యాన శాఖ తదితరులు పాల్గొన్నారు.
Leave Your Comments

స్వామినాథన్ కమిషన్ సిఫారసులను బుట్టదాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం 

Previous article

సపోటా సాగు–శాస్త్రీయ పద్ధతులతో అధిక దిగుబడి, రైతులకు స్థిరమైన ఆదాయం

Next article

You may also like