తెలంగాణవార్తలు

నేటి నుంచే అగ్రివర్సిటి నాణ్యమైన విత్తనాల విక్రయాలు మొదలు ఉపకులపతి ప్రొ. అల్దాస్ జానయ్య

0
నేటి నుంచే అగ్రివర్సిటి నాణ్యమైన విత్తనాల విక్రయాలు మొదలు ఉపకులపతి ప్రొ. అల్దాస్ జానయ్య
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ పరిశోధనా కేంద్రాలు, రైతు విజ్ఞాన కేంద్రాలు మరియు కృషి విజ్ఞాన కేంద్రాలలోని క్షేత్రాలలో శాస్త్రవేత్తల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్పత్తి చేసిన నాణ్యమైన మూల విత్తనాన్ని విశ్వవిద్యాలయం వివిధ జిల్లాలలో ఏర్పాటు చేసిన (27) విక్రయ కేంద్రాలలో ఈ నెల 23 నుండి 30 వరకు నిర్వహించే “విత్తన వారోత్సవాలలో” భాగంగా సిద్ధంగా ఉంచిన సుమారు 1230 టన్నుల విత్తన విక్రయాలు నేటి నుంచి ప్రారంభమవుతాయని వర్సిటి ఉపకులపతి ప్రొ. అల్దాస్ జానయ్య ఒక ప్రకటనలో తెలియచేసారు. ఈ కార్యక్రమాన్ని నేడు రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు శ్రీ. తుమ్మల నాగేశ్వర రావు గారు రాజేంద్రనగర్ లో లాంచనంగా ప్రారంభిస్తారు. కావున ఈ నెల 18 నుండి 23 వరకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకొన్న రైతులు పట్టికలో చూపించిన ఆయా విక్రయ కేంద్రాల నుండి విత్తనాలను తీసుకెళ్ళాలని ఉపకులపతి రైతులను కోరారు. అదేవిధంగా అడ్వాన్స్ బుకింగ్ చేసిన రైతులకు విత్తనాలు విక్రయించగా మిగిలిన విత్తనాన్ని ఇతర రైతులకు ఆయా కేంద్రాల వద్ద అమ్మకానికి సిద్ధంగా ఉంటాయని తెలిపారు. విత్తన కొనుగోలుకు విత్తన లభ్యతను సంబంధిత కేంద్రాల ఇన్చార్జ్ నుండి ముందస్తుగా సమాచారం తెలుసుకొని అడ్వాన్స్ బుకింగ్ చేయని రైతులు ఆయా కేంద్రాలకు కొనుగోలుకు వెళ్ళాలని సూచించారు.
ప్రతి రైతు, సంబంధిత విక్రయ కేంద్రాల నుండి విత్తనం కొనుగోలు చేసేటప్పుడు విశ్వవిద్యాలయ అధికారిక రశీదుతో పాటు సంబంధిత సాంకేతిక పత్రాన్ని విధిగా ఆయా శాస్త్రవేత్తల నుండి పొందాలని కోరారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ విక్రయ కేంద్రాలలో సంయమనం పాటిస్తూ విత్తనాలు కొనుగోలు చేయాలని కోరారు.
         
Leave Your Comments

రైతు సంక్షేమమే లక్ష్యం.. హార్టికల్చర్ రంగంలో ఏపీకి కొత్త దిశ

Previous article

వ్యవసాయ వర్సిటీ విత్తన వారోత్సవాలు-2026 ప్రారంభించిన మంత్రి తుమ్మల

Next article

You may also like