పుచ్చకాయలో 92 శాతానికి పైగా నీటి శాతం ఉంటుంది, ఇది శరీరానికి తక్షణ శక్తిని మరియు హైడ్రేషన్ను అందిస్తుంది. వేసవిలో వచ్చే డీహైడ్రేషన్ సమస్యలను నివారిస్తుంది. ఇది విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మరియు పొటాషియం వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇది తక్కువ కాలంలో (సుమారు 70-80 రోజులు) అధిక ఆదాయాన్ని ఇచ్చే పంట. ఫిబ్రవరి నెలలో వచ్చే శివరాత్రి, రంజాన్ పండుగలకు అనుగుణంగా నాటుకోవచ్చు. పుచ్చ నుంచి ఎకరాకు 20 నుండి 25 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దీనికోసం సరైన యాజమాన్య పద్ధతులు, నీటి నిర్వహణ పాటించడం చాలా ముఖ్యం.
నేలలు:- ఇసుక,తేలికపాటి నల్ల రేగడి నేలల్లో పుచ్చని సాగు చేసుకోవచ్చు.
ఉదజని సూచిక: 6.2 నుండి 7.5 ఉన్న నేలలు అనువైనవి.
నేల తయారీ:- నేల వదులుగా అయ్యే వరకు దున్నుకుని, బోదెలు మరియు కాలువల పద్ధతిలో తయారు చేసుకోవాలి. కాలువలు 60 సెం. మీ వెడల్పుతో చేసి కాలువకు ఇరు వైపులా విత్తనాన్ని విత్తుకోవాలి మరియు ముఖ్యంగా వేసవిలో తీగలు నేలపైకి వెళ్లడానికి వీలుగా చేయాలి.
విత్తన మోతాదు:- సాధారణ రకాలు – 600గ్రా, సంకర రకాలు -200 – 250 గ్రా. వాతావరణం చల్లగా ఉన్న ఎడల విత్తనాలను ప్రోట్రేలలో రెండు ఆకుల దశ వరకు పెంచుకోవాలి.
విత్తన శుద్ధి:- 30 గ్రా. ట్రైకోడెర్మా విరిడి కిలో విత్తనాలను వేసి విత్తన శుద్ధి చేయాలి లేదా కిలో విత్తనాలకి 2 గ్రా. కార్బెండెజిమ్ వేసి శుద్ధి చేయాలి.
విత్తే విధానం:- పాదుల మధ్య దూరం: 2.0 మీటర్లు నుండి 2.5 మీటర్లు.
మొక్కల మధ్య దూరం : 60 సెం.మీ. (0.6 మీటర్లు) నుండి 1 మీటర్.
మొక్కల సాంద్రత : ఎకరానికి సుమారు 3400 నుండి 4500 మొక్కలు నాటుకోవచ్చు.
అధిక దిగుబడులకు పుచ్చ సాగులో ఎంచుకోవలసిన రకాలు:
తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ డిమాండ్ ని (ఎరుపు లేదా పసుపు కండ) ఆధారంగా అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలను ఎంచుకోవాలి. ప్రసిద్ధ ఎంపికలలో
1.F1 కావ్య, F1 దివ్య:-
అరిజోనా అగ్రిటెక్ కంపెనీ నుండి విడుదలైన రకాలు
ఆకారం : అండాకారం
కాయ బరువు : 3-6 కి.లో
కాయ రంగు : ముదురు ఆకుపచ్చ రంగు తోలు, ముదురు ఎరుపు కండ
పంట కాలం : 65-70 రోజులు
2.KSP 1358 మెలోడీ:
కలాష్ సీడ్స్ కంపెనీ నుండి విడుదలైన రకం
ఆకారం : అండాకారం
కాయ బరువు : 4-7 కి.లో
కాయ రంగు : నల్లటి తోలు,ముదురు ఎరుపు కండ
పంట కాలం : 65-70 రోజులు
- సాగర్ కింగ్ :-
సాగర్ సీడ్స్ కంపెనీ నుండి విడుదలైన రకం
ఆకారం : అండాకారం
కాయ బరువు : 4-7 కి.లో
కాయ రంగు : ముదురు ఆకు పచ్చ తోలు, ముదురు ఎరుపు కండ
పంట కాలం : 65-70 రోజులు
- సూపర్ క్వీన్:-
సింజెంట్ కంపెనీ నుండి విడుదలైన రకం
ఆకారం : అండాకారం
కాయ బరువు : 4-5 కి.లో
కాయ రంగు : ముదురు నలుపు తోలు, ముదురు ఎరుపు కండ
పంట కాలం : 65-70 రోజులు
5.షుగర్ క్వీన్:
సింజెంట్ కంపెనీ నుండి విడుదలైన రకం
ఆకారం : అండాకారం
కాయ బరువు : 3-6 కి.లో
కాయ రంగు : ముదురు నలుపు తోలు,ముదురు ఎరుపు కండ
పంట కాలం : 65-70 రోజులు
6.NS 295 :-
నాందారి కంపెనీ నుండి విడుదలైన రకం
ఆకారం : అండాకారం
కాయ బరువు : 6-7 కి.లో
కాయ రంగు: లేత ఆకుపచ్చ రంగు తోలు, ఎరుపు రంగు కండ
పంట కాలం : 70 రోజులు
- ఆరోహి :-
నోన్ – యూ సీడ్ ఇండియా కంపెనీ నుండి విడుదలైన రకం
ఆకారం : అండాకారం
కాయ బరువు : 3-4 కి.లో
కాయ రంగు: ముదురు ఆకుపచ్చ రంగు తోలు, పసుపు పచ్చ రంగు కండ
పంట కాలం : 60-70 రోజులు
8.విశాల:-
నోన్ – యూ సీడ్ ఇండియా కంపెనీ నుండి విడుదలైన రకం
ఆకారం : అండాకారం
కాయ బరువు : 2.5-3.5 కి.లో
కాయ రంగు : పసుపు పచ్చ రంగు తోలు,ఎరుపు రంగు కండ
పంట కాలం : 70-75 రోజులు
9.షుగర్ బేబీ:-
కాయ బరువు : 2- 4 కిలోలు
కాయ రంగు : ముదురు ఆకుపచ్చ రంగు తోలు,ముదురు ఎరుపు కండ
చక్కెర శాతం :11-13%
దిగుబడి :150 క్విం./హె.
- అసాహి యమాటో:-
కాయ బరువు : 6 – 8 కిలోలు
కాయ రంగు: బయట లేత ఆకుపచ్చ చారలు, లోపల ముదురు ఎరుపు రంగు
చక్కెర శాతం : 11 నుండి 13%
దిగుబడి : 225 క్విం./హె.
11.అర్కా మాణిక్:-
కాయ బరువు : 6 కిలోలు
కాయ రంగు : బయట లేత ఆకుపచ్చ చారలు, లోపల ముదురు ఎరుపు రంగు
చక్కెర శాతం : 12-15%
దిగుబడి : 600 క్విం./హె.
బూడిద తెగులును తట్టుకునే శక్తి ఉంటుంది
12.అర్కా జ్యోతి:-
కాయ బరువు : 5-6 కిలోలు
కాయ రంగు : బయట ముదురు ఆకుపచ్చ చారలు, లోపల ముదురు ఎరుపు రంగు
చక్కెర శాతం :12-14%
దిగుబడి : 800 క్విం./హె.
మల్చింగ్ షీట్: మల్చ్ వాడడం వలన కలుపుని మరియు నీటి యాజమాన్య ఇబ్బందులను తగ్గించవచ్చు.
ఎరువుల యాజమాన్యం:- ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 నుండి 15 టన్నుల బాగా కుళ్ళిన పశువుల ఎరువును వేసి కలీయదున్నలి. నత్రజని 40 కిలోలు,భాస్వరం 32 కిలోలు , పొటాష్ 16-20 కిలోలు ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజని కోసం యూరియాని మూడు సమభాగాలుగా చేసుకుని మొదటి భాగం విత్తనం విత్తేటప్పుడు,రెండవ భాగం 25 నుండి 30 రోజుల దశలో,మూడవ భాగాన్ని 50 నుండి 60 రోజుల దశలో ఇలా మూడు దఫాలుగా వేసుకోవాలి.పొటాష్ కూడా రెండు దఫాలుగా వేసుకోవాలి.మొదటి దశలో,మూడవ భాగం యూరియా తో పాటు కలిపి వేసుకోవాలి.భాస్వరాన్నీ ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి.
పోషక యాజమాన్యం:-
కాయలు పగుళ్లు రాకుండా, ఆడ పూత ఎక్కువగా రావడం కొరకు పంట వేసిన 30 నుండి 40 రోజులకు బోరాక్స్ పౌడర్ను 2-3 గ్రా. లీ.నీటికి కలిపి పిచికారి చేయాలి. ఇలా చేయడం ద్వారా ఫలదీకరణ బాగా జరిగి దిగుబడి పెరుగుతుంది. మొక్కలు పెరిగే దశలో కొనలు బాగా పెరుగుతాయి, ఒక మీ.పెరిగిన తరువాత కొత్తగా వచ్చిన చిగుర్లను కత్తిరించాలి. ఇలా చేయడం వలన పక్క కొమ్మలు పెరిగి దిగుబడి పెరుగుతుంది.
నీటి యాజమాన్యం:-
వారానికి ఒకసారి నీరు పెడుతూ ఉండాలి. పూత సమయంలో నీటి వత్తిడి లేకుండా
చూసుకోవాలి. కాయలు వచ్చే సమయంలో నీటిని ఎక్కువగా పెడితే కాయ నాణ్యత తగ్గుతుంది.
చీడపీడలు:-
పండు ఈగ :- పండు ఈగ యొక్క లార్వాలు కాయలలోకి చొచ్చుకుపోయి కాయలను కుళ్ళిపోయేలా చేస్తాయి. ఈ పురుగు నివారణకు ముందస్తుగా పంట చేనులో పూతదశలో క్యూలూర్ ఎరలను ఏర్పాటు చేసుకోవాలి. క్యూలూర్ అందుబాటులో లేని సమయములో 10 లీటర్ల నీటిలో 100 మి.లీ మలాథియాన్, 100 గ్రాముల బెల్లం కలుపుకొని వెడల్పాటి పళ్ళెంలో ఈ ద్రవాన్ని పోసి పంట చేనులో అక్కడక్కడ ఎరలుగా ఉంచాలి. దీనివల్ల ఈ పండు ఈగ కాయలను ఆశించక ముందే నివారించవచ్చు. పంటకు ఆశించిన వెంటనే నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 2 మి.లీ మలాథియాన్ లేదా 2 మి.లీ క్లోరిపైరిఫాస్ కలుపుకొని పిచికారి చేసుకోవలెను.
ఎర్ర నల్లి:- పొడి వాతావరణ పరిస్థితులలో ఈ ఎర్రనల్లి పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు ఆకు యొక్క అడుగు భాగమునకు చేరి రసాన్ని పిలుస్తూ పంటకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణ చర్యకు 1 లీటర్ నీటికి 1.5 మి.లీ స్పెరోమెసిఫిన్ లేదా 3 మి.లీ ప్రోపర్ గైడ్ కలుపుకొని పిచికారి చేసుకోవలెను.
తెల్ల దోమ:- జిగురు కలిగిన పసుపు రంగు అట్టలను ఏర్పాటు చేసుకోవలెను. వీటి ఉధృతి ఎక్కువగా ఉంటే నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 3 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 2 గ్రాముల ఎసిటామిప్రిడ్ కలుపుకొని పిచికారి చేసుకోవలెను.
తామర పురుగు:- తామర పురుగు వలన ఆకులు ముడతలుగా, పసుపు రంగుకు మారి మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది. నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 2 మి.లీ ఫిప్రోనిల్ కలుపుకొని పిచికారి చేసుకోవలెను.
తెగుళ్లు :-
బూజు తెగులు:- గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల అడుగు భాగాన తెల్లని బూజువంటి శిలీంద్రం అభివృద్ధి చెందుతుంది. ఆకుల పై భాగం లో పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటరు నీటిని మాన్కోజబ్+మెటలాక్సీల్ కలిపిన మందు 2 గ్రా. చొప్పున కలిపి పిచికారి చేయాలి.
బూడిద తెగులు:- తెల్లటి బూడిద వంటి శిలీంద్రం ఆకుల పై గుండ్రని మచ్చలుగా ఏర్పడి క్రమేపి ఆకుమొత్తం వ్యాపిస్తుంది.ఎక్కువగా ముదురు ఆకులను ఆశిస్తుంది. దీని నివారణకు కార్బెండజిమ్ ఒక గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పదిరోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
వైరస్ తెగులు:- వేడి వాతావరణంలో రసంపీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు వైరస్ తెగుళ్లు వ్యాపిస్తాయి. వీటిలో ఎక్కువగా ఆకుముడత, మొజాయిక్ వైరస్ ఆశిస్తాయి. వీటి నివారణకు తెల్లదోమ, పేనుబంకలను సకాలంలో అరికట్టాలి. తెగులు ఆశించిన మొక్కలను తీసేసి వెంటనే తగలబెట్టాలి. తెగులు తట్టుకునే రకాలను ఎంచుకుని సాగుచెయ్యాలి. సమతుల ఎరువుల యాజమాన్యం పాటించాలి.
G.హరిత, pg స్కాలర్ (వెజిటబుల్ సైన్స్), SKLTGHU
శ్రీమతి A.V.N లావణ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ వెజిటబుల్ సైన్స్, SKLTGHU.
డాక్టర్. కె. చైతన్య, అసిస్టెంట్ ప్రొఫెసర్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, PJTAU
Cell No – 95332 29343


























