వ్యవసాయ రంగంలో ఏఐ( AI ) వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి
నెదర్లాండ్ కంపెనీ ARIQT ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమావేశం
హైదరాబాద్ :-
ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న సాంకేతికత మరియు ప్రత్యేకించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వృద్ధిని దృష్టిలో ఉంచుకొని, వ్యవసాయరంగాన్ని ఆధునికరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేశారు. ఈ రోజు మంత్రి గారు నెదర్లాండ్కు చెందిన ARIQT అనే కంపెనీ ప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించారు. కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా రైతులకు ఒకేసారి సమాచారాన్ని అందించడం, రైతుల ఫిర్యాదులకు ఏఐ ఆధారంగా తక్షణ సూచనలు ఇవ్వడం వంటి సౌకర్యాలు కల్పించగలమన్నారు. అంతేకాకుండా, పంటలపై వచ్చే చీడపీడలను మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా స్కాన్ చేసి గుర్తించే టెక్నాలజీని రాష్ట్రంతో భాగస్వామ్యంగా తీసుకురావడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల గారు మాట్లాడుతూ, “ప్రతినిధుల సూచనలు పరిశీలనకు తీసుకుంటాం. వారు వివరించిన సాంకేతికతను మొదటగా వెరిఫై చేసి, ఏఏ ప్రభుత్వ పథకాలలో దీన్ని సమర్థవంతంగా వినియోగించవచ్చో వ్యవసాయశాఖ అధికారులు అధ్యయనం చేయాలి,” అని సూచించారు.
ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రఘునందన్ రావు గారు, వ్యవసాయ డైరెక్టర్ శ్రీ గోపి గారు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Leave Your Comments


























