వార్తలు

రైతు సోదరుల ఆత్మీయ సమ్మేళనం

0

 

గుంటూరు జిల్లా పెదవడ్లపూడి నందు జరిగిన రైతు సోదరుల ఆత్మీయ సమ్మేళనం నందు రైతు సోదరులు ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ల్స్ ను బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ కొత్త చట్టాల వల్ల రైతులకు జరిగే మేలు గురించి వివరించటం జరిగింది.

సేంద్రీయ వ్యవసాయము భవిష్యత్తులో కీలక భూమిక పోషించనున్న క్రమంలో దాని యొక్క ఆవశ్యకతను గుర్తించడం సమాజానికి చాలా అవసరం అని, రసాయన రహిత ఆహారోత్పత్తులు వినియోగం ద్వారా ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవన ప్రమాణాలు పెంపొందే కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు ప్రాయోజిత పధకాలపై రాష్ట్ర రైతాంగం దృష్టిసారించి మెరుగైన ఫలితాలు పొందుకునే దిశగా కార్యాచరణ ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్నారు. ఈ కార్యక్రమములో రాజ్యసభ సభ్యులు జి వి ల్ గారు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Leave Your Comments

‘ఏరువాక’ మాసపత్రిక ఆవిష్కరణ

Previous article

 ఇక రైతు బంధు ఇంటికే….

Next article

You may also like