చీని (బత్తాయి ), నిమ్మ పండ్ల మొక్కలను భారతదేశంలోని ఉత్తరాన ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, మరియు ఈశాన్య రాష్ట్రమైన అస్సాం అదేవిధంగా దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో విరివిగా సాగు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిమ్మ జాతి మొక్కలను 40 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాలలోని దేశాలలో సాగు చేస్తున్నారు. వీటిలో ప్రధానంగా చైనా, బ్రెజిల్, అమెరికా ఇంకా మధ్యధరా సరిహద్దులో ఉన్న దేశాలు విరివిగా సాగు చేస్తున్నాయి. ఉష్ణ మండలము మరియు ఉపఉష్ణ మండలంలో సాగు చేస్తున్న పండ్ల మొక్కలలో మామిడి, అరటి, తరువాత నిమ్మ జాతి మొక్కలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి.
ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో సాగవుతున్న నిమ్మ జాతి మొక్కలలో అతి ముఖ్యమైన వ్యాధులైన బంక తెగులు,వేరు కుళ్ళు ,పొలుసు పురుగు, నల్లి, తామర పురుగు, కాండం తొలిచే పురుగు, పల్లాకు వంటి వ్యాధుల వల్ల సాగు చేస్తున్న మొక్కలు క్రమంగా చనిపోతూ వస్తున్నాయి. వీటికి గల అనేక కారణాలను విశ్లేషించి, ప్రాక్టికల్ రీసెర్చ్ చేసి ప్రోటోకాల్స్ రూపంలో ప్రతి అంశాన్ని విశదీకరించడం జరిగింది.
భవిష్యత్తులో నిమ్మ జాతి మనుగడ ప్రశ్నార్ధకం కాకుండా మంచి వేరు మూలము, మంచి తల్లి మొక్క నుంచి తీసిన మొగ్గ మీద ఆధారపడి ఉంటుంది. వివిధ వాతావరణ పరిస్థితులకు, పురుగు ఉధృతికి, నీటి ఎద్దడికి, తట్టుకొని మనుగడ సాగించే మంచి – మేలురకం జాతి వంగడాలను తీసుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. వీటి మీద భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.
క్షేత్ర పరిశోధన ప్రకారం బత్తాయి, నిమ్మ మొక్కల ఎంపిక విధానం :
బత్తాయి లేదా నిమ్మ మొక్కలను సాగు చేయాలనుకునే రైతు సోదరులు దిగువ తెలిపిన జాగ్రత్తలు పాటించి మొక్కలు ఎన్నుకోవాలి.
. అంటు మొక్కలు చూడటానికి కాంతివంతంగా ఉండాలి.
. అంటు మొక్కల కాండము పైన ఆకుల పైన దిగువ తెలిపిన వ్యాధి లక్షణాలు ఉండరాదు.
- ఆకుల పై గజ్జి తెగులు.
- కొమ్మల పైన బంక యొక్క లక్షణాలు.
- మొక్క గుబురులో అనగా ఆకుల పైన నల్లి, చక్కెర తెగులు, మసి తెగులు వంటి లక్షణాలు ఉండరాదు.
- ఆకుల పైన పల్లాకు ఉండరాదు.
- మొక్క ప్రధాన కాండం పైన, కొమ్మలపైన ఎటువంటి గాయాలు ఉండరాదు.
- మొక్క ప్రధాన వేరు చుట్టూ తెల్ల వేరు వ్యవస్థ అధికంగా ఉండాలి.( దీనినే పీచు వేరు అంటారు ).
- మొక్క యొక్క గుబురులో ఆకులు రాలిపోవడం, నేల చూపు చూడడం వంటి లక్షణాలు ఉండకూడదు.
- అంటు మొక్కలకు వెంటనే పూత అధికంగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తే మొక్క శరీరంలో వ్యాధి ఉన్నట్లు నిర్ధారించాలి.
- 15 నెలల కంటే పైబడిన మొక్కలు ఎన్నిక చేసుకోరాదు.
- మొక్కలు నాటడానికి అనుకూలమైన సమయం జూన్ నుంచి ఆగష్టు వరకు.
- అంటు మొక్క యొక్క పీచు వేరు కానీ తల్లి వేరు గాని అధికంగా డామేజ్ కాకూడదు.
- నర్సరీ కి సంబంధించి మంచి అనుభవము, నైపుణ్యము, పూర్వ చరిత్ర కలిగిన నర్సరీ నుంచి అంటూ మొక్కలు ఎన్నుకోవాలి.
క్షేత్ర పరిశోధన ప్రకారం పండ్ల మొక్కలు నాటే విధానం :
స్టెప్ -1 :- మొక్క నాటడానికి ముందు గుంతలు తీసి ఉంచుకోవాలి.
మొక్క నాటడానికి ముందు రోజు నీరు ఇవ్వరాదు. మొక్క పాకెట్ లో ఉన్న మట్టి గట్టిగా ఉండాలి.
స్టెప్ -2 :- గుంత తీసిన మట్టిలో బాగా మగ్గిన ఎరువు లేదా మిశ్రమం కలిపి 50% గుంతలో వేసిపెట్టాలి.
స్టెప్ -3 :- మొక్క నాటే సమయంలో ప్యాకెట్ చుట్టూ ఉన్న కవర్ను నెమ్మదిగా తీసి మొక్కను గుంతలో ఉంచిన తర్వాత చుట్టూ మట్టి తో కలిపిన ఎరువులు మిశ్రమం వేయాలి.
స్టెప్ -4 :- మొక్క నాటే సమయంలో (అంటు ) భూమి పైన ఉండేటట్లు చూడాలి. మొక్క నాటిన తర్వాత అంటు చేసిన భాగం మనకు కనిపించాలి.
స్టెప్ -5 :- మొక్క నాటిన తర్వాత మొక్క పాదు చుట్టూ నెమ్మదిగా కొద్దిగా తొక్కాలి.
స్టెప్ -6 :- మొక్క నాటడం పూర్తయిన తర్వాత. వెంటనే ఒక బిందె నీరు వేపించాలి.
స్టెప్ -7 :- కొత్తగా నాటిన మొక్కకు సపోర్ట్ గా పొడువాటి కట్టే ఉంచాలి. దీనివల్ల మొక్క గాలికి ఊగకుండా ఉంటుంది.
స్టెప్ -8 :- మొక్క నాటిన రెండవ రోజు పాదులు మళ్లీ కొద్దిగా తొక్కి డ్రిప్పర్స్ ద్వారా నీరు అందించాలి.
స్టెప్ -9 :-మొక్క నాటిన 10 నుంచి 15 రోజుల లోపు కొత్త ఇగురు రావడం జరుగుతుంది.
స్టెప్ -10 :- కొత్త ఇగురు వచ్చిన వెంటనే పురుగులు ఆశించకుండా చేయవలసిన పిచికారి :- పెస్ట్ ఆయిల్-1.5 మి. లీ. /లీటర్
క్షేత్ర పరిశోధన ప్రకారం పండ్ల మొక్కలలో నీటి నిర్వహణ :
1.పండ్ల మొక్కలలో నీరు డబల్ రింగ్ మెథడ్ లో పారించాలి.
2.నీరు పారించే సమయంలో మొక్క ప్రధానకాండానికి నీరు తగలకుండా పిల్ల పాదు ఏర్పాటు చేయాలి.
3.మొక్క ప్రధానకాండం చుట్టూ /\ షేపులో మట్టి వేపించాలి.
4. మొక్కపాదులో నీరు నిలవకుండా చూడాలి.
5. మొక్క పాదులు తడి పొడి ఉండేటట్లు నీటి తడులు ఇవ్వాలి.
6. మొక్కలకు నీరు అందించే లాటర్ + డ్రిప్పర్స్ మొక్క పెద్ద పాదులో ఉండేటట్లు అమర్చాలి. లేదా మొక్క గుబురుకు మధ్యలో ఉండేటట్లు చూడాలి.
7. మరీ ముఖ్యంగా రైతు తోటలోని భూమి స్వభావముని అనుసరించి మొక్కలకు నీటి తడులు ఇవ్వాలి.
8. చౌడు భూములలో వేసిన పండ్ల మొక్కలకు రోజు మార్చి రోజు కాకుండా, నేల స్వభావం మరియు వాతావరణాన్ని బట్టి నీటిని అందించడం మంచిది.
9. ఎర్ర నేలలు కండ కలిగిన నెలలో తేమశాతం నిలుపుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి 3 నుంచి 5 రోజుల వ్యవధిలో నీరు పారించాలి.
10. వేసవికాలంలో నిమ్మ జాతి మొక్కలకు ప్రతిరోజు లేదా రోజు మార్చి రోజు నీరు ఇవ్వడం ఉత్తమం.
11. శీతాకాలంలో లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నీటి తడులు తక్కువగా ఇవ్వాలి.
12. నిమ్మ జాతి మొక్కలలో నీరు పారించే సమయంలో మొక్క ప్రధాన కాండనికి నీరు పదేపదే తగలడం లేదా మొక్క పాదులో నీరు ఎక్కువ మొత్తంలో నిలవడం వల్ల కాండంకుళ్ళు, వేరు కుళ్ళు, పల్లాకు వంటి సమస్యలు తలెత్తుతాయి. మొక్క ప్రధాన కాండం చుట్టూ కొద్దిగా వాలు మైంటైన్ చేయడం వల్ల ఈ వ్యాధుల నుంచి బయటపడవచ్చు.
క్షేత్ర పరిశోధన ప్రకారం వివిధ రకాల వ్యాధులు రాకుండా తోట శుభ్రత పాటించడం :
- తోటలో వ్యాధి సోకిన, ఎండిన, చనిపోయిన కొమ్మలు,మొక్కలు తీసివేయాలి.
- ఇన్ఫెక్షన్స్ సోకిన కొమ్మలను 2 ఇంచెస్ కిందికి కట్ చేయాలి.
- మొక్క ప్రధాన కాండానికి బంక కారడం లేదా ఆయిల్ మచ్చ కనిపించిన వెంటనే పదునైన కత్తితో కొద్దిగా గోకి బ్లిటాక్స్ (COC), క్లోరిఫిరిఫాస్ (20EC) రెండు పేస్ట్ లాగా కలిపి బంక గోకిన ప్రదేశం లో పట్టించాలి.
- మొక్క పాదులు శుభ్రంగా ఉంచుకోవాలి, మరి ముఖ్యంగా కలుపు నివారించాలి.
- మొక్క ప్రధాన కాండం మీద భూమి నుంచి 1.5 – 2 ఫీట్ హైట్ వరకు బోర్డు మిశ్రమం పట్టించాలి.
- మొక్క పాదులు డబల్ రింగ్ మెథడ్లో అమర్చి మొక్క పాదులో నీరు నిలవకుండా చూడాలి.
- రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గించడానికి ప్రతి ఐదు మొక్కలకు ఒక జిగురు అట్ట అమర్చాలి.
- తోట మధ్య భాగంలో లైట్ ట్రాప్స్ అమర్చాలి.
- పండ్ల మొక్కల పాదులలో పండు మాగిపోయి రాలిన పండ్లు, ఎండు కొమ్మలు, లేకుండా చూడాలి. ఇవి వ్యాధికారక జీవిని స్ప్రెడ్ చేస్తాయి.
- తోటలోకి అడవి జంతువులు కుక్కలు వంటివి రాకుండా నిరోధించాలి.
- మొక్కపాదులో గడ్డి తీసే సమయంలో,లేదా ట్రాక్టర్ తో సేద్యం చేసే సమయంలో మొక్క ప్రధాన కాండాన్ని కానీ, కొమ్మలకు కానీ గాయాలు అయిన వెంటనే దిగువ తెలిపిన ఫంగిసైడ్ పట్టించాలి.
“మాంకోజెబ్ +మెటలాక్సిల్ లేదా అలీట్ ఫోసెటైల్ (80%) పేస్ట్ లాగా కలిపి గాయమైన ప్రదేశంలో పట్టించాలి.
క్షేత్ర పరిశోధన ప్రకారం పండ్ల మొక్కలలో కొమ్మ కత్తిరించే విధానం :
కొమ్మ కత్తిరించే ముందు పనిముట్లు అనగా కత్తెర,రంపము,కొడవలి శుభ్రం చేయాలి.
శానిటైజేషన్ విధానం :
1.ముందుగా పనిముట్లకు ఉన్న మట్టి, కొమ్మల వ్యర్ధాలు, వ్యాధికి సంబంధించిన పదార్థాలు ఏవైనా అంటుకుని ఉంటే తీసివేయాలి.
2.ఒక లీటర్ నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ – 5గ్రా/లీటర్, క్లోరోఫైరిఫాస్ (20Ec) – 2మి.లీ/లీటర్. ఒక బకెట్లో కలుపుకొని కొమ్మ కత్తిరించే పనిముట్లు అన్ని అందులో ఉంచాలి.(5Min)
3.మందుల షాపులో దొరికే డెటాల్ 5-10 మి. లీ / లీటరు సహాయంతో పిచికారి చేపించి కాటన్ బట్టతో పనిముట్లు తుడిచి మొక్క కత్తిరింపు మొదలుపెట్టాలి.
ఎటువంటి కొమ్మలు కట్ చేపించాలి :
- ముందుగా మొక్క గుబురులో వ్యాధి సోకిన ఎండిన (వొట్టి పుల్ల) కొమ్మలను తీసివేయాలి.
- మొక్క గుబురులో ఉన్న అడ్డు కొమ్మలు, నీటి కొమ్మలు, నేల చూపు చూస్తున్న కొమ్మలు, గాలి వెలుతురుకు అడ్డుగా ఉన్న కొమ్మలు, జానా బెత్త కొమ్మలను కట్ చేయాలి.
- ఏదైనా కొమ్మలకు ఇన్ఫెక్షన్ సోకి ఉండడం గమనించినప్పుడు. 2 సెంటీమీటర్స్ దిగువ కట్ చేయాలి. అనగా ఆరోగ్యంగా ఉన్న ప్రదేశం వరకు కట్ చేయాలి.
- 1 నుండి 2 అంగుళాల పైన కట్ చేసిన కొమ్మ పైన వెంటనే బోర్డు మిశ్రమం పట్టించాలి.
- మొక్క గుబురు కత్తిరించిన వెంటనే కింద పడిన వ్యర్థాలను తీసి దూరంగా వేయడం లేదా కాల్చి వేయడం చేయాలి.
- కొమ్మ కత్తిరించిన వెంటనే లేదా రెండవ రోజు పిచికారి చేయవలసిన మందులు.
పిచికారి చేయవలసిన మందులు :-
పిచికారి : 1
. ఫంగిసైడ్ (కార్బెండజిమ్ +మాంకోజెబ్) మోతాదు: -2 గ్రా. /లీటర్
. బాక్టీరిసైడ్-0.5gm/లీటరు (స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్+టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్)
. పురుగుమందు (ప్రొఫెనోఫాస్ 50%)-1 మి.లీ./లీటరు
. పైన తెలిపినవి అన్నీ కలిపి పిచికారి చేపించాలి.
మొదటి పిచికారి చేసిన ఒక వారానికి రెండో పిచికారి చేపించాలి :
పిచికారి – 2
. F4 ఫార్ములా- 2 మి. లీ. /లీటర్.
. జబ్బరెల్లిక్ ఆమ్లం (0.001%)-1 మి.లీ/లీటరు.
. ఇమిడాక్లోప్రిడ్-17.8% -0.5 మి. లీ./లీటర్
పైన తెలిపినవి అన్నీ కలిపి పిచికారి చేపించాలి.
9.మొక్క ప్రధానకాండానికి 2.5 అడుగుల ఎత్తు వరకు బోర్డు పేస్టు పట్టించాలి :
క్షేత్ర పరిశోధన ప్రకారం కలుపు యాజమాన్యం :
. రైతు సాగు చేసే భూమిలో అవసరం లేని, ఎందుకు పనికిరాని, మొక్కలను కలుపు అంటాము.
. రైతు పండించే ప్రధాన పంట కంటే చాలా వేగంగా పెరుగుతూ, నీటిని పోషకాలను అత్యంత వేగంగా తీసుకుంటూ పెరిగే మొక్కలని కలుపు అంటాము.
కలుపు వల్ల ఎదురయ్యే ప్రధాన సమస్యలు :-
- ప్రధాన పంట కంటే వేగంగా పెరుగుతాయి.
- నీరు పోషకాలను అత్యంత వేగంగా తీసుకుంటాయి.
- పంట వేసిన భూమిని అత్యంత వేగంగా ఆక్రమిస్తాయి.
- రైతు వేసిన పంట దిగుబడి తగ్గి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది.
- మొక్కపాదులో కలుపు విపరీతంగా పెరగడం వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతుంది.
భారతదేశంలో ఒక సంవత్సర కాలంలో కలిగే పంట నష్టం గమనిస్తే.
- కలుపు వల్ల దాదాపు-45%
- పురుగు వల్ల దాదాపు -30%
- వివిధ రకాల తెగుళ్ల వల్ల -20%
- వాతావరణ మార్పుల వల్ల -5%
బత్తాయి, నిమ్మ తోటలో అధికంగా కనిపించే ప్రధాన కలుపు :
- వయ్యారిభామ.
- బట్టలకు అతుక్కునే గడ్డి జాతి మొక్క ఫాక్స్టైల్.
- తుంగ గడ్డలు సైపరస్.
. వీటివల్ల ప్రధాన పంట అయిన బత్తాయి, నిమ్మ లో రసం పీల్చే పురుగు దోమ ఉధృతి పెరుగుతుంది. నీరు పోషకలవణాల విషయంలో ప్రధాన పంటకు కలుపుకు మధ్య పోటీ తత్వం ఏర్పడుతుంది.
. కొన్ని రకాల కలుపు మొక్కలు హానికారక ఆల్కలాయిడ్స్, టానిన్లు, ఆక్సలేట్లు కలిగి ఉంటాయి. ఇవి తిన్న పశువులు జీవాలు త్వరగా వ్యాధి బారిన పడతాయి.
. లాంటారా అనే కలుపు ఆకులు పశువులు తినడం వల్ల కామెర్లు అవుతాయి.
. పానీకమ్ అనే గడ్డి జాతి కలుపు వరిలో కనిపించే కాండం తోలుచు పురుగుకు అతిదేయి హోస్ట్ గా మారుతుంది.
. పార్థీనియం పుప్పొడి రేణువులను అతిగా పీల్చడం వలన ఆస్తమా అనే ఊపిరితిత్తుల వ్యాధి కలుగుతుంది.
. కలుపు అనునది దోమలకు ఆశ్రయం ఇవ్వడం వల్ల మనుషులకు కూడా ప్రమాదకర వ్యాధులు సంక్రమిస్తాయి.
కలుపు నివారణ చర్యలు :
రసాయనిక నియంత్రణ
గ్లైఫోసేట్ ఐసోప్రొపైలమైన్ :
. దీనిని కలుపు నివారణకు ఉపయోగిస్తారు. ఇది మొక్కలపై పిచ్చికారి చేసినప్పుడు. అన్ని రకాల పెరుగుదల హార్మోన్లు నిలిపివేసి. మొక్కలు చనిపోయే విధంగా చేస్తుంది.
. దీనిని ఎక్కువగా ఇంటి పరిసరాల్లోని గడ్డి నివారణకు, ఇండస్ట్రియల్ ఏరియాలలో, పండ్ల తోటలలో ఉపయోగిస్తారు.
మార్కెట్లో వివిధ రకాల పేర్లతో వీటిని అందుబాటులోకి తీసుకొని వచ్చారు.
.తడి వాతా వరణం ఉన్నప్పుడు దీనిని పిచ్చికారి చేపించడం వల్ల త్వరగా ఫలితం వస్తుంది.
. పండ్ల మొక్కలలో దీనిని పిచికారి చేసే సమయంలో మొక్క పాదులలో పడకుండా చూసుకోవాలి. పండ్ల మొక్కల పాదులో పిచికారి చేయడం వల్ల – పిందెలు రాలిపోతాయి కాయలు పసుపు వర్ణంలోకి మారిపోతాయి ఆకులు పసుపు వర్ణంలోకి మారిపోతాయి.
. వాతావరణంలో గాలి ఎక్కువగా ఉన్నప్పుడు పండ్ల మొక్కలలో పిచికారి చేయరాదు.
. గడ్డి నివారణ కొరకు పిచికారి చేసినప్పుడు పొరపాటున పండ్ల మొక్కల మీద పడినపుడు వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి.
అవి :
- ఉత్త నీరు పిచికారి చేపించడం.
2.అమైనో ఆమ్లాలు / ఫుల్విక్ ఆమ్లం డ్రిప్ ద్వారా ఇవ్వడం.
- గిబ్బరెల్లిన్స్ పిచికారి చేపించడం.
- నీరు పుష్కలంగా ఇవ్వడం వంటి జాగ్రత్తలు వెంటనే తీసుకోవాలి.
యాంత్రిక నియంత్రణ :
- పండ్ల తోటలలో మనుషులచే మొక్కపాదులో గడ్డి తీయించడం.
2.చేతితో కలుపు తీసే యంత్రం సైకిల్ కలుపు తీసే యంత్రంల సహాయంతో కలుపు నివారించడం.
- ట్రాక్టర్ ద్వారా సేద్యం చేపించడం.
- ఎద్దుల ద్వారా భూమి పైన ఉన్న కలుపు దున్నించడం.
మల్చింగ్ :
1.కలుపు నివారణ కొరకు భూమిపైన కప్పి ఉంచడం.
- చెక్కపొట్టును పాదుల లో 2 – 4 అంగుళాలు (5-10cm) మందంతో కప్పి ఉంచడం వలన కలుపు నివారించవచ్చును.
- ప్లాస్టిక్ షీటును కలుపు నివారణ కొరకు ఉపయోగించవచ్చును.
అంతర పంటలు :
నిమ్మ జాతి మొక్కలలో ఫాబేసి ఫ్యామిలీ (పప్పు ధాన్యాలు ) కి చెందిన సొయా బీన్స్,శనగలు, ఉలవలు,పెసలు, వేరుశనగలు అంతర పంటలుగా వేయవచ్చును.
జీవ నియంత్రణ :-
నిమ్మ జాతి మొక్కలలో గొర్రెలను, మేకలను, కోళ్లను, పశువులను మేపడం వలన కలుపును నివారించవచ్చు.
బయో హెర్బిసైడ్లు (శిలీంధ్రాలు/బ్యాక్టీరియా) :
. కొన్ని రకాల కేస్ స్టడీ ప్రకారము తుంగ గడ్డి ఎక్కువగా ఉన్న ప్రదేశం లో ఇసుక తో కప్పి ఉంచడం వల్ల వేసవిలో అధిక వేడి వల్ల తుంగ గడ్డలు పూర్తిగా చనిపోతాయి.
. కలుపు తోటలో పెరిగినప్పుడు పూత రాకముందే పైన తెలిపిన వివిధ మార్గాల ద్వారా కలుపును నివారించాలి.
. పండ్ల మొక్క పాదులలో ఉలవలు,పెసులు వంటి పప్పు ధాన్యాల మొక్కలను చల్లడం వల్ల కలుపును నివారించవచ్చు.
. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న తోటలలో బెలుకు రాతి గులకరాళ్ళు తోలించడం వలన కలుపు నివారించవచ్చు ( ఆంధ్రప్రదేశ్ – కడప జిల్లా లోని పులివెందుల చుట్టూ ఉన్న పరిసరాలలో ఎక్కువగా ఈ విధమైన కలుపు యాజమాన్య పద్ధతిని పాటిస్తారు ).
క్షేత్ర పరిశోధన ప్రకారం దిబ్బ ఎరువు పండ్ల మొక్కలకు ఉపయోగించే విధానం :
. దిబ్బ ఎరువును మదిరి కట్టకుండా అదేవిధంగా మొక్కపాదులో వేయడం వల్ల మొక్క వేరు వ్యవస్థ పాడు అయిపోయే ప్రమాదం ఉంటుంది.
. ఎందుకనగా దిబ్బ ఎరువులో అధిక మోతాదులో వివిధ రకాల లవణాలు ఉప్పు, నత్రజని ఉండటంవల్ల మొక్క వేరు వ్యవస్థకు ప్రమాదం కలుగుతుంది.
. దిబ్బ ఎరువులు హానికారక సూక్ష్మజీవి అయిన E. కోలి, సాల్మోనెల్లా, లిస్టెరియా, క్లోస్ట్రిడియం వంటివి మొక్కలకే కాకుండా మనుషులకు ప్రమాదమే. కావున తప్పనిసరిగా మాదిరి కట్టించి ఉపయోగించడం మంచిది.
. దిబ్బ ఎరువులు హానికారక బ్యాక్టీరియాతో పాటు ప్లాస్టిక్ వ్యర్ధాలు, డిస్పోజల్ సిరంజులు, మందుల కవర్లు, గాజు సీసాలు, గృహ వ్యర్ధాలు క్షేత్ర సందర్శనలులో గమనించడమైనది.
దిబ్బ ఎరువు మాదిరి కట్టే విధానం :
ముందుగా తోటలో ఉన్న ఖాళీ ప్రదేశంలో దిగువ తెలిపిన క్రమంలో మాదిరి కుప్ప కట్టించాలి.
చెరువు మట్టి, దిబ్బ ఎరువు, ఎర్ర మట్టి :
. పై విధంగా మాదిరి కట్టి దానిపైన నీరు అందించే డ్రిప్ లాటరల్ సహాయంతో మాదిరిని బాగా తడపాలి.
. దీని వల్ల మాదిరి కుప్ప లో 130-160 డిగ్రీ ఫారెన్ హీట్ పుట్టి మాదిరి లో ఉన్నటువంటి హానికారక బ్యాక్టీరియా చనిపోతుంది.
. మొదటి నెల మదిరి (కుప్ప) లో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ (SSP) -5kg/టన్ను చొప్పున కలిపి ఉంచుకోవాలి.
. మదిరిని మొత్తం గోనె సంచులు లేదా కొబ్బరి మట్టల సహాయంతో కప్పి ఉంచాలి.
. రెండవ నెల డీకంపోస్ బ్యాక్టీరియా అనగా “పిఎస్బి +విఎఎమ్+ట్రైకోడెర్మా” వంటి మంచి చేసే జీవ శిలీంద్ర నాసినులను మదిరిలో కలిపి ఉంచుకోవాలి. (ఒక్కొక్క మోతాదు -5 కిలోలు/టన్ను).
. పై విధంగా మదిరి మొత్తం 4 నుంచి 6 నెలల లోపు మంచి పోషక విలువలు కలిగిన ఎరువుగా తయారవుతుంది.
. ఈ విధంగా బాగా మగ్గిన తయారైన ఎరువును మొక్క వయసును అనుసరించి పాదులో వేయవచ్చును.
దిబ్బ ఎరువు మదిరి కట్టడం వల్ల కలిగే ఉపయోగాలు :
. మొక్కపాదులో సేంద్రీయ కర్బన పదార్థం పెరిగి PH క్రమపరచబడుతుంది.
. మనం అందించే సూక్ష్మ పోషకాలను మొక్కలు పట్టి ఉంచడం వల్ల మొక్క నిదానంగా తీసుకుంటుంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది.
. నీటి తేమ శాతం పెంచడం వల్ల మొక్కపాదులో తడి పొడి వాతావరణం ఏర్పడుతుంది.
. మొక్కపాదులో వివిధ రకాల మంచి చేసే జీవకోటికి ఈ సేంద్రీయ పదార్థం ప్రధాన ఆధారం.
. మొక్క పాదులో ఉన్నసేంద్రీయ పదార్థం వల్ల నీరు ఎక్కువగా నిలవదు. దీనివల్ల మొక్క వేరుకు సంబంధించి హానికారక ఫంగస్ సంక్రమించకుండా ఉంటాయి.
. మొక్క పాదులో తగినంత సేంద్రీయ పదార్థం లేకపోతే దిగువ తెలిపిన పోషకాలను మొక్క సరిగా తీసుకోలేదు.
(నత్రజని(N), పాస్ పెట్ (P), పొటాషియం(K), మ్యాంగనీస్ (Mn), జింక్(Zn), ఐరన్(Fe), కాపర్ (Cu).)
గుడ్డు అమైనో ఆమ్లాలు :
- తయారీకి కావలసిన పదార్థాలు:
గుడ్లు – 12Kg
నిమ్మకాయలు – 2
బెల్లము – 250 gms
ప్లాస్టిక్ కూజా – 3Lt సామర్థ్యం
- ఏ విధంగా తయారు చేయాలి :
. ముందుగా మనం తీసుకున్న గుడ్లను బాగా శుభ్రం చేసి ప్లాస్టిక్ జార్ లో పగలకుండా ఉంచాలి.
. ప్లాస్టిక్ జార్ లో ని గుడ్లు అన్ని మునిగే విదంగా నిమ్మ రసంతో నింపాలి.
. ప్లాస్టిక్ జార్ మూత మూసి ఎండ తగలని నీడ ప్రదేశం లో ఉంచాలి.
. ప్లాస్టిక్ జార్ మూతను అప్పుడు డప్పుడు తీస్తూ ఉండాలి. దీనివల్ల గ్యాస్ బయటకు పోతుంది.
. దాదాపు 10 – 15 రోజులు తర్వాత గుడ్లు మొత్తం నిమ్మ రసం లో కరిగి పోతాయి.
. రోజు ఉదయం + సాయంత్రం గుడ్లు కరిగిన పదార్తాన్ని కలుపు తూ ఉండాలి.
. ఈ సమయం లో 250gms -500gms వరకు బెల్లం పాకం వేసి బాగా కలుపుకోవాలి.
. ప్లాస్టిక్ జార్ మూత ఉదయం సాయంత్రం తీసి బాగా తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా 10-15 రోజులు చేయాలి.
. దాదాపు 25 నుంచి 30 రోజుల తర్వాత తెల్లటి బాదం పాల లాంటి ద్రవపదార్థం ఏర్పడుతుంది.
. ముందుగా చెప్పిన విధంగా 12 గుడ్లు + 2kg నిమ్మ కాయలు + 250 – 500gms బెల్లం తో దాదాపు 1.5Lt to 2Lt గుడ్డు అమైనో ఆమ్లాలు తయారవుతుంది.(గడువు తేదీ: 6 నెలలు)
- ఉపయోగించే విధానం :
. పండ్ల మొక్కలలో పూతకు ముందు పిచికారి చేసే సమయంలో వాడవలసిన నిష్పత్తి. (పుష్పించే ముందు) మోతాదు: స్ప్రే: 3 మి.లీ./లీటరు
. పండ్ల మొక్కలలో పూతకు ముందు బిందు ద్వారా ఇస్తున్నప్పుడు వాడవలసిన మోతాదు.
ఇది: డ్రిప్ ఫెర్టిగేషన్ :5 మి.లీ/జాబితా
. పండ్ల మొక్కలకు పూత పిందె దశలో ఇవ్వవలసిన మోతాదు స్ప్రే: 2మి.లీ/లీటర్
. కొత్తగా నాటిన మొక్కలకు మొక్క పెరుగుదల సమయంలో ఇవ్వవలసిన మోతాదు. డోస్ స్ప్రే డ్రిప్ -1.5-2 మి.లీ/లీటరు
. పండ్ల మొక్కలలో కాయ పెరుగుదల సమయంలో ఇవ్వవలసిన మోతాదు : స్ప్రే/డ్రిప్:2మి.లీ/లీటర్
. ఏలి పంటలకు విత్తనం విత్తడానికి ముందు 2 – 3 సార్లు నీటిపారుదల ద్వారా పారించి. భూమిని పదును చేసుకోవడం వల్ల భూమిలో మంచి చేసే సూక్ష్మజీవ రాసి పెరుగుతుంది.
గుడ్డు అమైనో ఆమ్లాలు వల్ల కలిగే ప్రయోజనాలు :
. పండ్ల మొక్కలకు పూతకు ముందు గుడ్డు అమైనో ఆమ్లాలు పిచికారీ బిందు ద్వారా ఇవ్వడం వల్ల భవిష్యత్తులో నాణ్యమైన పూత / పిందే రావడం జరుగుతుంది.
. పండ్ల మొక్కలలో పిందెలు రాలడం అరికట్టి పిందే పట్టడానికి ఉపయోగపడుతుంది.
. పండ్ల మొక్కలలో కనిపించే క్యాల్షియం లోపాన్ని తగ్గిస్తుంది.
. పండ్ల మొక్కలలో మంచి ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ గా పనిచేస్తుంది.
. పండ్ల మొక్కలలో (క్లోరోఫిల్) పత్ర హరితాన్నిపెంచి అధిక పిండి పదార్థాలు తయారయ్యే విధంగా చేస్తుంది.
. గుడ్డు అమైనో ఆమ్లాలు కి ఉండే ఘాటైన వాసన వల్ల కొన్ని రకాల చీడపీడలు దూరంగా ఉంటాయి.
చేప అమైనో ఆమ్లాల తయారీ
(మీనామృతం – తయారీ విధానం)
1.కావలసిన పదార్థాలు :
. చేపలు మరియు దాని వ్యర్ధాలు -1Kg
. బెల్లం కరిగిన పాకం (Jeggary -1kg) -1Lt
. వెడల్పు మూత కలిగిన గాజు /ప్లాస్టిక్ / మట్టితో తయారుచేసిన కుండ.-1
. కుండ యొక్క మూతను కప్పడానికి అవసరమైన దోమతెర లేదా నూలు వస్త్రం.
. రబ్బర్ బ్యాండ్/దారం -1
2.తయారీ విధానం :-
. ముందుగా చేపల యొక్క వ్యర్థాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించాలి.
. బెల్లం ను చిన్న చిన్న ముక్కలుగా పొడి లాగా తయారు చేసుకోని కొద్దిగా వేడి చేసి పాకం లాగా తయారు చేసుకోవాలి.
. ముందుగా చెప్పినట్లు ప్లాస్టిక్ జారుగాని, మట్టికుండ గాని తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న చేపల వ్యర్ధాలను తీసుకొని అవి పూర్తిగా మునిగే విధంగా బెల్లం పాకం వేయాలి.
. ఇక్కడ చేపల వ్యర్ధాలు + బెల్లం రెండు 1:1 నిష్పత్తిలో తీసుకోవాలి.
. ఎటువంటి తేమ లేనటువంటి గాజు, మట్టి, ప్లాస్టిక్ కంటైనర్లను తీసుకొని అందులోకి చేప వ్యర్ధాలు వేసి అవి పూర్తిగా మునిగే విధంగా బెల్లం కరిగిన పాకం వేసి కర్ర ముక్క సహాయంతో బాగా తిప్పాలి.
. గాజు, ప్లాస్టిక్ డబ్బాలో తీసుకున్న చేప బెల్లం మిశ్రమాన్ని 70% వరకు నింపి మిగతా 30% ఖాళీగా ఉంచాలి. ఎందుకనగా చేపలోని పదార్థాలు బెల్లం తో కలిసి పులియడం (కిణ్వ ప్రక్రియ) వల్ల గాలి ఏర్పడుతుంది.
. పై విధంగా నింపిన తర్వాత గాజు, మట్టి, ప్లాస్టిక్ డబ్బాయొక్క మూతను దోమతెర లేదా నూలు వస్త్రంతో కప్పి రబ్బర్ బ్యాండ్ సహాయంతో మూసివేయాలి.
. ఈ విధంగా తయారు చేసుకున్న చేప వ్యర్ధాలు బెల్లం మిశ్రమం కలిగిన డబ్బాను ఎండ తగలని ప్రదేశంలో అనగా నీడలో ఉంచి పెట్టాలి.
. చేప బెల్లం మిశ్రమాన్ని బొద్దింకలు, ఎలుకలు, ఉడతలు వంటివి తినకుండా జాగ్రత్త పడాలి.
. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కర్రముక్క సహాయంతో డబ్బాలో ఉన్న చేప బెల్లం మిశ్రమాన్ని నెమ్మదిగా తిప్పి మళ్లీ మూసివేయాలి.
. దీనివల్ల లోపల ఉన్న పదార్థానికి ఆక్సిజన్ బాగా అంది మంచి చేసే బ్యాక్టీరియా తయారవుతుంది.( చేప కడుపులో ఉన్నటువంటి మంచి చేసే బ్యాక్టీరియా – లాక్టోబాసిల్లస్, సూడోమోనాస్, బాసిల్లస్)
. ఈ విధంగా తయారు చేసుకున్న పదార్థాన్ని దాదాపు 15 నుంచి 30 రోజులు పాటు ఉదయం సాయంత్రం తిప్పుతూ ఉండటం వల్ల చేప + బెల్లం రెండు కరిగి నల్లటి ద్రవపదార్థం ఏర్పడుతుంది. దీనినే మీనామృతం or ఫిష్ అమినోయాసిడ్స్ అని పిలుస్తారు.
. పై విధంగా తయారైన ద్రవ పదార్థాన్ని గాజు బాటిల్ లోకి వడపోసుకొని దాదాపు 6 నెలలు నిలువ ఉంచుకోవచ్చును.
ఎలా వాడాలి :
. పండ్ల మొక్కలలో పూతకు ముందు పిచికారి చేసే సమయంలో వాడవలసిన నిష్పత్తి. 3ml/Lit
. పండ్ల మొక్కలలో పూతకు ముందు బిందు ద్వారా ఇస్తున్నప్పుడు వాడవలసిన మోతాదు.3ml/lit
. పండ్ల మొక్కలకు పూత పిందె దశలో ఇవ్వవలసిన మోతాదు. 1ml/lit
. కొత్తగా నాటిన మొక్కలకు మొక్క పెరుగుదల సమయంలో ఇవ్వవలసిన మోతాదు. -1 – 1.5.ml/lit
. పండ్ల మొక్కలలో కాయ పెరుగుదల సమయంలో ఇవ్వవలసిన మోతాదు. 2 ml/lit
మీనామృతం వల్ల కలిగే ప్రయోజనాలు :
. పిచికారి చేపించడం వల్ల కొన్ని రకాల నల్లులు, తెల్ల దోమ, రసం పీల్చే పురుగు నుంచి మొక్కలను కాపాడుతుంది.
. మీనామృతంలో (FAA) 4:1:1 నిష్పత్తిలో నత్రజని(N)+ ఫాస్పరస్ (P)+ పొటాష్ (K) మరియు క్యాల్షియం (Ca) లభిస్తాయి.
. మీనామృతంలో నత్రజని (N) అధికంగా ఉండటం వల్ల దీనిని “త్వరిత నైట్రోజన్ బూస్టర్” అని పిలుస్తాము.
. మీనామృతం వల్ల మట్టి (భూమి) ఆరోగ్యం పెరిగి భూమిలో మంచి చేసే సూక్ష్మజీవకోటి పెరుగుతుంది.
. మీనామృతంను మన తోటలోని కంపోస్టు లేదా జీవ ఎరువు లేదా పశువుల ఎరువు కు కలపవచ్చు.
. ఒక 1-5 Lt మీనామృతంను 200Lit ల డ్రమ్ లో కలిపి ఒక టన్ను ఎరువు పైన చల్ల వచ్చును.
. చేప అమైనో ఆమ్లం అనునది కొరియన్ న్యాచురల్ ఫామింగ్ మెథడ్ నుంచి సంగ్రహించినది.
వ్యవసాయ రంగంలో ఆవు మూత్రము ఉపయోగించే విధానం :
1.ఆవు మూత్రము ఏ విధంగా ఉపయోగించాలి …..
దేశీ ఆవు నుంచి స్వీకరించిన స్వచ్ఛమైన మూత్రాన్ని సిమెంటు తొట్టిలోకి గాని లేదా ప్లాస్టిక్ డ్రమ్ లోకి గానీ సేకరించి దాదాపు 14 రోజులపాటు మురగ పెట్టాలి వీలైతే సంగ్రహించిన ఆవు మూత్రాన్ని నీడలో ఉంచి ఉదయం సాయంత్రం కర్ర ముక్కతో తిప్పుతూ ఉండాలి. దీనివల్ల ఆవు మూత్రంలో ఉన్న మంచి చేసే బ్యాక్టీరియాకు ఆక్సిజన్ బాగా అంది వృద్ధి చెందుతుంది.
- ఆవు మూత్రం మోతాదు :-
. ఫోలియర్ స్ప్రే పిచికారి చేయడానికి
. 3-10ml/లీటర్ //60 నుండి 200ml/20Lt ట్యాంక్
. నూనె పూయడం (డ్రెంచింగ్/లేదా/డ్రిప్ ఫెర్టిగేషన్) మొక్క పాదులో ఇవ్వడం :
. 200 లీటర్ల డ్రమ్కు 2- 5 లీటర్లు.
. ఏలి భూములలో అయితే విత్తనం వేయడానికి దాదాపు 10-20Lt లు 200 లీటర్ల డ్రంలో కలిపి నీటితో పాటు పారించి పదును చేసుకోవాలి.
3 ఏ సమయంలో వాడవచ్చును…
. పూతకు ముందు.
. మొక్క పెరుగుదలలో.
. కాయ అభివృద్ధి పెరుగుదల.
4. ఎలా పనిచేస్తుంది …
. ఇది మంచి పెస్టిసైడ్ గా పని చేస్తుంది. (వైరస్, బాక్టీరియా, ఫంగస్ కోసం)
. ఇది మంచి ఇన్సెక్టిసైడ్ గా పనిచేస్తుంది. (పురుగు నివారణకు)
. ఇది మొక్క పెరుగుదలను క్రమపరుస్తుంది.
ఆవు మూత్రం వల్ల భూమికి కలిగే ప్రయోజనాలు :
. భూమిలో ఉండే వివిధ రకాల హానికారక బ్యాక్టీరియా ఫంగస్ ను చంపుతుంది.
. భూమి సారవంతం పెంచుతుంది.
. విత్తనాలు మొలకెత్తడాన్ని వేగవంతం చేస్తుంది.
. భూమి ఉదజనిని క్రమపరుస్తుంది.
. భూమిలో కర్బన శాతం పెంచుతుంది.
. భూమిలో మంచి చేసే సూక్ష్మ జీవరాసిని పెంచుతుంది.
. ఆవు మూత్రంలో మొక్కలకు అవసరమైన సిలికాన్, ఐరన్, కార్బోలిక్ ఆమ్లం లభిస్తున్నాయి.
. గోమూత్రం ముగింపు :-
. ప్రస్తుత పరిస్థితుల్లో భూమి సారవంతం పెంచడానికి గో ఆధారిత వ్యవసాయం అత్యంత ఆవశ్యకత సంతరించుకుంది.
. ఆవు మూత్రంలో మొక్కలకు అవసరమైన అనేక పోషకాలు లభిస్తున్నాయి వాటిలో కొన్ని భాస్వరం, పొటాషియం, సల్ఫర్, సోడియం,మాంగనీస్,ఇనుము,సిలికాన్,కార్బాక్సిలిక్ ఆమ్లం మొదలైనవి.
. ఆవు మూత్రంలో ఎంజైమ్లు,హార్మోన్లు ఉండడంవల్ల మొక్కల పెరుగుదల ప్రమోటర్ గా ఉపయోగపడుతుంది.
. ఆవు మూత్రంలో దాదాపు 95%-నీరు, 2.5%-యూరియా/2.5%-మినరల్స్ లభిస్తాయి.
. 24 గంటలలో ఒక ఆవు దాదాపు 6Lt ల మూత్రాన్ని విసర్జిస్తుంది.
. ఒక రైతు వద్ద రెండు దేశి ఆవులు ఉన్నట్లయితే సంవత్సరానికి దాదాపు 4,380Lt ల మూత్రం విసర్జించబడుతుంది. ఇది దాదాపు 136 kg ల యూరియా తో సమానం.
వాన పాము ద్రవం తయారీ విధానం :
. వానపాము ఎరువు నుంచి సేకరించిన ద్రవాన్ని వర్మీ వాష్ అంటాము.
. వర్మీ వాష్ యూనిట్ ను సిమెంట్ రింగు మెథడ్ లో తయారు చేస్తారు.
వర్మీ వాష్ యూనిట్ నిర్మాణం :
స్టెప్ -1 :- ముందుగా యూనిట్ అడుగుభాగం ఇసుక + సిమెంటు కలిపి ఫ్లోర్ రెడీ చేసుకోవాలి.
స్టెప్ -2 :- తయారు చేసుకున్న ఫ్లోర్ మీద సిమెంట్ రింగ్ పెట్టిన తర్వాత అడుగు భాగంలో ఇటుకలు, గులకరాళ్లు , ఇసుక, లేయర్ బై లేయర్ పేర్చుకోవాలి. ఇది దిగువ నుంచి మొదటి లేయర్ అవుతుంది.
స్టెప్ -3 :- రెండవ పొర లో గడ్డి ఆవు పేడ 15-20cm మందంతో వేసుకోవాలి.
స్టెప్ -4 :- ఆవు పేడ + మూత్రము కలిసిన గంజు చల్లుకోవాలి.మొదటి రింగు పై విధంగా నింపుకున్న తర్వాత.
స్టెప్ -5 :- రెండవ రింగు దానిపైన మార్చుకోవాలి. రెండవ రింగు మొత్తం ఆవు పేడ నింపాలి.
స్టెప్ -6 :- ఇక మూడవ రింగ్ అమర్చుకొని గడ్డి, ఆకులు అలములు వేయాలి.
స్టెప్ -7 :- చివరగా నాలుగవ రింగు అమర్చుకొని ఆవు పేడ + గడ్డి కలిసిన మిశ్రమంతో నింపాలి.
స్టెప్ -8 :- దాదాపు 10 నుంచి 20 రోజులు నీటి తడులు అందిస్తూ కొద్దిగా మగ్గిన తరువాత జీవించి ఉన్న 500 నుంచి 750 వానపాములు విడిచి పెట్టాలి.
స్టెప్ -9 :- నాలుగవ రింగు పైన వాన పాములను పక్షులు తినకుండా గడ్డి మొత్తం కప్పి ఉంచాలి. రోజు క్రమం తప్పకుండా నీరు అందిస్తూ (5Lt) ఉండాలి.
స్టెప్ -10 :- వాన పాములు విడిచిపెట్టిన మూడవ రోజు నుంచి రెండు రోజులకు ఒకసారి వర్మి వాష్ ను సేకరించాలి.
స్టెప్ -11 :- తాజాగా సేకరించిన వర్మీ వాష్ బంగారు వర్ణంలో ఉంటుంది. దీనిని రెండు నెలల వరకు నిలువ ఉంచవచ్చు. రెండు నెలల తరువాత క్రమంగా బ్రౌన్ కలర్ లోకి , బ్లాక్ కలర్ లోకి, మారిపోతుంది.
మోతాదు :-
స్ప్రే: పిచికారి: 500ml/20Lt నీరు
బిందు ఫర్టిగేషన్: 5లీటర్లు/200లీటర్లు/1 ఎకరానికి
వర్మి వాష్ యూనిట్ లో సేంద్రీయ పదార్థంగా ఉపయోగించే పదార్థాలు.
. ఎండు గడ్డి , ఎండు ఆకులు, శనగ వేరుశెనగపప్పు, వరి గోధుమ పొట్టు , కిచెన్ వేస్ట్, పార్టీనియం కలుపు , చెరకు పిప్పి, పట్టుపురుగుల వేస్ట్.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
. ఆర్గానిక్ మేటర్ లో గాజు పెంకులు, ఇనుప చువ్వలు, ప్లాస్టిక్ వ్యర్ధాలు, లేకుండా చూసుకోవాలి.
. గోనెసంచిని, ఎండు గడ్డిని కప్పి పక్షుల నుంచి కాపాడుకోవాలి.
. తగినంత తేమశాతం ఉండే విధంగా జాగ్రత్త వహించాలి.
. గోషాలకు దగ్గరిలో పక్కనే నిర్మించుకోవాలి.
డా. RSS (స్వతంత్ర శాస్త్రవేత్త), డా. RSS రీసెర్చ్ ఫౌండేషన్ , ఫోన్ : 98497 15564 రాంబాబు పొన్నాన, నవ నిర్మాణ్ ఫౌండేషన్, ఫోన్ : 7032691531


























