వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్ & టెక్స్టైల్ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, “నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ సీడ్స్ (NMEO-OS) 2025-26” కార్యక్రమం కింద వేల్యూ చైన్ క్లస్టర్ల ద్వారా రైతులకు 100% సబ్సిడీ పై వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని రైతు వేదిక నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు నాణ్యమైన వేరుశనగ విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా నూనె గింజల ఉత్పత్తిని పెంపొందించడం, పంటల విస్తీర్ణం పెరగడం, రైతుల ఆదాయాన్ని అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉందని మంత్రి గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సురేంద్ర మోహన్ గారు, ఐఏఎస్, ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం & సహకారం శాఖ), శ్రీ గోపీ గారు, ఐఏఎస్, వ్యవసాయ సంచాలకులు, మరియు ఇతర విభాగాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతులకు ఆధునిక సాంకేతికతలు, ప్రోత్సాహక పథకాలు, విలువ జోడింపు చైన్ల ద్వారా సమగ్ర అభివృద్ధి కల్పిస్తామని తెలిపారు.
Leave Your Comments


























