తెలంగాణవార్తలు

మీ గడప వద్దకే మీ భూసార పరీక్ష

0

ICRISAT – లారాస్ ల్యాబ్స్ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో
ఏ రైతు అయినా పంట పండించాలి అంటే మూడు ముఖ్యమైన పెట్టుబడులు అవసరం. అవి నేల, విత్తనం, నీరు. వీటిలో ఏ ఒక్కటి సరిగా లేకున్నా ఆ రైతు కష్టం వృధా అవుతుంది.వ్యవసాయంలో నేల ముఖ్యమైన పునాది మొక్కల పెరుగుదలను సులభతరం చేయడంలో ఉపయోగపడే పోషకాలను కలిగి వుంటుంది మరియు మొక్కలు వృద్ధి చెందటానికి అవసరమైన నీరు మరియు గాలిని వేర్ల ద్వారా మొక్కకు సరఫరా చేస్తుంది.

వ్యవసాయంలో నేల పరీక్షల ప్రాముఖ్యత : రైతులు తమ పొలంలోని నేల స్వభావాన్ని బట్టి పంటను ఎంచుకోవాల్సిన అవసరం వుంటుంది. అన్ని రకాల పంటలకు ఒకేరకం నేలలు అనువైనవి కాదు. ఇది తెలుసుకోవాలి అంటే రైతులు తప్పనిసరిగా మట్టి పరీక్షలు చేపించుకోవాలి. మట్టి పరీక్షలో నేల స్వభావం (ఆమ్ల, క్షార ) మరియు పంటల పెరుగుదలకు అవసరమైన పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయనేది తెలుస్తుంది. దానిని అనుసరించి పంట వేస్తే బాగా సాగు అవుతుందని ఒక అంచనాకి రావచ్చు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని శామీర్పేట మరియు మూడుచింతలపల్లి మండలాల్లోని అన్ని గ్రామాల రైతులు ఎక్కువగా కూరగాయలు మరియు వరి పంటలను పండిస్తారు.ఈ గ్రామాల్లోని రైతులకు తమ పొలాల్లోని నేల స్వభావం మరియు మట్టి పరీక్షల గురించి సరైన అవగాహన లేనందున ఎక్కువగా రసాయనిక ఎరువులను వాడుతూ, సేంద్రియ ఎరువుల వాడకం తగ్గించినందువలన వారి పొలాల్లో నేల సారాన్ని కోల్పోయి, పంటల్లో దిగుబడి తగ్గి చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇది గమనించిన షామీరుపేట మండలం తుర్కపల్లి లోని లారాస్ లాబ్స్ ఛారిటబుల్ ట్రస్ట్ వారు హైద్రాబాదు పటాన్చెరు నందు గల ఉష్ణ మండల మెట్ట పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) లోని భూ సార పరీక్ష కేంద్ర విభాగం CRAL, శాస్త్రవేత్త డా. పుష్పాజీత్ చౌదరి గారిని సంప్రదించి ఆ ప్రాంత రైతులకు గల వ్యవసాయ సంబంధిత సమస్యలను పరిష్కరించి వారికి సహాయపడే విధంగా జూన్-2022 సంవత్సరంలో ఒక ప్రతిపాదికను అప్పగించారు.

ఇందులో భాగంగా 2022-23 సంవత్సరం లో మొదట లారాస్ లాబ్స్ ఛారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఇక్రిశాట్ భూసార పరీక్షా కేంద్ర విభాగం ప్రతినిధులు మేడ్చల్ మల్కాజ్గిరి శామీర్పేట్, మూడుచింతలపల్లి మంళల్లోని అన్ని గ్రామాల వ్యవసాయభూములను సర్వేచేసి, అక్కడి రైతులకు మట్టి పరీక్షల గురించి అవగాహన కల్పించి, వారి పొలాల నుండి మట్టి ని సేకరించి పటాన్చెరు నందు గల ఇక్రిశాట్ లోని CRAL నందు ఉచితంగా మట్టి పరీక్షలు నిర్వహించి , సిఫార్సులతో కూడిన ఫలితాలను కార్డుల రూపంలో అందించారు. ఈ ప్రయత్నంలోCRAL రైతులను భూసార పరీక్షలకు ప్రోత్సహించడానికి లో వారి నుండి చాలా సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ విధానంతో రైతులు ఎక్కువగా ఆసక్తి చూపకపోవడంతో గ్రహించిన CRAL బృందం, లారాస్ లాబ్స్ ప్రతినిధులతో సంప్రదించి మరింత మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో రైతుల ఎదుటే భూసార పరీక్షలు నిర్వహించే విధం గా కదిలే వాహనం రూపంలో సరికొత్త భూసారపరీక్ష కేంద్రంను రూపకల్పన చేసి, ఈ MSTL ను Dec-5-2023, ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా ఇక్రిసాట్ డి.జి, లారాస్ ల్యాబ్స్ ట్రస్ట్ సి. ఇ .ఓ, CRAL శాస్త్రవేత్త చేతుల మీదుగా ఆరంభించారు.

భూసారపరీక్షవాహనం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం: శామీర్పేట మరియు మూడుచించలపల్లి పరిసర మండలాల్లోని వివిధ గ్రామ రైతుల పొలాల వద్దకు నేరుగా చేరుకుని మట్టి, నీరు సేకరించి, వాహనం నందే మట్టి మరియు నీటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్థారు.

భూసారపరీక్ష వాహనం నందు నిర్వహించు పరీక్షలు: 1.ఉదజని సూచిక(pH), 2.విద్యుత్ వాహకత(EC), 3.సేంద్రీయ కర్బనం(OC), 4.స్థూల పోషకాలు, 5.సూక్ష్మ పోషకాలు.

ఈ భూసార పరీక్షల ద్వారా రైతుల పొలాల్లో నేల స్వభావం, మట్టిలోని వివిధ పోషక విలువలను తెలియజేస్తూ ,పోషకవిలువల లోపలను అధిగమించి మoచి దిగుబడి కోసం ఎరువులు ఎంత మోతాదులో వివిధ పంటల వారిగా ప్రతి రైతుకి మట్టిపరీక్ష నమూన కార్డు అందజేస్తారు. మట్టి నమూనాలను సేకరించే ముందు CRAL, MSTL ను మేడ్చల్ జిల్లా collecter,వ్యవసాయ అధికారులు కు చూపించి MSTL ప్యయోజనాలను వివరించి, వారి సహాయంతో అన్ని గ్రామాల్లో మట్టి నమూనా సేకరన అవగాహన కార్యక్రమాలను మరియు ఏరోబిక్ కంపోస్టింగ్ ద్వారా నేల సారాన్ని మెరుగుపరిచే విధానం, వారి పంట వ్యాధులను పరిష్కరించడానికి ప్లాంటిక్స్ ,మొక్కల ఆరోగ్యాన్ని గుర్తించే AI సంబంధిత మొబైల్ యాప్లు గురించి వివరించి రైతులను చైతన్యవంతులను చేస్తున్నారు. మట్టి సేకరణ జరగని సమయం లో పాఠశాల ల్లో పిల్లలకు వ్యవసాయంలో నేలలు మరియు నేలల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం, భూసారపరీక్ష వాహనం(MSTL) ద్వారా మట్టి పరీక్షల ప్రాముఖ్యతలను వివరించడం జరుగుతుంది. వీటితో పాటు రైతులందరికీ మట్టిపరీక్షల ఫలితాల్లో కార్డుల రూపంలో అందిస్థూ, వారికి అర్దమయ్యేలా వివరించడానికి అవగాహన సదస్సులను, గ్రామ స్థాయి నేల ఆరోగ్య నివేదిక గురించి ప్రజా గోడలపై ప్రచురించడం చేస్తున్నారు. ఈ విధానం ద్వారా రైతులకు వారి గ్రామం యొక్క సరాసరి నేలల స్వభావం గురించిన అవగాహన ఉంటుంది. ఇలా ఇక్రిసాట్ -లారాస్ ల్యాబ్స్ ఛారిటబుల్ ట్రస్ సౌజన్యం తో రైతుల సమస్యలను పరిష్కరించడo లో సహాయం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ మండలాల్లోని మొత్తం 22 గ్రామాల్లో 2185 మంది రైతుల నుండి మట్టి నమూనాలను సేకరించారు మరియు 100 మంది రైతులకు ఏరోబిక్ కంపోస్ట్ కల్చర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఏరోబిక్ కంపోస్ట్ కల్చర్ ప్యాకెట్లను అందుకున్న రైతులు కల్చర్ ఉపయోగించి తమ వ్యవసాయ వ్యర్ధలతో కంపోస్ట్ తయారు చేయడం జరిగింది.వారు తోటలు వేసే ముందు తమ పొలాల్లో ఈ కంపోస్ట్ను ఉపయోగించారు మరియు ఎరువులు వేసేటప్పుడు వారి నేల ఆరోగ్య కార్డు డేటాను అనుసరించారు, తద్వారా వారు మునుపటి పద్ధతులతో పోలిస్తే వారి పంటలను మెరుగుపరుచుకున్నారు.వారు భూసార పరీక్ష చేయకుండానే తమ సొంత పద్ధతిని అభ్యసించినప్పుడు మరియు భూసార పరీక్ష తర్వాత పద్ధతుల మధ్య వ్యత్యాసాన్ని కనుగొన్నారు. వారు తమ ఖర్చు తగ్గించుకుని, పంటలు మెరుగుపడ్డందుకు సంతోషంగా ఉన్నారు.ఈ ప్రాజెక్టు తరపున CRAL యజమాన్యం రైతు దినోత్సవాన్ని ICRISAT శామీర్పేట ప్రాంత రైతులు, వ్యవసాయ అధికారులను అహ్వానించి నిర్వహించింది.

హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్దులకు, కొల్తూరు గ్రామ ఉన్నత పాఠశాల విద్యార్దులకు ప్రపంచనేలల దినోత్సవం రోజున MSTL ద్వార వ్యవసాయ సాంకేతిక విజ్ఞానాన్ని వివరిస్థూ వ్యాకరణ పోటీలను నిర్వహించింది. ఈ విధానం గా రైతులతో పాటుగా విద్యార్దులను చైతన్యవంతులను చేస్తున్నారు. ఈ
డా.పుష్పజీత్ చౌదరి చక్రాలపై సాంకేతికత అనే విధానం ద్వారా రైతులను నేరుగా చేరుకొని వారి పొలాల వద్దనే భూసార పరీక్షలు నిర్వహించి, ఫలితాలను పోషకాల సిఫార్సులను కార్డుల రూపం లో అందిస్తున్నాము. రైతులందరూ తప్పనిసరిగా భూసారపరీక్షలు చేపించుకుని ఆ ఫలితాలకు అనుగుణంగా నేల స్వభావాన్ని బట్టి పంటలు వేసుకుంటూ ఖర్చు తగ్గించుకుని,దిగుబడి పెంచుకుంటారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా తమ నేల స్వభావం తెల్సుకుని దానికి అనుగుణంగా పంటను వేసుకోవడం వల్ల తమ వ్యవసాయం లో మార్పులు చూశామని రైతులు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ముందు ముందు ఇంకా మెరుగైన విధానాల ద్వారా రైతులకు సహాయం చేయడానికి ముందుంటామని తెలియజేస్తున్నాము.

ఆంజనేయులు రైతు, ఉద్దమర్రి : లారాస్ లాబ్స్ వారు ఇక్రిశాట్ వారు కలిసి నిర్వహించిన భూసార పరీక్ష ద్వారా మా పొలంలోని మట్టి పరీక్షలు చేపించుకోవడం వల్ల మా పొలం లోని పోషకాల లోపాలను తెల్సుకుని దానికి అనుగుణం గా అవసరంపము ఐన మేరకే ఎరువులు వేసుకోవడం వల్ల మా ఖర్చు తగ్గించుకున్నాము .మునుపటి మా పద్ధతి లో పండించుకున్న దానికంటే తగ్గకుండా పంట లాభం కూడా పొందాము కాబట్టి మాకు భూసార పరీక్ష చాల ఉపయోగపడిందని భావిస్తున్నాము.

పత్తిపాటి లావణ్య,డా. పుష్పజీత్ చౌదరి, సాయిల్ శాస్త్రవేత్త , మేనేజర్- సాయిల్ కెమిస్ట్రీ ల్యాబ్ (CRAL). సి.విజయరంగనాథ-Ast. మేనేజర్,
చేతనా నిమ్జే – సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ మరియు ప్రయోగశాల సభ్యులు.ICRISAT
ఫోన్ : 7731996633, 8106586524

Leave Your Comments

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు- మెరుగైన సాగు పద్ధతులపై అన్నదాతలకు అవగాహన

Previous article

Tummala Nageswara Rao: ఆంధ్రాలోని ఆ ప్రాంతాలను తిరిగి తెలంగాణలో కలపాల్సిందే

Next article

You may also like