వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో వర్షసూచన..

0

వాయుగుండం బంగాళాఖాతంలో అండమాన్ దీవులకి సమీపంలో బలహీనపడి అల్పపీడనంగా మారింది. అల్పపీడనం కారణంగా రానున్న 2 రోజుల పాటు తీవ్రమైన వేడిగాలులు ఉంటాయని రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 5 – 7 మధ్య వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే కోస్తా ఆంధ్రాలో రానున్న 2 రోజులపాటు తీవ్రమైన వేడిగాలులు ఉంటాయని పేర్కొంది. తెలంగాణ, రాయలసీమ లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది. పశ్చిమ గాలుల కారణంగా పశ్చిమ హిమాలయాల్లో రానున్న 3 రోజులపాటు వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. అలాగే రాజస్థాన్ లో ఏప్రిల్ 5 – 7 మధ్య ధూళి తుఫాన్లకు ఆస్కారం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Leave Your Comments

పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన పైర్లపై చీడపీడలు..

Previous article

యువ మహిళా రైతు రజిత సేద్యం..స్ఫూర్తిదాయకం

Next article

You may also like