వార్తలు

యేటా కొత్త పంటలు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతు లింగయ్య

0

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన దాగామ లింగయ్య సాగులో నూతన ఒరవడి సృష్టిస్తున్నాడు. వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటిస్తూ ముందుకెళ్తున్నాడు. రెండేండ్ల క్రితం మొట్టమొదటి సారిగా పుచ్చకాయ సాగు చేసి లాభాల బాట పట్టాడు. ఈ ప్రాంతంలో పుచ్చకాయను సాగు చేయడం, అధిక దిగుబడులు రావడంతో ఈ సీజన్ లో సాగు చేసేందుకు మరో ఇద్దరు రైతులు ముందుకొచ్చారు. తాజాగా తనకున్న ఎకరం భూమిలో మొట్టమొదటి సారిగా పసుపు వేసిన ఆయన ఆశించినంత దిగుబడి రావడంతో ఈ ప్రాంత రైతుల దృష్టిని మరోసారి ఆకర్షించాడు. తన ఎకరం భూమిలో రూ.60 వేల పెట్టుబడి పెట్టగా, ప్రస్తుతం పసుపును సేకరిస్తున్నాం. మార్కెట్ లో పసుపు క్వింటాలుకు రూ. 7,500 కు పైగా ధర పలుకుతున్నది. ఎకరం భూమిలో 15-20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. మద్దతు ధర ఆశించినంత ఉండడంతో పెట్టుబడులు పోనూ దాదాపు రూ. లక్ష దాకా ఆదాయం వస్తుందని పేర్కొంటున్నాడు.

తనకున్న పదేకరాల్లో ఆరు రకాల పంటలు వేశాడు. ఎకరం భూమిలో పసుపు, మరో ఎకరంలో పుచ్చకాయ, రెండెకరాల్లో శనగ, ఐదెకరాల్లో పత్తి, రెండు ఎకరాల్లో మిరప, కంది, మినుము, పెసర, బబ్బెర పంటలు వేశాడు. ఒకే పంటకు పరిమితం కావడంతో లాభాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటాయని, సీజన్ కు అనుకూలంగా విభిన్నమైన పంటలు వేస్తే అనుభావంతోపాటు లాభాలు సాధించవచ్చని వివరిస్తున్నాడు. కాగా ఈయన వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటిస్తూ ముందుకు సాగుతున్నాడు. నూతన పంటల విషయాలను కోటపల్లి మండల వ్యవసాయశాఖ అధికారి మహేందర్, ఏఈవో అనూష ద్వారా తెలుసుకుంటూ కొత్త పంటల సాగు వైపు అడుగులు వేశాడు. పంటలకు తెగుళ్లు సోకినా, దిగుబడి ఇతర విషయాల్లో ఏమైనా అనుమానాలుంటే వెంటనే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదిస్తున్నాడు. వారిచ్చిన సలహాలు, సూచనలు పాటిస్తూ మెరుగైన దిగుబడులు సాధిస్తున్నాడు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించడంతో పాటు సేంద్రియ ఎరువులను వాడుతున్నాడు.

వ్యవసాయంలో లాభాలు సాధించాలంటే రైతులు ఎప్పుడూ ఒకే పంటపై ఆధారపడవద్దు. తన ప్రాంతంలో అధికంగా పత్తి వేస్తూ మిగతా వాటిని రైతులు విస్మరిస్తున్నారు. ఒకే పంటను ఏండ్ల కొద్దీ సాగు చేయడంతో భూమికి నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని. మార్కెట్ లో డిమాండ్ వున్న పంటలను వేయడం వల్ల రైతులకు లాభాలు వస్తాయని. గతేడాది తను పుచ్చకాయ వేసిన అధిక లాభాలు రాగా ఈ సంవత్సరం పసుపు వేసి మంచి ఫలితాన్ని సాధించానని రైతు లింగయ్య చెప్పుకొచ్చారు.

Leave Your Comments

కూరగాయపంటల్లో నులిపురుగులు – నివారణ చర్యలు

Previous article

పట్టుపురుగుల పెంపకం – సస్యరక్షణ

Next article

You may also like