వార్తలు

కృష్ణ వ్రీహి బియ్యాన్ని పండిస్తున్న..కౌటిల్య కృష్ణన్

0

మరోసారి కృష్ణ వ్రీహి బియ్యాన్ని (నల్ల బియ్యం) పండిస్తున్నారు. వేదాల ఆధారంగా రెండవ సారి విజయవంతంగా తన పొలంలో నల్ల బియ్యాన్ని పండించినట్లు కౌటిల్య కృష్ణన్ తెలిపారు. కరీంనగర్ జిల్లా ఖాసీంపేట గ్రామంలోని తన 3 ఎకరాల పొలంలో కృష్ణ వ్రీహి పండించడంలో కౌటిల్య మరోసారి విజయవంతమయ్యారు. తెలంగాణ ప్రాంతంలో రైతులు అనాదిగా అనుసరించే మండి కట్టే పద్దతితో పాటు వేద వ్యవసాయ పద్ధతులు ఫాలో అయినట్లు ఆయన చెప్పారు. డిసెంబర్ మాసంలో విత్తనం వేశామని ఇప్పుడు వంద శాతం పంట వచ్చిందని కౌటిల్య తెలిపారు. వేద వ్యవసాయంలో భాగంగా పాలు, తేనెతో పాటు అగ్నిహోత్ర భస్మం కూడా వాడినట్లు చెప్పారు. అధిక దిగుబడి కోసం ఆవుపేడ ను ఎరువుగా వాడినట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో వేద వ్యవసాయం ద్వారా వంద శాతం పంట పండిందని చెప్పారు. చుట్టుపక్కల రైతులు కూడా కౌటిల్య పొలాన్ని సందర్శించి ప్రశంసలు కురిపిస్తున్నారు. మరో రెండు రోజుల్లో కరీంనగర్ కలెక్టర్ శశాంక్ కూడా కౌటిల్యుడి పొలాన్ని సందర్శించనున్నారు.
దేశీయ విత్తనాల వల్ల ప్రయోజనాలున్నాయి. నాటు విత్తనాలు వాడటం ద్వారా పురుగులు వచ్చే శాతం తక్కువ. రుచి బాగుంటుంది. విత్తనాలు వంద శాతం మొలకెత్తే అవకాశం ఉంటుంది. భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కూడా ఉంటుంది. నీళ్లు ఎక్కువగా అవసరం ఉండదు. ఎలాంటి భూమిలోనైనా పంట బ్రహ్మాండంగా పండుతుంది. పంట దిగుబడి బాగా వస్తుంది. రైతన్నలు నాటు విత్తనాలు నిల్వ చేసుకుని తదుపరి పంటకు మళ్ళీ వేసుకోవచ్చు. దేశీయ విత్తనాల్లో విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. దేశీయ విత్తనాలు వాడటం వల్ల ఆర్థికంగా కూడా రైతులు లాభపడతారు. దేశీయ విత్తనాల వల్ల అన్నదాతలు ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు.

Leave Your Comments

కరివేపాకు పంట సాగుతో లాభాలు గడిస్తున్న రైతులు..

Previous article

శనగ పంటలో చీడపీడలు – యాజమాన్యం

Next article

You may also like