వార్తలు

రాజస్థాన్ ప్రభుత్వం..ఇంటింటికి ఔషధ మొక్కల పంపిణీ

0

రాజస్థాన్ ప్రభుత్వం ఒక వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ ఔషధ మొక్కలను పంపిణీ చేయనుంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు నాలుగు ఎంపిక చేసిన ఔషధ మూలిక మొక్కలను అందించనున్నారు. గెహ్లాట్ ప్రభుత్వం ఈ మెగా పథకాన్ని రాష్ట్రంలో నివసిస్తున్న మొత్తం 1,26,50,000 కుటుంబాలకు వర్తింపజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఏ పథకంలో భాగంగా నాలుగు ఔషధ మూలికా మొక్కలైన తులసి, అశ్వగంధ, తిప్పతీగ, నేలవేము మొక్కలను ప్రతీ ఇంటికీ అందించునున్నారు. ఈ పంచవర్ష ప్రణాళిక కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 210 కోట్లు మంజూరు చేసింది. ఈ సందర్బంగా రాజస్థాన్ ప్రభుత్వం అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రంలో జీవవైవిధ్యం సమృద్ధిగా ఉంది. అలాగే అనేక ఔషధ మొక్కలకు నిలయంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఘర్ ఘర్ ఔషధీ యోజన ఈ సహజ సంపదను సంరక్షించడంలో సహాయపడుతుందన్నారు. ఔషధ మొక్కల ప్రాధాన్యతను ప్రజలు అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందన్నారు.

Leave Your Comments

మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నోట విజయనగరం మామిడి..

Previous article

గుమ్మడితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like