- మిర్చి పంటలో తెగుళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరా.
- ఉద్యానవన శాఖ డైరెక్టర్తో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్న మంత్రి.
- పరిస్థితిపై తక్షణ నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు.
- సంబంధిత శాస్త్రవేత్తలను వెంటనే క్షేత్రస్థాయికి పంపించాలని సూచన.
- రైతులకు నష్టం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు.
- మందుల పిచికారీపై శాస్త్రీయ సలహాలు రైతులకు అందించాలని స్పష్టం.
- 2021 నుంచి ఏపీలో వివిధ జిల్లాల్లో మిరప పంటపై నల్ల తామర పురుగు దాడి జరుగుతోందని మంత్రికి వివరించిన అధికారులు.
- రైతుల్లో అవగాహన పెంపుకు రైతు సేవా కేంద్రాల ద్వారా గ్రామస్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచన.
- ఉద్యాన శాఖ సిబ్బంది, వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో కలిసి క్షేత్ర సందర్శనలు.
- రైతులకు ప్రత్యక్షంగా సూచనలు, సలహాలు అందచేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్న.
- నల్ల తామర పురుగు నివారణకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేయాలి- మంత్రి అచ్చెన్నాయుడు.
- నివారణ చర్యలు, రైతులకు అవగాహన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు మంత్రికి వివరించిన హర్టికల్చర్ డైరెక్టర్ డా.కే.శ్రీనివాసులు.
Leave Your Comments


























