రైతులువార్తలు

రైతన్నకో ప్రశ్న ?

0

1.యాసంగి మొక్కజొన్నలో ఆకులు ఊదా రంగులోకి మారకుండా ఏ రసాయనం పిచికారీ చేసుకోవాలి (బి )

ఎ. మల్టీ కె 10 గ్రా.  / లీటర్ నీటికి   బి. 10 గ్రా. / లీటర్ నీటికి

సి. యూరియా 10 గ్రా. / లీటర్ నీటికి    డి.పైవన్నీ

  1. వరిలో కాండం తొలిచే పురుగు యాజమాన్యం తెలుపగలరు (డి)

ఎ. పంట చుట్టూ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి

బి. ఎకరాకి 4 లింగాకర్షణ బుట్టలను అమర్చుకొని పురుగు ఉధృతి గమనించాలి

సి. ఎకరాకి 4 కిలోలు క్లోరాన్ట్రానిలిప్రోల్ గుళికలను 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి

డి. పైవన్నీ

  1. మామిడిలో పూత బాగా రావడానికి యాజమాన్యం తెలుపగలరు (డి )

ఎ. ఒకసారి మల్టీ -కె 10 గ్రా.  + ఫార్ములా-4 3గ్రా. /లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి

బి. లేత పూత దశలో స్వల్ప నీటి తడి పెట్టుకోవాలి

సి. చెట్టు బేసిన్ చుట్టూ వున్న నేలను రేకింగ్ చేసుకోవాలి

డి. పైవన్నీ

  1. కుసుమలో పేనుబంక పురుగు యాజమాన్యం తెలుపగలరు (బి )

ఎ. ఎసిఫేట్ 1.5 గ్రా.  /లీటర్ నీటికి    బి. ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి. ల్లీ / లీటర్ నీటికి

సి. ప్రోపికోనాజోలు 1 మి. ల్లీ / లీటర్ నీటికి    డి. పైవన్నీ

  1. జీవ కంచె మొక్క కింద వాడే పండ్ల మొక్క ఏది (ఎ)

ఎ. కరొండా                    బి. నిమ్మ                     సి.  బిల్వం            డి.మామిడి

  1. పులుపు ఎక్కువగా ఉండి, కాయ చిన్నగా ఉండి, కాయ గుజ్జు లేత పసుపు రంగులో ఉండే పైనాపిల్ రకం ఏది (బి )

ఎ. క్యూ                 బి. సింహాచలం               సి.  క్వీన్           డి. రెడ్ లేడీ

  1. క్రింది వాటిలో ఉసిరి రకం ఏది? (ఎ)

ఎ. లక్ష్మీ-52            బి.గౌరీ                       సి.శ్యామల               డి. జ్యోతి

  1. వరి పంటలో బోరాన్ లోప లక్షణాలు (సి)

ఎ) లేత ఆకుల చివరల ఎండిపోతాయి. ఇవి ముడుచుకొని చివరికి గోధుమ రంగులోకి మారుతాయి.

బి) పుచే దశలో గింజలేర్పడడం, ఫలధీకరణంపై ప్రభావం చూపుతుంది

సి) పైవన్నీ                      డి) పైవి ఏవి కావు

  1. మొక్కజొన్న పంటలో జింకు లోప లక్షణాలు? (డి)

ఎ) ఆకుల మధ్యలో పసుపురంగు మచ్చలేర్పడతాయి

బి) ఆకులు సరిగా ఎదగక చిన్నగా ముడుచుకోవడం జరుగుతుంది

సి)  మొక్క పెరుగుదల సరియైన రీతిలో ఉండక పొడవు తగ్గిపోతుంది

డి) పైవన్నీ

  1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్ (IIOR) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (బి )

ఎ) న్యూఢిల్లీ        బి)హైదరాబాద్  సి)   గుంటూరు    డి) లక్నో

ఎం. రాజశేఖర్, శాస్త్రవేత్త (ఎంటమాలజీ), వ్యవసాయ కళాశాల, జె.ఎస్.సుధా రాణి, శాస్త్రవేత్త (ఆగ్రోనమీ), ఎలక్ట్రానిక్ వింగ్, డాక్టర్.కె.అరుణ, శాస్త్రవేత్త, డాక్టర్.ఎ.నిర్మల, శాస్త్రవేత్త, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, సంగుపేట్, సంగారెడ్డి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్,

 

 

 

 

 

 

Leave Your Comments

రొయ్యల పెంపకంలో చెరువుల  తయారీ, పిల్లల ఎంపికలో  జాగ్రత్తలు

Previous article

మామిడి కోకోతో పాటు అన్ని పంటల ధరలపై ముందస్తు అంచనాలు – మంత్రి అచ్చెన్నాయుడు

Next article

You may also like