ఆంధ్రప్రదేశ్పాలవెల్లువవార్తలు

AP CM YS Jagan: ఏపీ వ్యవసాయరంగ పరిస్థితిపై అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష

0
AP CM YS Jagan

AP CM YS Jagan: వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచే విప్లవాత్మక చర్యల ప్రగతిని సమీక్షించారు సీఎం వైయస్‌ జగన్‌. ఈ సమీక్షలో సీఎం దాదాపు 15 రకాల ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. డ్రై స్టోరేజీ – డ్రైయింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్, గోడౌన్లు, హార్టికల్చర్‌లో మౌలిక సదుపాయాలు, ప్రైమరీ ప్రాససింగ్‌సెంటర్లు, అసేయింగ్‌ ఎక్విప్‌మెంట్, ప్రొక్యూర్‌ మెంట్‌ సెంటర్లు, ఇ– మార్కెటింగ్, మెగా కస్టం హైరింగ్‌ హబ్స్, ఆర్బీకేల స్థాయిలో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు, వరిపండిస్తున్న జిల్లాల్లో కంబైన్డ్‌హార్వెస్టర్లు, ఏంఎసీలు–బీఎంసీలు, ఆక్వా ఇన్‌ఫ్రా, ఫిషింగ్‌ హార్బర్లు–ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్లు, ఫుడ్‌ ప్రాససింగ్‌సెంటర్లు, పశుసంవర్థక శాఖలో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై ఇప్పటివరకూ తీసుకుంటన్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం.

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టుల్లో గణనీయ పురోగతి కనిపించాలి. సాధ్యమైనంత త్వరగా వాటిని రైతులకు, అనుబంధ రంగాలకు అందుబాటులోకి తీసుకురావాలి. తద్వారా రైతులకు అదనపు ఆదాయాలు లభించేలా చూడాలి. క్షేత్రస్థాయిలో కచ్చితంగా మార్పు కనిపించాలి: గోదాములు సహా అన్నిరకాల నిర్మాణాలు ఊపందుకోవాలి. ప్రపంచంలో ఇప్పుడు సేంద్రీయ, సహజ వ్యవసాయ విధానాలద్వారా వచ్చిన ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ అవకాశాలను మన రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఆర్బీకే స్థాయిలో సేంద్రీయ వ్యవసాయం మీద ఒక కస్టం హైర్‌ సెంటర్‌ రావాలన్నారు సీఎం జగన్ .

వచ్చే ఏడాది నాటికి తీసుకు వచ్చేలా ఒక ప్రణాళిక వేసుకోవాలి. సేంద్రీయ, సహజ వ్యవసాయం చేయడానికి అవసరమైన యంత్రాలు, పరికరాలు ఏంకావాలో నిర్ణయించి.. ఆ మేరకు ప్రతి ఆర్బీకే స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేసే వాటికి మంచి రేటు వచ్చేలా చూడాలని, అలాంటి ఉత్పత్తులు చేస్తున్న రైతులకు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేలా ఒక విధానం తీసుకురావాలన్నారు సీఎం జగన్.

AP Agriculture

AP Agriculture

గోడౌన్ల నిర్మాణానికి జిల్లాల్లో దాదాపుగా స్థల సేకరణ పూర్తయ్యిందని, 1165 చోట్ల గోడౌన్లు నిర్మిస్తున్నామని తెలిపిన అధికారులు. ఇప్పటికే చాలాచోట్ల పనులు మొదలుపెట్టామని తెలిపిన అధికారులు. 278 చోట్ల గోడౌన్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని తెలిపిన అధికారులు.. రైతులు మోసాలకు గురికాకుండా బరువును, తేమను కొలిచే పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపిన అధికారులు. ప్రొక్యూర్‌ మెంట్‌లో వినియోగించే 6,293 పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు అధికారులు. వైయస్సార్‌ యంత్రసేవా కింద రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్న వ్యవసాయ యంత్రాలు, పనిముట్లూ, పరికరాలపైనా ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఇప్పటికే 3,497 యూనిట్లను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చామని అధికారులు తెలిపారు.

పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా మొత్తంగా 33 చోట్ల విత్తనాలు, మరియు మిల్లెట్‌ ప్రైమరీ ప్రాససింగ్‌ సెంటర్లు ఏర్పాటు. ఖరీఫ్‌ 2022 నుంచి అందుబాటులోకి ఈ ప్రాససింగ్‌సెంటర్లు.. విత్తన శుద్ధి, మరియు ప్రాససింగ్‌సెంటర్లు రెండు రకాలుగా ఉపయోగపడనున్న యూనిట్లు. చిరుధాన్యాలు, పప్పు దినుసులు సాగుచేస్తున్న రైతులు ఈ యూనిట్లను చక్కగా వినియోగించుకోవచ్చన్న అధికారులు. ప్రాసస్‌ చేయడంవల్ల రైతులకు మంచి ధరలు లభిస్తాయని, నాణ్యమైన ఉత్పత్తులు కూడా ఉంటాయని తెలిపిన అధికారులు. సెకండరీ ప్రాససింగ్‌ చేసే వాళ్లకు, సంబంధిత వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి ముడిపదార్థాలు లభిస్తాయన్నని అన్నారు అధికారులు.

13 యూనిట్ల ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోందని అధికారులు సీఎం కు చెప్పారు. ఉద్యానవన పంటలు సాగుచేస్తున్న రైతులకూ అందుబాటులో కలెక్షన్‌ సెంటర్లు, కోల్డ్‌ స్టోరేజీల ఏర్పాటు పనులపై సీఎం ఆరా తీశారు. పశువులు కోసం 175 అంబులెన్స్‌లు సిద్ధం చేసినట్లు తెలిపిన అధికారులు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు. మార్చి నెలలో ప్రారంభం కానున్న అంబులెన్స్‌లు.

Also Read: ఏపీ ప్రకృతి వ్యవసాయంపై నీతి ఆయోగ్ ఫిదా

Jagananna Palavelluva

Jagananna Palavelluva

జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్నీ సమీక్షించిన సీఎం:
– దాదాపు 1100 గ్రామాల్లో పాల సేకరణ చేస్తున్నట్టు తెలిపిన అధికారులు.
– నెలకు 28,00,502 లీటర్లకుపైగా పాలను సేకరిస్తున్నట్టు తెలిపిన అధికారులు.
–ఇప్పటివరకూ 2.03 కోట్ల లీటర్లకుపైగా సేకరణ.
– ఇప్పటివరకూ రైతులకు రూ.86.58 కోట్ల చెల్లింపులు. రైతులకు అదనపు లబ్ధి రూ.14.68కోట్లు.
– అమూల్‌ప్రవేశంతో ఇతర డైరీలు తప్పకుండా ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందన్న అధికారులు.
– తూనికల్లో తేడాలు, ఫాట్‌ నిర్దారణలో తప్పిదాలకు పాల్పడుతున్నవారిపై కేసులు బుక్‌చేశామని తెలిపిన అధికారులు.
– రైతులు మోసాలకు గురికాకుండా అడ్డుకుంటున్నామని తెలిపిన అధికారులు.
– గేదెపాలలో ఒక శాతం తేడాచూపితే రైతుకు దాదాపు రూ.7ల నష్టం వస్తోందన్న అధికారులు.

–బీఎంసీ, ఏంఎసీల ప్రగతిని సమీక్షించిన అధికారులు:
– వచ్చే నెలలో విశాఖపట్నం జిల్లాలో అమూల్‌ పాలసేకరణ ప్రారంభం.
– చిత్తూరు, కృష్ణ, విశాఖపట్నంలో పాల ఉత్పత్తుల యూనిట్లను ప్రారంభించనున్న అమూల్‌.

–ఆక్వారంగంలో మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టులను సమీక్షించిన సీఎం.
– ఆక్వాహబ్‌లు, స్పోక్స్‌ ద్వారా భారీగా ఉపాధి కల్పన చేస్తున్నట్టు తెలిపిన అధికారులు.
– దాదాపు 80వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కలుగుతోందని తెలిపిన అధికారులు.
– స్థానికంగా వినియోగం పెరిగే అవకాశాలు మెరుగుపడుతున్నాయని తెలిపిన అధికారులు.
– జూన్‌ నాటికి 70 ఆక్వాహబ్‌లు, 14వేల స్పోక్స్‌ ఏర్పాటు దిశగా సాగుతున్నట్టు తెలిపిన అధికారులు.
– 23 ప్రీ ప్రాససింగ్‌ ప్లాంట్లు, 10 ప్రాససింగ్‌ ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపిన అధికారులు.
– వీటికి సంబంధించి ఇప్పటికే 9 సొసైటీలను ఏర్పాటు చేశామన్న అధికారులు.

ఫిషింగ్‌ హార్భర్లపై సీఎం సమీక్ష:
– మొదటి విడతలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నంల్లో ఫిషింగ్‌ హార్బర్ల పని సాగుతోందని తెలిపిన అధికారులు.
– ఉప్పాడల్లో కూడా పనులు వేగవంతం చేస్తామన్న అధికారులు.
– నాలుగు నెలల్లో పనులు పూర్తిచేయడానికి ప్రయత్నాలు చేస్తామన్న అధికారులు.
– రెండో విడతలో పూడిమడక, బియ్యపుతిప్ప, ఓడరేవు, కొత్తపట్నంలో పనులు చేపడుతున్నామన్న అధికారులు.
– ఈఏడాది డిసెంబరు చివరినాటికి పూర్తిచేసేదిశగా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.

ఈ సమీక్షా సమావేశానికి ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ఛైర్మన్‌ ఎంవియస్‌ నాగిరెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read: సీఎం జగన్ నిర్ణయంతో అందుబాటు ధరల్లో టమోటా

Leave Your Comments

Farmer Son Success Story: ఒక రైతు కొడుకు నుండి కార్పొరేట్ లెజెండ్ వరకు ప్రయాణం

Previous article

Trichoderma: ట్రైకోడెర్మాతో తెగుళ్ల నివారణ

Next article

You may also like