ఉద్యానశోభ

వానాకాలం సాగుకు తయారువుదాం ఇలా..

వ్యవసాయాన్ని లాభసాటిగా చెయ్యాలంటే సమర్థ వనరుల వినియోగం, సరైన ప్రణాళిక ఎంతైనా అవసరం. ప్రస్తుత సంవత్సరంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఆశిస్తూ అందుకు గాను రైతులు కొన్ని ఆచరణ సాధ్యమయ్యే తేలికపాటి సాంకేతిక అంశాలైన క్రింది పనులను చేపట్టాలని తెలియపరుస్తున్నాము.  వేసవి దుక్కులు :- వేసవి కాలంలో అడపా దడపా  కురిసే వర్షాలను సద్వినియోగ పరుచుకొని మాగాణి, మెట్ట, బీడు భూములను దున్నుకోవడమే వేసవి దుక్కులు.  ఈ దుక్కులు దున్నే ముందుగా పశువుల ఎరువు, కంపోస్ట్ కానీ సమానంగా వెదజల్లి  దున్నడం వల్ల నేల సారవంతమవుతుంది. అంతేకాకుండా భూమిలో వున్న కీటకాలు, శిలీంధ్రాలు చనిపోతాయి.   పంట అవశేషాలు తొలగించడం :-యాసంగిలో వేసిన పంట కోసిన తరువాత ఆ పంట యొక్క అవశేషాలను కాల్చకుండ ఆధునిక పద్ధతులతో విలువ జోడించి మెత్తగా వాడుకోవచ్చును   చెరువులోని పూడిక మట్టి తోలుకోవడం :-చెరువు  మట్టిలో అనేక పోషకాలతో పాటు  నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే కర్బనం కూడా ఉంటుంది. అందువల్ల చెరువు మట్టిని రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.   చెరువు మట్టి ప్రయోజనాలు :-చెరువు మట్టిలో ఒండ్రు, బంక మట్టి రేణువులు అధికంగా ఉంటాయి. ఈ మట్టి తోలిన పొలాల్లో నీటి నిల్వ శక్తి పెరుగుతుంది. చెరువు మట్టిలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం తగినంత ఉండటం వలన ఉదజని  సూచిక 7-7.5 వరకు ఉంటుంది.  చెరువు మట్టి వేసిన పొలాల్లో వేసవి లో ఉష్ణోగ్రతల్లో పెద్దగా హెచ్చుతగ్గులు ఏర్పడవు. దీని వలన పైర్లు బెట్టుకు గురికాకుండా ఉంటాయి.    చెరువు మట్టి వేసిన పొలాల్లో  తేమ నిలిచే కాలం 4-7 రోజులు పెరుగుతుంది.  చెరువు మట్టి ఎర్ర, చెల్క, దుబ్బ నేల నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించి సమపాళ్లలో గాలి, నీరు నిల్వ ఉండేలా చేసి ఉత్పాదకతను పెంచుతుంది.   భూసార పరీక్షలు చేసుకోవడం :-పైర్లకు కావాల్సిన అన్ని పోషకాలు ఎంతో కొంత పరిమాణంలో నేలలో సహజంగానే ఉంటాయి. నేలలో పోషకాలు ఏ స్థాయిలో, ఏ మోతాదులో  తెలుసుకోవడం  భూసార పరీక్ష చేయించాలి. నేల రంగు, స్వభావం  వంటి భౌతిక లక్షణాలే కాక, ఉదజని  సూచిక, లవణ పరిమాణం, సేంద్రియ కర్బనం, లభ్య భాస్వరం, లభ్య పొటాషియం నిర్దారించి సలహాలు, సూచనలు “సాయిల్ హెల్త్ కార్డ్” రూపంలో రైతులకు అందజేస్తారు.  ప్రతి రైతు  తప్పని సరిగా భూసార పరీక్ష చేయించడం మంచిది. ఏప్రిల్ – మే నెలలు మట్టి నమూనా తీయడానికి  అనువైన సమయం.  భూసార పరీక్ష లాభాలు :-  నేలలో ప్రధాన పోషకాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోవచ్చు.  నేల సారం పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి తెలుస్తాయి.   ...
ఉద్యానశోభ

జూన్ మాసంలో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన సేద్యపు పనులు..

మామిడి: కాయ కోతలు పూర్తయిన తోటల్లో నీరు పెట్టాలి. తరువాత చెట్లకు విశ్రాంతిని ఇవ్వాలి. విశ్రాంతి అనంతరం చెట్లలో మిగిలిపోయిన పూత కొమ్మలు, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు, గొడుగు కొమ్మలను తీసివేయాలి. ...
పశుపోషణ

కడక్ నాథ్ కోళ్ల పెంపకంలో సాప్ట్ వేర్ ఉద్యోగులు..

నలుపు కోళ్లు అయితేనే.. మాంసం రుచి అదరహో .. ప్రొటీన్ల శాతం కూడా సూపర్.. కొవ్వు తక్కువ. ఇంకెన్నో సుగుణాలు కల్గిన కడక్ నాథ్ అనే నల్ల కోళ్ల పెంపకంపై తెలంగాణ, ...
ఆరోగ్యం / జీవన విధానం

అండు కొర్రలతో ఎన్నో ప్రయోజనాలు..

తృణ ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అందులోనూ అండు కొర్రల్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి జీర్ణాశయం, ఆత్రయిటిస్ (కీళ్ల వాతం), బీపీ, థైరాయిడ్, ఊబకాయం, కంటి సమస్యలు నివారణకు బాగా ...
ఆరోగ్యం / జీవన విధానం

ఉలవలు తినడం వలన కలిగే ప్రయోజనాలు..

ఉలవల్లో ఎన్నో పోషకాలున్నాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బోలెడు ప్రయోజనాల్ని ఇస్తాయి. ఉలవల్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ లతో పాటు బోలెడంత పీచు పదార్థం లభిస్తుంది. ...
ఉద్యానశోభ

ఉద్యాన పంటలు పండిస్తున్న..అంతర్గాము

రోజు రోజుకి వ్యవసాయం తీరు మారుతున్నది. మన రైతులు తెలివితో సాగు చేస్తున్నారు. ఉపాయంతో ఉద్యాన తోటల్ని పెంచుతున్నారు. లాజిక్ తో లాభాలు గడిస్తున్నారు. మోటు వ్యవసాయానికి, మూస పద్ధతులకు స్వస్తి ...
వార్తలు

సాగు భూముల్లో..అధికంగా భాస్వరం

తెలంగాణ రాష్ట్రంలో అధిక సాగు భూముల్లో ఎక్కువగా భాస్వరం ఉన్నదని ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్శిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా. జగదీశ్వర్ తెలిపారు. రైతులు మూసపద్ధతుల్లో భాస్వరం వంటి ...
వార్తలు

ఏపీ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ కు ముందే రైతులకు పెట్టుబడి సాయం..

ఏపీ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ కు ముందే రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ ...
వార్తలు

సేంద్రియ ఎరువుల వినియోగంపెంచడంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

సేంద్రియ ఎరువుల వినియోగం (సిటీ కంపోస్ట్ ) పెంచడంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న వ్యవసాయ శాఖ ముఖ్య ...
ఉద్యానశోభ

అశ్వగంధ సాగు విధానం..

అశ్వగంధ పెన్నేరు గడ్డలు, డొమ్మడోలు అని అంటారు. అశ్వగంధ నిటారుగా పెరిగే మొక్క. ఆకులు అండాకారంగా, పువ్వులు తెల్లగా ఉంటాయి. పండ్లు గుండ్రంగా ఉండి పండినప్పుడు ఎరుపు రంగుకు మారతాయి. వేర్లు ...

Posts navigation