ఆంధ్రా వ్యవసాయంచీడపీడల యాజమాన్యంతెలంగాణవ్యవసాయ పంటలు

గోధుమ పంటలో ఆశించే చీడ – పీడలు మరియు వాటి నివారణ

0

గోధుమ యాసంగిలో చల్లటి వాతావరణంలో సాగు చేసే ముఖ్యమైన ఆహార పంట, మన రాష్ట్రంలో గోధుమ మెదక్, ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో రైతులు సాగు చేస్తున్నారు. తగిన నీటి నిల్వవతో పాటు అధిక గాలి ప్రసరణ, అధిక కర్బన్ శాతం గల బరువైన నేలలో గోధుమ అధిక దిగుబడికి అనుకూలం.

  • విత్తన శుద్ధి  :  కీటకాల నివారణకు థయోమిథాక్సామ్ 3 గ్రా. కేజీ విత్తనానికి కలుపుకోవాలి. తెగుళ్ళ నివారణకు కార్బాక్సీన్  (+) ధైరమ్ 1 గ్రా. కేజీ విత్తనానికి కలుపుకోవాలి.
  • చెద పురుగులు : ఇవి మొక్క యొక్క పరిపక్వత దశలో నష్టం జరుపుతాయి. ఇవి వేరు మరియు కాండం పై ఎక్కువగా ఆశించి చివరికి మొక్క ఎండిపోయోటట్లు చేస్తుంది.
  • నివారణ : గోధుమలు విత్తుకునే ముందు క్లోరిపైరిఫాస్ 20% ఇ.సి. 3 – 4 మి.లీ కిలో విత్తనలకు శుద్ధి చేసుకోవాలి. అలాగే క్లోరిపైంపాస్ 20% 2-3 లీ / హెక్టార్ భూమిపై పిచికారి చేసి దీనిని నివారించవచ్చు.
  • పేనుబంక : ఇది వ్యాపించిన మొక్క కాండం ఉబ్బినట్లుగా మరియు ఆకు ముడతలు, మెలితిప్పినట్లుగా కన్పిస్తాయి. ఇవి వ్యాపించడానికి చల్లటి వాతావరణం అనుకూలం, ఇది ఆశించడం వలన ఆకులపై నల్లటి మసి ఏర్పడుతుంది.
  • నివారణ : క్వినాలపాస్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్  0.35 మి.లీ. నీటికి కలిపి పిచికారి చేసి దీనిని నివారించుకోవచ్చు.
  • గులాబీ కాండం తొలుచు పురుగు : ఈ పురుగు ముఖ్యంగా ఎక్కడైతే  గోధుమ శూన్య దుక్కి (జిరోటిల్లెట్) పంట సాగుతో విత్తటం జరుగుతోందో ఆ పంటల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కాండంపై రంధ్రంతో కూడిన లక్షణంతో గుర్తుపట్టవచ్చు.
  • నివరణ : క్లోరాంట్రానిలిప్రోల్ 18.5% ఇ.సి. 0.25 మి.లీ (లేదా) క్లోరోపైరిఫాస్ 20% ఇ.సి. 5 మి.లీ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
  • కాండపు ఈగ : ఈ కాండపు ఈగ ద్వారా మొక్కలోని మధ్య మోగి చనిపోవును. దీని నివారణకు సైపర్ మేత్రిన్ 10% ఇ. సి 1 మి.లీ. నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

తెగుళ్ళు :-

  • తుప్పు తెగులు : ఆకుల మీద రెండు వైపుల గోదుమ రంగు కలిగిన చిన్న చిన్న ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఆకు తొడిమ మరియు కాండం మీద కూడా ఏర్పడతాయి. ఈ మచ్చలు ఎక్కువగా అయిన యెడల ఆకులు ఎండిపోరాతాయి.
  • నివారణ : లీటరు నీటిలో 2.5 గ్రా. మాంకోజెబ్ ను (లేదా) ప్రొపికోనజోల్  25  ఇ.సి. ఒక మి.లీ. (లేదా) టేబుకొనజోల్ (+) “ట్రిపుల్ యాక్సి స్ట్రోబ్”  .0.6 గ్రా. (లేదా) క్రెసోక్సిమ్ మిథైల్  1 మి.లీ మందును కలిపి పైరు పై తెగులు గమనించిన వెంటనే పిచికారి చేసుకోవాలి.
  • కంకి కుళ్ళు : ఈ తెగులు గింజ మొదటి భాగంలో నలుపు రంగులో ఏర్పడి లోపల రంధ్రాన్ని ఏర్పరుస్తుంది. కొన్ని సార్లు ఇది పంట కొత తరువాత కూడా కన్పించకుండా పంట దిగుబడి తగ్గేటట్లు చేస్తుంది.
  • నివారణ : బైటార్ టనోల్ 25% (డబ్ల్యు, పి.) 4.5 గ్రా. లీ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
  • మసి తెగులు : ఈ తెగులు ఆలస్యంగా మొలకెత్తిన మొక్కల ఆకులు మరియు కాండంపై ఏర్పాడును. దీని ప్రభావం పెరిగిన కొద్ది ఆకులు ఎండిపోవడం, రాలిపోవడం జరుగుతుంది.
  • నివారణ : కార్బండాజిమ్ 50%  2 గ్రా. విత్తనాలతో విత్తన శుద్ధి చేసిన తరువార విత్తుకుంటే ఈ తెగులుని నివారించుకోవచ్చు.
  • గోధుమ ఆకు ఎండు తెగులు : ఎరుపు గోధుమ రంగులో గల మచ్చలు పసుపు రంగు అంచుతో మొలకల ఆకులపై దీనిని గమనించవచ్చు. క్రమంగా మచ్చలు పెరుగుతూ ఆకులు ఎండిపోవడం జరుగుతుంది. ఉష్ణోగ్రత 25 డీగ్రీలు దీని పెరుగుదలకు తోడ్పడుతుంది.
  • నివారణ : క్లైసాక్సిమ్ మిథైల్ 44.3% 1 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
  • బూడిద తెగులు : ఈ తెగులు మొక్కల ఆకులు మరియు కండల మీద తెలుపు రంగులో (పొడి రూపంలో) ఏర్పడి,ఈ మచ్చలు క్రమంగా పెరుగుతూ ఆకులు మరియు మొక్క యొక్క ఇతర భాగాలు ఎండి పోయెటట్లు చేస్తుంది.
  • నివారణ : సల్ఫర్ 80% డబ్యు డి. జి.  5.గ్రా. (లేదా) అజోక్సిస్ట్రోబిన్ (+) ప్రోపికోనజోల్ 2 మి.లీ (లేదా) అజోక్సిస్ట్రోబిన్ (+) డైఫెనో కొనజోల్  2 మి.లీ (లేదా) అజోక్సిస్ట్రోబిన్  (+) టేబుకో కొనజోల్  1.5 మి.లీ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

డా. కె. రాజశేఖర్ సీనియర్ శాస్త్రవేత్త (ఎంటోమోలోజి ), డా. జి. ప్రవీణ్ కుమార్, శాస్త్రవేత్త (ప్లాంట్ బ్రీడింగ్), డా. డి మోహన్ దస్. శాస్త్రవేత్త (అగ్రోనోమి ), డా. ఎమ్. రాజేందర్ రెడ్డి, శాస్త్రవేత్త (ప్లాంట్ బ్రీడింగ్), డా. శ్రీధర్ చోహన్, ప్రధాన శాస్త్రవేత్త (అగ్రోనోమి) & హెడ్, రఘుపతి, ఎస్.ర్ ఎస్, వ్యవసాయ పరిశోధన స్థానం, ఆదిలాబాద్.

 

 

 

Leave Your Comments

ఆక్వా కల్చర్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం రైతుల ఆదాయం పెంపే లక్ష్యం- అచ్చెన్నాయుడు

Previous article

కంది పంట కోతలో మరియు నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Next article

You may also like