తెలంగాణవార్తలు

నూతన ఆవిష్కరణలతో రైతాంగానికి మహర్దశ 

0
Thummala Nageswara Rao
Thummala Nageswara Rao
  • ఎర్త్ సమ్మిట్ స్టార్టప్స్ కు బాటలు వేయాలి
  • రైతాంగానికి చేయూతగా నిలిచిన నాబార్డ్ కు ధన్యవాదాలు
  • ఎర్త్ సమ్మిట్ హైదరాబాద్ ఎడిషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల
                 గ్రామీణ భారతావణి అభివృద్ధికి సంస్కరణలు నూతన ఆవిష్కరణలతో బాటలు వేయొచ్చని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.  హైదరాబాద్ హైటెక్స్ లో నాబార్డ్ మరియు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రెండు రోజుల ఎర్త్ సమ్మిట్ సదస్సులో పాల్గొన్న మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతాంగానికి చేయూతగా నిలిచిన నాబార్డ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు, గ్రామీణ భారత దేశంలో రైతాంగానికి వెన్నుదన్నుగా ఉన్న నాబార్డ్ సేవలు అభినందనీయమన్నారు.
           వ్యవసాయ రంగంలో స్టార్టప్స్ కు సమ్మిట్ బాటలు వేయాలనీ
 సీఎం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో స్టార్టప్స్ ను ప్రోత్సహిస్తున్నామనీ
ఎఫ్.పీ.ఓ లు స్టార్టప్స్ ఏర్పాటు చేస్తున్నాయన్నారు.
         మారిన వాతావరణ మార్పులకు తగ్గట్టుగా ఆవిష్కరణలు జరగాలి, అందుకోసం మార్కెటింగ్ కో ఆపరేటివ్ తో పాటు అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
           వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి నూతన ఆవిష్కరణలు దోహదం చేస్తాయన్నారు మంత్రి తుమ్మల.
       గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నూతన ఆవిష్కరణలు పాలనా సంస్కరణలతోనే సాధ్యమని, భారత రైతాంగానికి మరియు నిరుద్యోగ యువతకు మేలు జరిగేలా నాబార్డ్ చేపట్టిన ఎర్త్ సమ్మిట్ కు ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలిపారు మంత్రి తుమ్మల.
         ఈ కార్యక్రమంలో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ డిప్యూటీ ఎం డీ గోవర్ధన్ సింగ్ రావత్ మరియు డి. ఎం డీ డాక్టర్ అజయ్ కుమార్ సూద్ పాల్గొన్నారు.
Leave Your Comments

భారతదేశంలో జన్యు – సవరించిన వరి వంగడాల విడుదల – వ్యవసాయ రంగంలో విప్లవాత్మక అధ్యాయం

Previous article

అధికసాంద్రత పద్దతి ప్రత్తి సాగులో చేప్పట్టాల్సిన పెరుగుదల నియంత్రణ చర్యలు  

Next article

You may also like