ఈ రోజు రైతు నేస్తం కార్యక్రమం సందర్భంగా జాతీయ ఆహార భద్రతా పథకం లో మేలైన పప్పుదినుసుల వంగడాల విత్తనం పంపిణీ చేసిన మంత్రి తుమ్మల.
• ఒక్కొక్క పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పిన మాట దిశగా గతవారం జాతీయ నూనె గింజల మిషన్ ఆరంభం – మంత్రి తుమ్మల
• ఇప్పటికే వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందన్న – మంత్రి తుమ్మల
• గత సీజన్ లో జిల్లాకు ఎంపిక చేసిన ఒక మండలంలో 1,39,000 మట్టి నమూనాలు సేకరించి, వాటి విశ్లేషణ పూర్తి చేసి ఫలితాలు రైతులకు అందచేయడానికి ఏర్పాట్లు చేయాలని, త్వరలో ఇంకో 1,70,000 మట్టి నమూనా ఫలితాలు అందుతాయన్న – మంత్రి తుమ్మల
• నేచురల్ ఫార్మింగ్ కు అత్యంత ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం – మంత్రి తుమ్మల
• ఇప్పటికే క్లస్టర్ల గుర్తింపు మరియు శిక్షణ పూర్తి – మంత్రి తుమ్మల
• ఈ రోజు నుంచి ప్రారంభంకానున్న సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు – మంత్రి తుమ్మల
• 317 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసిన సీసీఐ – మంత్రి తుమ్మల
• రేపు ఖమ్మం జిల్లా మరియు 24న నల్గొండ జిల్లా లో ప్రారంభం కానున్న పత్తి కొనుగోలు కేంద్రాలు – మంత్రి తుమ్మల
• ఇతర జిల్లాల్లో కూడా వెంటనే సీసీఐ కేంద్రాలను ప్రారంభించాలి అని ఆదేశించిన – మంత్రి తుమ్మల
• రైతుల సమస్యల పరిష్కారం కోసం టోల్-ఫ్రీ నంబర్ 1800 599 5779 ఏర్పాటు, ఈ టోల్ ఫ్రీ నంబర్ ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు రైతులకు అందుబాటులో ఉంటుంది – మంత్రి తుమ్మల
• 24 గంటలో రైతుల సమస్యకు పరిష్కరించే విధంగా ఒక సీనియర్ అధికారితో పర్యవేక్షణ ఉంటుంది – మంత్రి తుమ్మల
మంగళవారం సెక్రటేరియట్ లో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు జాతీయ ఆహార భద్రతా పథకం కింద నాణ్యమైన పప్పుదినుసుల వంగడాలను, పొద్దుతిరుగుడు, కుసుమ వంగడాలను సబ్సిడీ మీద రైతులకు అందచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర వాటాలతో అమలు అయ్యే పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తూ, గరిష్ట స్థాయిలో రైతుల ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ మరియు ఉద్యాన శాఖలు చర్యలు చేపట్టాయని గౌరవ వ్యవసాయశాఖ మంత్రివర్యులు తెలియజేశారు.
గత ప్రభుత్వం రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడంంతో రాష్ట్ర రైతాంగం గత పదేళ్లలో దాదాపు 3000 కోట్ల మేర నష్టపోయిందని, కేంద్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్రానికి కేటాయించిన అట్టి నిధులను తిరిగి అవే రాష్ట్రాలకు తరువాత కేటాయిస్తే కనీసం రాష్ట్రాల ప్రాథమిక హక్కులను, అట్టి రాష్ట్రాల రైతలు ప్రయోజనాలను కాపాడే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించినట్లు ఉండేదని, కానీ అలా చేయకపోవడంతో అప్పటి ప్రభుత్వ రాజకీయ దురుద్దేశాలకు రైతులు నష్టపోయాయరని గుర్తుచేశారు.
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను పూర్తి స్థాయిలో వాడుకోవాలని, దానికి తగ్గ రాష్ట్రవాటా నిధులు విడుదల చేసి మన రాష్ట్ర రైతులకు ఆర్థికాభివృద్ధికి పాటుపడాలని కృతనిశ్ఛయంతో ఉన్నారని మంత్రి తుమ్మల తెలిపారు. రైతుల ప్రయోజనాలే ప్రజా ప్రభుత్వానికి పరమావధి అని తెలిపారు. దానికి తగ్గట్లు ఆర్థిక వెసులుబాటు రాగానే ఒక్కొక్క పథకాన్ని పునరుద్ధరిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో వరితో పాటు పప్పుదినుసులు, నూనె గింజల సాగును కూడా పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ పథకంలో భాగంగా ఈ యాసంగిలో 2.68 కోట్ల సబ్సిడీతో 49,397 ఎకరాలకు సరిపడా 5825 క్వింటాళ్ల శనగ విత్తనాలు 14 జిల్లాలలో పంపిణీకి వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు.
గతవారం పంపిణీ చేసిన వేరుశనగతో పాటు, పొద్దుతిరుగుడు (83.78 క్వింటాళ్ల tilhan tech-sunh-1) హైబ్రిడ్ విత్తనాలను 74 క్వింటాల్ల కుసుమ విత్తనాలకు 45.41 లక్షల మొత్తాన్ని వినియోగించి సరఫరా చేయుటకు నిశ్చయించడమైనదని మంత్రి తెలిపారు.
2025-26 లొ 48.54 కోట్లతో జాతీయ ఆహార భద్రత పథకాన్ని అమలు చేస్తున్నామని, విత్తనాలతో పాటు ప్రదర్శన క్షేత్రాలు, విత్తనోత్పత్తి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు గౌరవ మంత్రి తెలియజేశారు.
రైతువేదికల వద్ద రైతులని సమీకరించి ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పథకాలు, మరియు రైతులకు లబ్ది కలిగించే పూర్తి సమాచారాన్ని పక్కాగా అందించాల్సిన బాధ్యత DAO, AO, AEO లు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన శాస్త్రవేతలను, వ్యవసాయ నిపుణలను ఆహ్వానించి రైతులకు వ్యవసాయ ఉత్తపతులకు మరియు మార్కెటింగ్ పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. రైతునేస్తం కార్యక్రమానికి సంబంధించిన ముందస్తూ సమాచారం రైతులకు అందివ్వాలి అన్నారు. తదుపరి రైతు నేస్తం కార్యక్రమానికి రైతు వేదిక లలో రైతులను పూర్తి స్థాయి లో హాజరయ్యే విదంగా తగిన చర్యలు తీసుకోవాలని అడికారులను ఆదేశించారు .
పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభంః
నేటి నుంచి పత్తి కొనుగోలు ప్రారంభం అయినట్టు మంత్రి తుమ్మల తెలియజేశారు. మొత్తం 317 జిన్నింగ్ మిల్లులను సీసీఐ వారు నోటిఫై చేశారని అన్నారు. సీసీఐ వారు తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 21,07,272 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారని, దీంతో వారు అనుకూలమైన సమయం చూసుకొని వారి పంటను అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా మంత్రిగారి విజ్ఙప్తి మేరకు రైతులు తమ ఫోన్ నెంబర్ ను అప్ డేట్ చేసుకునే వెసులుబాటును తెలంగాణ రాష్ట్రం లో సీసీఐ కల్పించింది. దీంతో రైతుల మొబైల్ నెంబర్ అప్ డేట్ చేసేందుకు వ్యవసాయ శాఖ ఏ.ఈ.ఓ యాప్ లాగిన్ లో ప్రత్యేక ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చిందని, తమ పరిధిలోని ఏ.ఈ.ఓ సంప్రదించి మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసుకోవచ్చని, దీని ద్వారా మరసటి రోజు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు అని మంత్రిగారు తెలిపారు.
రైతుల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-5779 ను ఏర్పాటు చేసినట్టు, దీని ద్వారా తమ సందేహాలు లేదా ఫిర్యాదులను నివృత్తి చేసుకోవచ్చని మంత్రిగారు తెలిపారు. 24 గంటలలో వారి ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ హెల్ప్ లైన్ నెంబర్లు ఉ: 07.00 గంటల నుండి రాత్రి 09.00 గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు.
ప్రతి ఉమ్మడి జిల్లాకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఏఈఓ, సెక్రటరీ, సీసీఐ ప్రతినిధి, పోలీస్ అధికారి, రైతు ప్రతినిధితో కూడిన ఒక ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు, ఈ బృందాలు జిల్లా కలెక్టర్లు మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా పర్యవేక్షిస్తాయని మంత్రి గారు అన్నారు.
కొనుగోలు కేంద్రాలలో రైతులు తమ పంటను నిర్దిష్ట తేమ శాతం మరియు FAQ ప్రమాణాలతో తెచ్చే విధంగా రైతులకు సూచించాలి అని అలాగే వర్షాల నేపథ్యంలో రైతులు తాము తెచ్చిన పంటలు తడవకుండా తగు చర్యలు తీసుకోవాలి అని, కావలసిన మోతాదులో టార్పాలిన్స్ అందుబాటులో ఉంచాలని మంత్రి గారు మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.
మొక్కజొన్న కొనుగోలు ప్రారంభంః
మద్ధతు ధర ప్రకటించి మొక్కజొన్న పంటను కేంద్రం కొనకుండా వదిలేసిందని మంత్రిగారు కేంద్ర ప్రభుత్వన్ని విమర్శించారు. కాని రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంటను ఇప్పటికే కొనుగోలు చేస్తుందని మంత్రిగారు పేర్కొన్నారు. రాష్ట్రంలో 6,24,000 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగయినట్టు, ఎకరానికి 18.50 క్వింటాళ్ల చొప్పున మొత్తం 11,55,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంట ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా వేయడం జరిగిందన్నారు.
ఈ మొక్కజొన్న కొనుగోళ్ల కోసం 204 సెంటర్లు ప్రతిపాదించగా, ఇందులో 100 సెంటర్లు ప్రారంభమయినట్టు, ఇందులో 30 సెంటర్ల ద్వారా 220 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేసినట్టు మంత్రిగారు వివరించారు. మిగతా సెంటర్లను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రిగారు అన్నారు.


























