మట్టి ఆరోగ్యం అంటే ఏమిటి ? మట్టి లో ఉండే జీవకణాలు, పోషకాలు, నీరు నిలిపే సామర్థ్యం, రసాయన, భౌతిక లక్షణాలు అన్నింటిని కలిపిన సమతుల్య స్థితిని మట్టి ఆరోగ్యం అంటారు. స్వచ్ఛమైన మట్టి వల్ల పంటలు బాగా పండుతాయి, దిగుబడులు ఎక్కువగా వస్తాయి, ఎరువుల వాడకం తగ్గుతుంది.
మట్టి ఆరోగ్యం ఎందుకు క్షిణిస్తుంది ?
అధికంగా రసాయన ఎరువుల వాడకం.
ఆర్గానిక్ పదార్దాల (పచ్చి ఎరువు, గోమయం) లోపం.
ఒకే రకమైన పంటలు మళ్ళీ మళ్ళీ వేసే విధానం.
నీటి అధిక వాడకం.
మట్టి పరీక్షలు చేయకపోవడం.
మట్టి ఆరోగ్య కార్డు అంటే ఏమిటి?
భారత ప్రభుత్వం 2015 లో సాయిల్ హెల్త్ కార్డ్ “(Soil Health Card Scheme)” అనే పథకాన్ని ప్రారభించింది. ఈ పథకం ప్రకారం ప్రతి రెైతుకు వారి భూమి మిద మట్టి పరీక్షలు చేసి ఒక ఆరోగ్య కార్డు జారీచేస్తారు.
ప్రతి “2” సంవత్సరంలకు ఒకసారి మట్టి పరీక్ష చేయించుకోవాలి. పంట వేసే ముందు మట్టిని 0-15 సెం.మీ లోతు నుండి సేకరించి ప్రభుత్వం నడిపించే మట్టి పరీక్ష కేంద్రాలకుఇవ్వాలి .
ఈ కార్డు ద్వారా మట్టి లో ఉన్న :
✓ భౌతిక పారామీటర్ : PH, EC, అంటూ
✓ రసాయన పారామీటర్ : N (నత్రజని), P (ఫాస్ఫరస్), K (పొటాష్),
✓ సూక్ష్మపోషకాలు : Zn, Fe, Cu, Mn, B
✓ సూక్ష్మ ఆర్గానిక్ కార్బన్ (OC)
SHC ఎలా పనిచేస్తుంది?
నమూనాల సేకరణ – ప్రతి మైదానం 0 -15 సెం.మీ లోతు నుంచి తీసుకోబడుతుంది, వాట్ GPS గరిష్టంగా గుర్తింపు చేస్తుంది.
లాబ్ పరీక్ష – రాష్ట్ర స్థాయి లేదా మొబైల్ Soil Testing Lab లో పరీక్షలు జరుగుతాయి.
కార్డు జారీ – రసాయన పారామీటర్ ఆధారంగా స్థాయి (Low/Medium/High) చూపించి కార్డు లో వర్తింపచేయవలసిన ఎరువులు, పంటలకు సూచనలు ఉంటాయి.
విధాన మార్గదర్శకం – Recommended Dose of Fertilizer (RDF) ప్రకారం కార్డు లో సూచనలు ఉంటాయి.
మట్టి ఆరోగ్య కార్డు ద్వారా రైతులకు లాభాలు ఏమిటి?
ఎన్ని ఎరువులు వేయాలో ఖచ్చితంగా తెలుస్తుంది. అధిక ఎరువుల వాడకం తగ్గుతుంది. ఖర్చులు తగ్గుతాయి పంటలకు సరైన పోషకాలు అందడం వల్ల దిగుబడి పెరుగుతుంది, భూమి యొక్క దీర్ఘకాలిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవ వైవిద్యం, జాతి శ్రేణి పెరుగుతుంది.
మట్టి పరీక్షఎలా చేయంచుకోవాలి?
పంట సాగు చేయకమందు, ఖాళీ భూమి నండి మట్టి నమూనా తీసుకోవాలి, దానిని ప్రభుత్వ మట్టి పరీక్ష కేంద్రం (Soil Testing Laboratory) కి ఇవ్వాలి. అక్కడ పరీక్షా చేసిన తర్వాత Soil Health Card రూపంలో ఫలితాలు వస్తాయి. అందులో ఇచ్చిన సిఫార్సులను అనుసరించి ఎరువుల మోతాదులు వేయాలి.
ఏ పథకాన్ని ఎవురు అమలు చేస్తున్నారు?
ఈ పథకం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్ర వ్యవసాయ శాఖలు, మట్టి పరీక్ష కేంద్రం మరియు కృష్ణా / ల్యాబ్ మైక్రో టెక్నాలజీ సర్వీసులు సహకారంతో అమలు అవుతుంది.
రైతన్నలారా, మట్టి అనేది మనకు దేవుడు ఇచ్చిన వరం. దాన్ని దుర్వినియోగం చేయకుండా జీవన్మయంగా ఉంచాలి. Soil Health Card ఒక ప్రయోజనకరమైన సాధనం, ఇది మట్టిని బాగుపరచడంలో దిగుబడిని పెంచడంలో, భవిష్యత్ తరాలకు మంచి భూమినీ అందించడంలో కీలకంగా ఉంటుంది.
మన భూమిని పరీక్షించండి – మట్టిని ఆరోగ్యంగా ఉంచండి – లాభాలను పెంచుకోండి
డా. బి. జయచంద్రరెడ్డి, డా. ఎం. సురేష్, డా. బి. రాజేశ్వరి, డా. ఎస్. కిరణ్ రెడ్డి, డా. రాకేష్, డా. శ్రీధర్ చౌహాన్, డా. రాథోడ్ సునీల్ కుమార్, ఎల్లుల ప్రవీణ, వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్, ఫోన్ : 99126 55843
Leave Your Comments


























