ఆంధ్రప్రదేశ్తెలంగాణవార్తలువ్యవసాయ పంటలు

రైతన్నకో ప్రశ్న?

0
  1. యాసంగి వరిలో ఏ పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది (ఎ)

(ఎ). కాండం తొలిచే పురుగు, (బి). సుడి దోమ, (సి). కంకి నల్లి, (డి). పైవన్నీ

  1. పెసర మరియు మినుములోబూడిద తెగులు యాజమాన్యం తెలుపగలరు (బి)

(ఎ).హెక్సాకోనజోల్  2 మి. లీ. /లీటర్ నీటికి

(బి). ట్రైఫ్లఆక్సీస్ట్రోబిన్ + టేబుకొనజోల్  0.5 గ్రా. /లీటర్ నీటికి

(సి). ప్రోపికొనజోల్ 1 మి. లీ. /లీటర్ నీటికి, (డి). పైవన్నీ

  1. కందిలో కాయతొలిచే పురుగుల యాజమాన్యం తెలుపగలరు (డి)

(ఎ). ఎకరాకి  4 లింగాకర్షణ బుట్టలను అమర్చుకొని పురుగు ఉధృతి గమనించాలి

(బి). తొలిదశలో ఒకసారి అజాడిరెక్టిన్ 1500 పిపియం 5 మి. లీ. /లీటర్ నీటికి

(సి). క్లోరాన్ట్రానిలిప్రోల్ + లంబడా సైహలొత్రిన్ 0.5 మి. లీ. /లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి

(డి). పైవన్నీ

  1. మామిడిలో ప్రస్తుతం ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి (డి)

ఎ. నీటి తడులు ఇవ్వడం ఆపివేయాలి

బి. చెట్లను  బెట్ట పరిస్థులకు గురి చేయాలి

సి. ఒకసారి 13-0-45 (మల్టీ -కె) 10 గ్రా. /లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

డి. పైవన్నీ

  1. వరి మాగాణుల్లో జీరో టిల్లేజ్ పద్ధతుల్లో వేసుకోదగిన పంట? (డి)

ఎ. జొన్న         బి. ప్రొద్దుతిరుగుడు       సి. మొక్కజొన్న         డి. పైవన్నీ

  1. వేరుశనగకు మిక్కిలి అనువైన నీటి యాజమాన్యం? (సి)

ఎ. చెక్ బేసిన్                              బి. బోదె కాలువ పద్దతి

సి. తుంపర్ల పద్దతి                        డి. బిందు సేద్య పద్దతి

7.వేరుశనగలో విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందు (సి)

ఎ. పిట్లకోర్       బి. క్విజలపాప్      సి. పెండి మిథాలిన్      డి. పైవన్నీ

8.నువ్వుల పంటలో గడ్డి జాతి కలుపును నివారించే కలుపు మందు (ఎ)

ఎ. క్విజలోపాప్      బి. ఇమాజితాపైర్    సి. ప్రోపో క్విజాపాప్     డి. ఓక్స్త్ డెక్సోల్

  1. పొద్దుతిరుగుడు పంటలో గింజ కట్టడానికి వాడే ఎరువు (సి)

ఎ. జింక్ సల్ఫేట్ 2 గ్రా. /లీటర్ నీటికి

బి. మెగ్నీషయం సల్ఫేట్ 10 గ్రా. /లీటర్ నీటికి

సి. బొరాక్స్ 2 గ్రా. /లీటర్ నీటికి

డి. పైవి ఏవి కావు

  1. వేరుశనగలో లేత ఆకులు తెల్లగా మారకుండా ఈ మందు పిచికారీ చేయాలి (ఎ)

ఎ. అన్నభేది 5 గ్రా. /లీటర్ నీటికి

బి. మెగ్నీషయం సల్ఫేట్ 5 గ్రా. /లీటర్ నీటికి

సి. బొరాక్స్ 2 గ్రా. /లీటర్ నీటికి

డి. పైవి ఏవీ కావు

ఎం. రాజశేఖర్, శాస్త్రవేత్త (ఎంటమాలజీ), వ్యవసాయ కళాశాల, జె.ఎస్.సుధా రాణి, శాస్త్రవేత్త (ఆగ్రోనమీ), ఎలక్ట్రానిక్ వింగ్, డా.కె.అరుణ, శాస్త్రవేత్త, డా.ఎ.నిర్మల, శాస్త్రవేత్త, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సంగుపేట్, సంగారెడ్డి,ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్.

Leave Your Comments

విత్తన చట్టం 2025 భారత రైతాంగం శ్రేయస్సుకు బాటలు వేయాలి – మంత్రి తుమ్మల. 

Previous article

తెలంగాణ రబీ సాగుకు యూరియా పై మంత్రి తుమ్మల కీలక నిర్ణయం

Next article

You may also like