రాష్టంలో నాడు-నేడు మున్ముందు కూడా సహజ సిద్దమైన సంపద సృష్టి కేంద్రంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ముంబయి లాగో లేక సింగపూర్, దుబాయ్, ఖతార్ లాగా ఆర్టిఫిషియల్ (AI) సంపద సృష్టించే సంపదకాకపోవచ్చు. ఇచ్చట నిజమైన సంపద కూడు, గుడ్డ పండించే ప్రాంతము.
ముఖ్యంగా దేశం ప్రపంచంలోని అత్యధికంగా పప్పుజాతి పంటలను పండించే దేశంగా, అనగా 24-25 సీజనులో ఎన్నడూ లేనంతగా దాదాపుగా వంద లక్షల హెక్టార్లు (99.40) శనగపంట పండించి రికార్డు నెలకొల్పింది. రాష్ట్రం పరంగా చూసిన ఆంధ్రప్రదేశ్ వరకు 4 లక్షల హెక్టార్లు సాగు చేయుట గమనార్హం. అయినా దేశంలోని కేంద్ర ప్రభుత్వం ఉదారభావము ఎక్కువై దేశంలోని నిల్వల ను పరిగణలోకి తీసుకోకుండా కొరత పేరుతో “0” టాక్స్ తో యితర దేశాలనుండి ఆయా దేశాల రాయితీపై ఎగుమతి చేసే ముఖ్యంగా టాంజానియా, కెనడా. ఆస్ట్రేలియా, సూడాన్, రష్యా లాంటి దేశాల ఉత్పత్తులను మన దేశానికి దిగుమతై మన ఉత్పత్తులు నిరాదరణకు గురవుతూ కేంద్ర ప్రభుత్వ బాధ్యతా రహితమే కాదు, నీచ సంస్కృతికి నిదర్శనం అనకతప్పదు.
ఇక రాష్ట్ర ప్రభుత్వ మున్నా ఆవు చేలో మేస్తే – దూడ గట్టున మేస్తుందా అన్నచందంగా మార్కెట్లు వ్యవస్థను గాలికొదిలేసి సర్వం సంక్షేమం అంటూ వ్యవసాయాన్ని గాలికొదిలేసిన మాట ముమ్మాటికినిజం. ఇందుచే మనం పండించే శనగపంట నేల చూపులు చూస్తూ కనీస గిట్టుబాటు లేక మన రైతులు దివాలా అంచున నిలబడ్డారు అయినా రైతు స్వర్దాన్ని వదిలేయలేదు. వదిలేద్దామన్న ప్రత్యామ్నాయ పంటలు లేవు. వాణిజ్య పంటలైన మిరప పంట పండుతుందో లేదో తెలియదు, పొగాకుకు క్రాప్ హాలిడే, మినుం-కంది మార్కెట్టు వెళ్ళింది. కొంతమేర మొక్కజొన్న పర్వాలేదనుకున్నా కొనేవారు కొరత. ఇక గత్యంతరము లేక శనగ పంట సాగు చేయక తప్పని పరిస్థితి. అయినా శనగ పైరుకు వున్న ప్రత్యేకం తక్కువ రోజులలో ఉన్న తేమతో పంట వచ్చే పైరు శనగ మాత్రమే. ఉన్న ప్రధాన సమస్యల్లా అకాలవర్షాలు, దీర్ఘకాలం శనగ మాత్రమే సాగు చేస్తూ పంట మార్పిడి లేక మార్పిడి లేక ఎండు తెగులు ఆశించుట, ఉపాధి హామీతో విపరీతమైన కూలీల సమస్య. అయినా శనగలో విత్తనం యద నుండి సస్యరక్షణ, కోత మార్పిడి యాంత్రీకరణ తానే చేయగల పైరు శనగకు వుండుట. కానీ ముఖ్యంగా కాబూలీ శనగ యాంత్రీకరణకు అనువుగా ఎత్తురకాలు లేకపోవుటయే ప్రధాన సమస్యగా చెప్పొచ్చు. ఇప్పటివరకు మనం కొన్న కాబూలీ కార్-2, పూలెజి, ఎన్ -119 రకాలు పొట్టురకాలవుట. ఈ సమస్య అధిగమించుటకై నంద్యాల RARS నుండి NBEG -810, NBEG -833 రకాలు పూర్తి యాంత్రీకరణకు అనువుగా కనిపిస్తుంది.
యాంత్రీకరణకు అనుకూలత :
పైన చెప్పుకున్న నంద్యాల N-810, N-833 రకాలు పైరు ఎత్తు 18-24 అంగుళాలు ఎత్తు ఉంది పైరు గట్టిగా చివర వరకు నిలబడే రకం. దిగుబడి సాధారణరకమైన కాక-2, పూలెజి, N-119, డాలర్ రకాలు కన్నా దిగుబడి తగ్గకుండా 9-10 క్వింటాలు దిగుబడినిస్తూ నాణ్యమైన లావు గింజ, 100 గింజలు బరువు 42-46 గ్రాలు వుంటూ, కొంతమేర కూడా నిరోధకము వున్న రకంగా చెప్పొచ్చు. కాలపరిమితి 90-95 రోజులుంటూ పూర్తిగా కోత-నూర్పిడి కి యాంత్రికరణకు అనువైనరకం.
శనగకు అనువైన భూములు :
నీరునిల్వని బాగా తేమను నిల్పుకొనే నల్లరేగడి, బండ్రుభూములు అనుకూలము. అలాగే ఉదజని సూచిక 7.5-8.5 వరకు వుండే క్షార, ఆమ్లము కానీ నేలలు, సేంద్రియ కార్బనం కనీసం 0.5 వున్న భూములు బాగా అనుకూలం
ఎరువులు :
వ్యవసాయ విశ్వలయం వారి సిఫారసు ప్రకారం ఎకరాకు 5 టన్నులు కంపోస్ట్ మరియు 8 కిలోలు నత్రజని, 20 కిలోలు భాస్వరం, 16 కిలోల గంధకం అయినప్పటికీ రైతు సోదరులు కంపోస్టు అందివ్వకపోవుట, ఇప్పుడున్న శనగ రకాలన్నీ అధిక దిగుబడి రకాలైనందున తప్పని సరిగా పచ్చిరొట్టి ఎరువులు అందించుట, వీలైతే బయోఫర్టిలైజర్ తో పాటు రసాయనిక నత్రజనిని రెట్టింపు ఇవ్వాల్సిన అవసరమున్నది.
విత్తనమోతాదు:
పైన తెల్పిన 810, 833 రకాలు లావు గింజలైనందున మొక్కల సాంద్రత ఉండుటకై ఎకరాకు 65-70 కిలోలు ఉండుట లాభదాయకము. సాంద్రత తగ్గినా మొక్కకు సపోర్ట్ తగ్గును.
విత్తనశుద్ధి :
గతంలో మనకు అందుబాటులో వున్న కార్బండెజకు, పాప్, కాప్టాన్ లో ఎదో ఒకదానిని 2.0-2.5 గ్రా.లు కానీ, ఇటీవల అందుబాటుకులోనికి వచ్చిన విటావాక్స్ పవర్ 1.5 గ్రా. లు లేక బయోక్రిమి నాశైసట్రైకోడెర్మా విరిడి కిలోకి 8-10 గ్రా.లు పొడితో శుద్ధి చేయుట మేలైన యాజమాన్యంగా చెప్పొచ్చు. ఈ విత్తనశుద్ధితో పైరులో మొదటి దశలో వచ్చు బూజుతెగుళ్ళు, మొదలుకుళ్ళు తెగుళ్ళు, మొలకలు వచ్చు బూజు (ఫంగసు) అరికట్టవచ్చు.
సస్యరక్షణ :
శనగకు మొదటి దశలో (మొలచిన 15-20 రోజులలో) స్పోడోప్టెరా ఎగ్జిగువా (పచ్చలద్దె పురుగు) నివారణకై వేప సంబంధమైన నీమ్ ఆయిల్ 1500 పిపిఎమ్ – 5 ఎంఎమ్ కానీ, 10,000 పిపిఎమ్ – 2.5 మి. లీ. కానీ, బెంజయట్ (పోర్లెయికు) 100 గ్రా. లు కానీ నోరాట్యారాక్ 200 మి. లీ. కానీ క్లోరోట్రానిపోల్ (కోరజాన్) 60 మాల్ కానీ ఫ్లూబెండిమైడ్ 50-60 మాల్ కానీ వాడి నివారించవచ్చు.
శనగసాగులో మెళకువలు :
వేసవిలో లోతు దుక్కులు చేయుట, తదుపతి మెత్తని పొడిదుక్కులు చేయుట, తప్పని సరిగా పంట మార్పిడి, భూమినాణ్యతను సేంద్రియ కర్బనం పెంచుటకు పచ్చిరొట్ట ఎరువులు పెంచుట, జింక్ ధాతు నీవారణతో పాటు, సూక్ష్మపోషకాలు నిచ్చు సూటి ఎరువైన సింగల్ సూపర్ పాస్పెటు(SSP) వాడుట, పూత పిందె దశలులో NPK నిచ్చు 19:19:19 పాలయర్ స్ప్రేతో పాటు, బెట్ట పరిస్థితులుంటె ఎకరాకు 1-2 కిలోలు పొటాషియం నైట్రేట్ 13.0.45 – 200 లీటర్ల నీటితో కలిపి రెండు సార్లుపై పాటుగా ఇచ్చుట, వీలుంటే పూతకు ముందు పిందె దశలలో తేలికపాటి తడి, తుంపర (స్ప్రింకలర్స్) పద్దతిలో అందించుట, పైరుపై నిఘాయించి తప్పని సరైతేనే పురుగుమందులు వాడాలి. శనగలో కలుపు రసాయనాలు లేనందున ముందస్తు చర్యగా స్టాంప్ ఎక్స్ట్రా స్ప్రే యిచ్చుట, ఇటీవల ఆశిస్తున్న తుప్పు తెగులు లక్షణాలు కనిపిస్తే తప్పని సరిగా కాంటాప్ ప్లస్ 400 మి. లీ. లేక నాటవో 120 గ్రాలు వాడుట శ్రేయస్కరం. అలాగే రసాయన అవశేషాలు లేని ఉత్పత్తులకై వృక్ష సంబంధ క్రిమినాశినులు వాడుట మంచి యాజమాన్యం – క్షేత్రమెరిగి విత్తనం ఎంచుట మేలైనది.
బోడావుల లక్ష్మినారాయణ, తిమిడిపాడు, కారంచేడు, బాపట్ల,ఫోన్: 9291294999


























