వార్తలు

ఈ ఏడాది ముందే పలకరించనున్న నైరుతి పవనాలు..

ఈ సారి నైరుతి రుతుపవనాలు ముందే పలకరిస్తున్నాయి. గత వారమే దక్షిణ అండమాన్ సముద్రంలో పూర్తిగా, దక్షిణ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలా పలు ప్రాంతాల్లో ప్రవేశించిన రుతుపవనాలు.. ఒకరోజు ముందే ...
ఉద్యానశోభ

వానాకాలం సాగుకు తయారువుదాం ఇలా..

వ్యవసాయాన్ని లాభసాటిగా చెయ్యాలంటే సమర్థ వనరుల వినియోగం, సరైన ప్రణాళిక ఎంతైనా అవసరం. ప్రస్తుత సంవత్సరంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఆశిస్తూ అందుకు గాను రైతులు కొన్ని ఆచరణ సాధ్యమయ్యే తేలికపాటి సాంకేతిక అంశాలైన క్రింది పనులను చేపట్టాలని తెలియపరుస్తున్నాము.  వేసవి దుక్కులు :- వేసవి కాలంలో అడపా దడపా  కురిసే వర్షాలను సద్వినియోగ పరుచుకొని మాగాణి, మెట్ట, బీడు భూములను దున్నుకోవడమే వేసవి దుక్కులు.  ఈ దుక్కులు దున్నే ముందుగా పశువుల ఎరువు, కంపోస్ట్ కానీ సమానంగా వెదజల్లి  దున్నడం వల్ల నేల సారవంతమవుతుంది. అంతేకాకుండా భూమిలో వున్న కీటకాలు, శిలీంధ్రాలు చనిపోతాయి.   పంట అవశేషాలు తొలగించడం :-యాసంగిలో వేసిన పంట కోసిన తరువాత ఆ పంట యొక్క అవశేషాలను కాల్చకుండ ఆధునిక పద్ధతులతో విలువ జోడించి మెత్తగా వాడుకోవచ్చును   చెరువులోని పూడిక మట్టి తోలుకోవడం :-చెరువు  మట్టిలో అనేక పోషకాలతో పాటు  నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే కర్బనం కూడా ఉంటుంది. అందువల్ల చెరువు మట్టిని రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.   చెరువు మట్టి ప్రయోజనాలు :-చెరువు మట్టిలో ఒండ్రు, బంక మట్టి రేణువులు అధికంగా ఉంటాయి. ఈ మట్టి తోలిన పొలాల్లో నీటి నిల్వ శక్తి పెరుగుతుంది. చెరువు మట్టిలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం తగినంత ఉండటం వలన ఉదజని  సూచిక 7-7.5 వరకు ఉంటుంది.  చెరువు మట్టి వేసిన పొలాల్లో వేసవి లో ఉష్ణోగ్రతల్లో పెద్దగా హెచ్చుతగ్గులు ఏర్పడవు. దీని వలన పైర్లు బెట్టుకు గురికాకుండా ఉంటాయి.    చెరువు మట్టి వేసిన పొలాల్లో  తేమ నిలిచే కాలం 4-7 రోజులు పెరుగుతుంది.  చెరువు మట్టి ఎర్ర, చెల్క, దుబ్బ నేల నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించి సమపాళ్లలో గాలి, నీరు నిల్వ ఉండేలా చేసి ఉత్పాదకతను పెంచుతుంది.   భూసార పరీక్షలు చేసుకోవడం :-పైర్లకు కావాల్సిన అన్ని పోషకాలు ఎంతో కొంత పరిమాణంలో నేలలో సహజంగానే ఉంటాయి. నేలలో పోషకాలు ఏ స్థాయిలో, ఏ మోతాదులో  తెలుసుకోవడం  భూసార పరీక్ష చేయించాలి. నేల రంగు, స్వభావం  వంటి భౌతిక లక్షణాలే కాక, ఉదజని  సూచిక, లవణ పరిమాణం, సేంద్రియ కర్బనం, లభ్య భాస్వరం, లభ్య పొటాషియం నిర్దారించి సలహాలు, సూచనలు “సాయిల్ హెల్త్ కార్డ్” రూపంలో రైతులకు అందజేస్తారు.  ప్రతి రైతు  తప్పని సరిగా భూసార పరీక్ష చేయించడం మంచిది. ఏప్రిల్ – మే నెలలు మట్టి నమూనా తీయడానికి  అనువైన సమయం.  భూసార పరీక్ష లాభాలు :-  నేలలో ప్రధాన పోషకాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోవచ్చు.  నేల సారం పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి తెలుస్తాయి.   ...
వార్తలు

రానున్న మూడు రోజుల్లో వర్షాలు..

తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు విలవిలలాడుతున్నారు. రాష్ట్రంలో నిప్పుల కుంపటిగా మారింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ వాతావరణ శాఖ ...
వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో వర్షసూచన..

వాయుగుండం బంగాళాఖాతంలో అండమాన్ దీవులకి సమీపంలో బలహీనపడి అల్పపీడనంగా మారింది. అల్పపీడనం కారణంగా రానున్న 2 రోజుల పాటు తీవ్రమైన వేడిగాలులు ఉంటాయని రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వర్షాలు కురుస్తాయని ...
వార్తలు

నిప్పులు కురుస్తున్నఎండలు మన మంచికే అంటా..

ఎండలు మంచికే అంటున్నారు వాతావరణ నిపుణులు. నిప్పులు కురిసే ఎండలు, వడగాలుల వలన మంచి ఏంటా.. అని ఆలోచన రావడం సహజమే. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉంటూ వడగాల్పులు వీచిన ...
వార్తలు

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు, రేపు వానలు..

ఆంధ్రప్రదేశ్ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శుక్రవారం దక్షిణ కోస్తాలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ...