రైతులువార్తలు

Natural Farmer Prathap Reddy Success story: లక్ష రూపాయల పెట్టుబడితో 40 లక్షల ఆదాయం..! ప్రకృతి వ్యవసాయ రైతు రవి ప్రతాప్ రెడ్ది విజయ గాథ

0
Natural Farmer Prathap Reddy Success story
Prathap Reddy

Natural Farmer Prathap Reddy Success story: లక్ష రూపాయల పెట్టుబడితో 40 లక్షల ఆదాయం..! ప్రకృతి వ్యవసాయ రైతు రవి ప్రతాప్ రెడ్ది విజయ గాథ…

రైతు వివరాలు

జిల్లా పేరు : శ్రీ సత్య సాయి జిల్లా
మండలం పేరు : శ్రీ సత్య సాయి
గ్రామం పేరు : కొత్తలం
రైతు పేరు : వై . ఆర్. రవి ప్రతాప్ రెడ్ది
వయసు : 50 సం.
ఫోన్ నంబర్ : 9398980129
మొత్తం విస్తీర్ణం : 50 ఎకరాలు
APCNF విస్తీర్ణం : 50 ఎకరాలు
ప్రధాన పంట : దానిమ్మ
అనుబంధ పంటలు : మామిడి, అల్లనేరేడు, వక్క
ప్రకృతి వ్యవసాయ అనుభవం : 5 సం.

Natural Farmer Prathap Reddy Success story

Prathap Reddy

పరిచయం

అందరికీ నమస్కారం. నా పేరు రవి ప్రతాప్‌రెడ్డి. నేను ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా కొత్తలం గ్రామానికి చెందిన వాడిని. వృత్తిరీత్యా నేను రైతుని. ప్రధానంగా నా భూమిలో దానిమ్మ పంటను పండిస్తున్నాను . నా వయసు 50 ఏళ్లు. నేనొక గ్రాడ్యుయేట్ ను. నాకు ఇద్దరు పిల్లలు. నేను ఒక ఔత్సాహిక రైతును.
సంప్రదాయ వ్యవసాయంలో ఎదుర్కొంటున్న సమస్యలు

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు కరువు ప్రాంతాలు కావడంతో సాగు విస్తీర్ణం పూర్తిగా వర్షాలపైనే ఆధారపడి ఉంది. రసాయనిక రైతుగా రవిప్రతాప్ రెడ్డి వ్యవసాయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. రసాయనిక వ్యవసాయంలో సాగు ఖర్చు ఎక్కువగా ఉండేది. ఉత్పత్తి వ్యయం 30% ఉండేది. అయితే ప్రకృతి వ్యవసాయంలో కేవలం 2% మాత్రమే ఖర్చు చేస్తున్నాను. అంతేకాకుండా పంట మొక్కలపై చల్లే రసాయన మందులు వర్షం పడినట్లయితే వర్షపు నీటితో కొట్టుకుపోతుండడంతో వెచ్చించిన మొత్తం పూర్తిగా నష్టపోతుంది. రసాయనిక వ్యవసాయం అటు కూలీలకు, ఇటు వినియోగదారులకు హానికరం. పిచికారీ చేసే సమయంలో నిరంతరం రసాయనాలకు గురికావడం వల్ల అలర్జీ, ఊపిరితిత్తుల సమస్యలు, తలతిరగడం వంటి వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తాయి . పిచికారీని కొనసాగించడం కార్మికులకు కష్టంగా మారింది. నేను స్వయంగా అలెర్జీ బాధితుడను. అందువల్ల రైతుగా ఈ హానికరమైన రసాయన వ్యవసాయ ఉత్పత్తులను వాడే వినియోగదారుల గురించి ఆందోళన చెందాను.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రసాయన వ్యవసాయంలో చాలాసార్లు తెగుళ్లు సులభంగా నియంత్రించబడవు. బయటి నుంచి అందంగా కనిపించే దానిమ్మ పండ్లు రసాయనిక వ్యవసాయం వల్ల లోపల విత్తనాలు దెబ్బతిన్నాయి. అదనంగా రసాయన వ్యవసాయంలో దిగుబడి ఎల్లప్పుడూ అనిశ్చితంగా ఉంటుంది. కొన్నిసార్లు పంట వచ్చింది. మరి కొన్నిసార్లు దిగుబడి లేదు. ఉన్నా చాలా తక్కువ. రసాయనిక వ్యవసాయంలో భూసారం క్షీణించడం ప్రధాన సమస్యగా ఉంది. రసాయనిక ఎరువులను నిరంతరం ఉపయోగించడం వల్ల వర్షాకాలంలో నేల గట్టిపడి, తేమ తక్కువగా ఉండి మొక్క ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. “సంక్లిష్ట రసాయన ఎరువులను ఉపయోగించడం వల్ల నేల ఆల్కలీన్ అయింది మరియు మొక్కలు పాలిపోయాయి.”
రైతు ప్రవేశపెట్టిన జోక్యాలు.

నేను రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయంలో సూచించిన పంట వైవిధ్యం, స్థానిక విత్తనాల వాడకం, తేనెటీగల పెంపకం తదితర మొదలైన అన్ని పద్ధతులను అవలంబించాను. ఈ అభ్యాసం ప్రారంభమైనప్పటి నుండి నేను ఘనజీవామృతం, జీవామృతం వంటి జీవ ఉద్దీపనలను, బొటానికల్ ఎక్స్ట్రాక్ట్, నీమాస్త్రం వంటి కాషాయాలను ఉపయోగిస్తున్నాను. మాకు 5 స్వదేశీ ఆవులు ఉన్నాయి, వాటి ద్వారా నేను స్వయంగా జీవ ఉద్దీపనలను తయారుచేయగలను.
ఘన, ద్రవ జీవామృతం, కషాయాల తయారీలో ఏపీసీఎన్ఎఫ్ క్యాడర్ పంపిణీ చేస్తున్న సామగ్రిని రవి ప్రతాప్ రెడ్డి నిశితంగా గమనిస్తూ అవసరమైన అన్ని ప్రక్రియలు చేస్తారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే బయటి నుంచి (ఎన్ పీఎం షాపుల ద్వారా) కొనుగోలు చేస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని పూర్తిగా తిరస్కరించి ఆవు పేడ, గోమూత్రం సేకరించి పప్పు పిండి, బెల్లం కలిపి ద్రవజీవామృతం తయారు చేస్తారు . పిచికారీ చేయడానికి యంత్రాలను ఉపయోగిస్తారు , ఎందుకంటే అంత పెద్ద పరిమాణంలో పిచికారీ చేయడానికి యంత్రాలను ఉపయోగించడం తప్పనిసరి. ట్రాక్టర్ కు అమర్చిన 1000 లీటర్ల సామర్థ్యం గల డ్రమ్ములతో 2-3 గంటల్లో పిచికారీ చేయవచ్చు. యంత్రాలను ఉపయోగించి రోజుకు 2-3 డ్రమ్ములను సులభంగా పిచికారీ చేయవచ్చు.
ప్రకృతి వ్యవసాయ ఫలితాలు

Natural Farmer Prathap Reddy Success story

Farmer Prathap Reddy

ప్రకృతి వ్యవసాయంలో వినియోగించే జీవ ఉత్ప్రేరకాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. రసాయనిక సేద్యానికి భిన్నంగా ప్రకృతి వ్యవసాయంలో సులువైన పద్ధతిలో నామమాత్రపు ఖర్చుతో చీడపీడలను నియంత్రించవచ్చు. ప్రకృతి సేద్యంలో దానిమ్మ ఫలం లోని ప్రతి విత్తనం మంచి స్థితిలో ఉండి అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాల నుంచి ఆర్డర్లు అందుతున్నాయి. వినియోగదారులు ఈ పండు రుచిని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్)లో గత ఏడాది సాగు చేసిన పలు పంటల ప్రభావం ఈ ఏడాది పంట ఎదుగుదలలో ప్రతిబింబించింది. 30 రకాల విత్తనాలు నాటాను. అవి అద్భుతంలా తక్కువ తేమ ఉన్న మట్టిలో మొలకెత్తాయి. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు పండ్లతోట మినీ అడవిని తలపించింది. ట్రాక్టర్ మల్చ్ యంత్రాన్ని ఉపయోగించి ఆ పంటలను మట్టిలో కలిపాను.

ఈ ప్రక్రియ కారణంగా, నేలలో కర్బన శాతం గణనీయంగా పెరిగింది. మొక్కలు సహజంగా చాలా ఆరోగ్యంగా మారాయి. నేల నాణ్యత కూడా పంటలో ప్రతిఫలిస్తోంది. ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా నేలలో తేమ పెరుగుతుంది. భారీ వర్షాలు కురిసినా నేల మొత్తం నీటిని పీల్చుకోవడంతో పంటలు దెబ్బతినవు. అదేవిధంగా నేలలో తేమ నిలుపుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తక్కువ వర్షంలో లేదా వర్షపాతం లేని సంధర్భంలోనూ పంటలతో నేలను కప్పి ఉంచడం వలన బాష్పీభవన నష్టాలు తగ్గి నేలలో తేమ ఎక్కువ కాలం ఉంటుంది . చీడపీడల నియంత్రణ ఫలితాలకు సంబంధించి దానిమ్మ ప్రధానంగా బాక్టీరియల్ బ్లైట్ వ్యాధితో ప్రభావితమవుతుంది. బాక్టీరియల్ బ్లైట్ వ్యాధి మేఘావృతమైన మరియు అడపాదడపా వర్షాకాలంలో వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకితే పండ్లతోటలను నాశనం చేస్తుంది. ప్రకృతి వ్యవసాయ విధానం రెండు విధాలుగా వ్యాధిని అదుపులో ఉంచుతుంది. ఘనజీవామృతం వాడటం వల్ల మొక్కలు బలహీనపడవు. ఆరోగ్యకరమైన మొక్క వ్యాధిని తట్టుకోగలదు. గత ఏడాది భారీ వర్షాభావ పరిస్థితుల్లోనూ దానిమ్మ దిగుబడులను విజయవంతంగా పండించాను. దానిమ్మ రైతులు సాధారణంగా మొదటి పంట కోసం రెండేళ్లు ఎదురుచూస్తుండగా నాకు రెండో ఏడాదిలోనే రెండో పంట ఆదాయం వచ్చింది. కొనుగోలుదారులు వచ్చి చూస్తే మొక్కలు 5 ఏళ్ల పిల్లలను తలపిస్తున్నాయని చెబుతున్నారు. శక్తివంతమైన రసాయన పురుగుమందులు పిచికారీ చేసినా దిగుబడులకు గ్యారంటీ లేని దానిమ్మ వంటి పంట ప్రకృతి సేద్యం ద్వారా మంచి దిగుబడులు ఇస్తోందంటే నమ్మడం కష్టం. ప్రకృతి వ్యవసాయం యొక్క ముఖ్యమైన ఫలితాలలో ఒకటి ఆదాయం పెరగడం. 2023 అక్టోబర్ నెలలో కేవలం 2 లక్షల రూపాయల పెట్టుబడితో 6 ఎకరాల విస్తీర్ణంలో దానిమ్మ పంట ద్వారా 30 లక్షల రూపాయల నికర ఆదాయం పొందగలిగాను. అదే విస్తీర్ణంలో రసాయన వ్యవసాయం చేసి ఉంటే 10 నుంచి 12 లక్షల రూపాయల దాకా ఖర్చు చేయాల్సి వచ్చేది. ఫలితంగా నికర ఆదాయం 20 లక్షల వరకు తగ్గిపోయేది. ఒక్క మాటలో చెప్పాలంటే” ప్రకృతి వ్యవసాయంలో ఇదొక ప్లస్ పాయింట్ . రసాయనాలు వాడకుండా పొదుపు చేసిన డబ్బు కూడా నాకు ఆదాయమే.
ముగింపు.

ప్రకృతి సేద్యం చేయాలంటే రైతుకు ఓపిక అవసరం. ఈ ఇన్పుట్ లు మార్కెట్ లో అందుబాటులో లేనందున స్వయంగా తయారు చేసుకోవలసి ఉంటుంది. ఏదేమైనా, ప్రకృతి వ్యవసాయంలో ఫలితాలు అసాధారణమైనవి. ఇందుకు నా దానిమ్మ పంటను ఉదాహరణగా చెప్పవచ్చు. నా పొలంలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన దానిమ్మ పరిమాణం, నాణ్యత, రుచి మరియు తియ్యదనం అధికంగా ఉన్న కారణంగా ఒక వ్యక్తి ఒక పూర్తి దానిమ్మను తినలేడు. లోపల ఎటువంటి నష్టం లేదు కాబట్టి ప్రతి విత్తనం తినదగినదే . “భూమి సాగుకు నోచుకోకపోతే మా మనసులు అంగీకరించవు. వ్యవసాయం మన రక్తంలో ఉంది. అది అలాగే కొనసాగుతుంది. ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిన తర్వాత ఎలాంటి ఎదురుదెబ్బలు తగలలేదు. అంతా సాఫీగా సాగుతోంది. తక్కువ ఖర్చులు, ఎక్కువ ఆదాయం. మేము కూడా హ్యాపీగా ఫీలవుతాం. ఒక రైతుకు తన పంట నిండా దిగుబడులను చూడటం కంటే మించిన ఆనందం ఏముంటుంది. పెద్ద రైతులందరూ ప్రకృతి సేద్యం వైపు మళ్లడం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. రైతులందరూ ఒకరికొకరు స్ఫూర్తిగా ఉంటూ ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడానికి ముందుకు వస్తే బాగుంటుంది. తద్వారా మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్) వంటి కార్యక్రమాలు రైతులను ఇన్ పుట్ ఇంటెన్సివ్ కెమికల్ అగ్రికల్చర్ నుంచి నేచురల్ ఫార్మింగ్ వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆహారాన్ని పండించడం అంటే ఆరోగ్యకరమైన సమాజానికి దోహదం చేయడం. ప్రకృతి వ్యవసాయ ఆధారిత ఆహార వ్యవస్థలు రైతులకు, వినియోగదారులకు మరియు పర్యావరణానికి ప్రయోజనకరంగా ఉంటాయి.

Leave Your Comments

Ananthapuram Lady Farmer Success story: ఒంటరి మహిళ – అత్యున్నత గౌరవ వందనం

Previous article

Mentor Mahesh Kumar: ప్రకృతి వ్యవసాయంలో పలు నమూనాలు..

Next article

You may also like