Green Manure Cultivation: ప్రస్తుతం మన రైతాంగం అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువులను మోతాదుకు మించి వాడితే సేంద్రియ ఎరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివల్ల పంట దిగుబడులు పెరగకపోగా భూమిలో పోషకాల సమతుల్యత దెబ్బతిని పంట భూములను నిస్సారంగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించి సుస్థిరమైన దిగుబడులు పొందాలంటే భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వాడుతూ సేంద్రియ ఎరువులను పోషకాలు యాజమాన్యంలో ఓ భాగంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్యకాలంలో సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, వర్మి కంపోస్టు, లభ్యత నానాటి తగ్గిపోతున్న తరుణంలో రైతులు పచ్చిరొట్ట పైర్ల సాగుతో పంటల సరళి లో భాగంగా చేసుకోవాలి.
పచ్చి రొట్ట పైర్లుతో రైతులకు చాలా లాభాలున్నాయి. భూమి భౌతిక రసాయన జీవ లక్షణాలు వృద్ధి చెందుతాయి. తక్కువ ఖర్చుతో నేలకు సేంద్రియ పదార్థాన్ని ఎక్కువ మోతాదులో అందించే వీలు కలుగుతుంది. నేలకు నీటిని పోషకాలకు నిలుపు చేసుకునే శక్తి పెరుగుతుంది. నేల గుల్ల భారీ. గాలి ప్రసరణ పెరగటంతో పాటు మురుగునీటి వ్యవస్థ మెరుగు పడుతుంది. సేంద్రియ పదార్థం నేలకు అందడం వలన నెలలో సూక్ష్మజీవులు వృద్ది చెంది అనేక జీవ రసాయనాలు చర్యలు జరిగి లభ్యం కాని స్థితిలో ఉన్న పోషకాలు మొక్కలకు అందుబాటులోకి వస్తాయి. పంటలకు సిఫార్సు చేసిన నత్రజనిని 25% వరకు తగ్గించి వాడుకోవచ్చు. పప్పు జాతి పంటలను ఎంపిక చేసుకుంటే వేరు బుడుపుల ద్వారా గాలిలో నత్రజని స్వీకరిస్తాయి.
Also Read: Grow bag Cultivation: సాగులో సరికొత్త విప్లవం బ్యాగ్ సేద్యం.!

Green Manure Cultivation
పచ్చి రొట్టె పైర్లు వాటి లక్షణాలు
జీలుగ: చౌడు భూములు వరి పండించే భూములు అనుకూలం తేలికపాటి ఇసుక నెలలో సాగు చేయవచ్చు. వేరు బుడిపెలు ఎక్కువగా ఉండి నత్రజని స్థిరంగా ఉండేలా చేస్తుంది. ఎకరాకు 12-15 కిలోలు విత్తనం అవసరం. దీనిని పూత దశలో కలియ దున్నడం వల్ల ఎకరానికి 8 నుండి 10 టన్నుల పచ్చి రొట్టె లభిస్తుంది.
జనుము: అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. పచ్చిరొట్టతో పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది. ఎకరాకు 12 15 కిలోల విత్తనం చల్లుకోవాలి. ఎకరాకు సుమారు నాలుగు ఆరు టన్నుల పచ్చి రొట్ట లభిస్తుంది.
పిల్లిపెసర : అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. చౌడు భూముల్లో సాగు అనుకూలం కాదు. పశుగ్రాసంగా ఉపయోగపడుతోంది. ఎకరానికి 6-8 కిలోల విత్తనం చల్లుకోవాలి. ఎకరానికి సుమారు నాలుగు ఆరు టన్నుల పచ్చిరొట్ట నిస్తుంది. ఒక టన్ను పచ్చి రొట్టెలో సుమారు ఏడు కిలోల నత్రజని ఒక కిలో భాస్కరం 5 6 కిలోల పొటాష్ ఉంటాయి
పెసర: తొలకరి వర్షాలకు విత్తనం చల్లుకొని కాయలు కోసిన తర్వాత మిగిలిన రొట్టెను భూములో కలయ దున్నుకోవచ్చు. అవకాశం లేనప్పుడు పచ్చిరొట్టగా ఉపయోగించుకోవచ్చు. పశుగ్రాసం కూడా ఉపయోగపడుతుంది.
అలసంద : పచ్చి రొట్ట ఎరువుగా, పశువుల మేతగా వాడవచ్చు. ఎకరానికి 10-12 కిలోల విత్తనం అవసరం. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది.
పచ్చి రొట్టె నెలలో దున్నేటప్పుడు తీసుకోవలసిన మెళకువలు తీసుకోవాలి. పచ్చిరొట్ట పైరు కాలం 60- 70 రోజులు ఉంటుంది. కాబట్టి రైతులు తమకు అందుబాటులో ఉన్న వనరులను బట్టి పంట సరళిని బట్టి ప్రధాన పంట వేయడానికి కనీసం 60 రోజుల వ్యవధి ఉన్నప్పుడు పచ్చిరొట్ట పైర్లను సాగు చేసుకోవాలి. 60 రోజులు వ్యవధి ఉన్నప్పుడు కనీసం 45- 50 రోజులకు పూత దశలో పచ్చిరొట్ట పైన కలియదున్ని 10-15 వ్యవధి రోజులపాటు కుళ్ళనిస్తే సేంద్రియ పదార్థం గా మారి పోషకాలు తరువాత పంటకు అందుబాటులోకి వస్తాయి. ఎరువులను పూత దశలో సరైన సమయంలో కలియ దున్నేటప్పుడు త్వరగా కుళ్ళి భూసారం పెరుగుతుంది. తద్వారా తర్వాత వేసే పంటలకు రసాయన వాడకని 25% వరకు తగ్గించుకోవడంతో పాటు సుస్థిరమైన దిగుబడులను పొందవచ్చు.
Also Read: Grapes Orchard: ద్రాక్ష పండ్ల తోటని ఇలా మొదలు పెట్టి, సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది.!


























