మన వ్యవసాయం

యాసంగిలో ఆవాల సాగు మెలకువలు

0
Mustard Cultivation
Mustard Cultivation
mustard crop

mustard crop ( ఆవాల సాగు )

భారతదేశంలో సాగు చేస్తున్న నూనెగింజల పంటలలో అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్న పంట ఆవాలు. ఈ పంటను ప్రధానంగా ఉత్తర భారతదేశంలో రాజస్థాన్,ఉత్తరప్రదేశ్,హర్యానా మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నది. 37 – 42 శాతం నూనె ఉంటుంది. గత 2 – 3 సంవత్సరాలు తరబడి ఆవాలు పంట వేయడానికి ఉత్తర తెలంగాణలో రైతులు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ నీటి వనరులు, సులభ యాజమాన్యము మరియు స్థిర మార్కెట్ ధరవలన రబీలో ఈ పంట లాభదాయకమైనదిగా చెప్పవచ్చు లాభదాయకమైనదిగా చెప్పవచ్చు.

విత్తే సమయము :

అక్టోబరు మొదటి పక్షం నుంచి నవంబరు మొదటి పక్షం వరకు ఈ పంటను విత్తుకోవచ్చు.

mustard seeds

mustard seeds

నేలలు : ఆవాలు పంటను ఒక మోస్తరు బరువైన నేలల్లో సాగు చేసి మంచి దిగుబడులను సాధించవచ్చు. అయితే ఈ పంటను తేలికపాటి నేలలు,నల్లరేగడి నేలలు మరియు ఒండ్రు నేలల్లో కూడా పండించవచ్చు.

 విత్తన మోతాదు : 2 – 2.5 కిలోలు ఎకరానికి.

విత్తే దూరం: వరుసకి వరుసకి మధ్య 45 సెం.మీ , 15 – 20 సెం.మీ మొక్కకి  మొక్కకి  మధ్య ఉండే నాటుకోవాలి.

విత్తనశుద్ధి : కిలో విత్తనానికి 3 గ్రా. కాప్టాన్ తో విత్తనశుద్ధి చేయాలి.

విత్తన మోతాదు : ఎకరానికి 5 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనాన్ని ఇసుకతో కలిపి విత్తుకోవాలి.

రకాలు : ఎన్ ఆర్ సి హెచ్ బి.101 , ఎన్ ఆర్ సి డి ఆర్ 2,  ఆర్ హెచ్ 406, డి ఆర్ యంఆర్ జె 31 ,పీఎం 27, పియం 28, వరుణ, పూసాఅగ్రాని , పూస మహాకీ, నరేంద్ర అగేతి అనే రకాలు మరియు బ్లాక్ గోల్డ్, పయనీర్ సీడ్స్ వంటి ప్రైవేట్ రకాలకు వేసుకోవచ్చు.

ఎరువుల యాజమాన్యం : ఎకరాకు 2 – 3  టన్నులు బాగా పశువుల ఎరువును విత్తేముందు వేసుకోవాలి. 24 కిలోల నత్రజని , 16 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాషియం నిచ్చే ఎరువులను ఎకరానికి  వేయాలి. రెండవ దఫా నత్రజని ఎరువును పైరు పూతకు వచ్చె ముందు (55 నుంచి 60 రోజుల మధ్యలో వేయాలి)

Also Read : కాలీఫ్లవర్ సాగులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు

కలుపు యాజమాన్యం : మొలకెత్తిన మూడు వారాలలోపు కుదురుకు ఒక మొక్క ఉండేలా మొక్కలను పలుచన వేయాలి. పైరు  30 మరియు 60 దశలో వరుసల మధ్య అంతర సేద్యం చేయాలి.

నీటి యాజమాన్యం : ఆవాల పంటకు సుమారు 300 – 400 మిల్లీ మీటర్ల నీరు అవసరమవుతుంది. మొత్తంగా 3 – 4 తడులు ఇచ్చి మంచి దిగుబడులు సాధించవచ్చు. కొమ్మలు ఏర్పడే దశలు 30 నుంచి 40 రోజులు మరియు పూతకాయ ఏర్పడే దశలు 60 నుంచి 80 రోజుల కీలకమైనవి.

అంతర పంటలు, పంటల సరళి : ఖరీఫ్ మొక్కజొన్న, సోయాబీన్, పత్తి తర్వాత ఆవాల పంటను సాగు చేయవచ్చును. శనగ : ఆవాలు: 5 :1 లేదా 3:1 నిష్పత్తిలో అంతర పంటల సాగు లాభదాయకము.

సస్యరక్షణ :

 సాప్లై : ఈ పురుగు ఆకులపై చిన్న రంధ్రాలు చేసి తింటూ కేవలం ఈ నేలను మాత్రమే మిగిలిస్తుంది. ఈ పురుగు నివారణ ఎసిఫేట్ 1.5 గ్రామ్స్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

 తెల్లత్రుప్పు తెగులు : ఆకులపై తెల్లటి బుడిపెల్లాంటి పదార్థం ఏర్పడుతుంది. ఈ తెగులు నివారణకు మెటాలాక్సిల్ అనే శిలీంద్ర నాశినిని 6 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి. మెటాలాక్సిల్ 2 గ్రాములు లేదా ప్రోపికోనజల్ ఒక మిల్లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

పంటకోత : పంట పక్వానికి వచ్చినప్పుడు కాయలు పసుపు రంగుకు మారుతాయి. మొక్కలను కోసి ఎండిన తర్వాత కర్రలతో కొట్టి విత్తనాన్ని వేరు చేయాలి. విత్తనాలలో తేమశాతం 8 – 9 శాతం వరకు వచ్చేలా ఎండబెట్టాలి.

దిగుబడి : ఎకరాకు 5 – 6 క్వింటాళ్ళు సాధించవచ్చు.

డి. స్రవంతి, డాక్టర్ పి.శ్రీలత డాక్టర్ పి. లక్ష్మణ్ రావు, డా .పావని, డాక్టర్ కే గోపాలకృష్ణ మూర్తి మరియు డాక్టర్ యం. మాధవి వ్యవసాయ కళాశాల, అశ్వరావుపేట

 

Also Read : యాసంగి శనగ పంటలో మెళకువలు

Leave Your Comments

ధాన్యం కొనుగోలుపై దద్దరిల్లిన లోకసభ..

Previous article

 పురుగు మందుల కొనుగోలు, నిల్వ మరియు విష తీవ్రత

Next article

You may also like