వేసవి వచ్చిందంటే చాలు త్రాగునీరు మరియు సాగునీరుకు చాలా ఇబ్బంది వస్తుంది. మనం వారలో చూసాం బెంగళూరు లాంటి పట్టణంలో నీటి కొరత ఏర్పడదని మరియు గతంలో రైల్వే ట్యాంకర్ల ద్వారా మహారాష్ట్రలోని లాతూర్ పట్టణానికి నీటిని తరలించడం జరిగినది. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టడం, నీటి వృధా అరికట్టడం మరియు సమర్థవంతమైన నీటి పంపిణీ ద్వారానే సకల ప్రాణకోటి మనగడ సాధ్యమవుతుంది. జలం ఉన్నచోటే మానవుని నాగరికత ప్రారంభమైనది. ఒకప్పుడు పుష్కలంగా దొరికే నీటిని అభివృద్ధి పేరిట కలుషితం చేస్తున్నాము, అవసరానికి మించి వాడుతూ వృధా చేస్తున్నాం, మరోవైపు అకాల వర్షాలు, వరదలు, వాతావరణ మార్పులు, వర్షపాతం లో మార్పులు, వేసవి రాకముందే భూగర్భ జలాల నీటిమట్టం తగ్గిపోవడం, పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, తరుగుతున్న వ్యవసాయ భూమి, జనాభా వృద్ధిరేటుకు అనువుగా లేని వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల, ఆర్థిక మందగమనం మొదలైనవి భవిష్యత్తు నీటి అవసరాల పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. హిమాని నదులు ప్రాణకోటికి జీవనాధారం, అవి కరగడం ద్వారా మనకు కావలసిన త్రాగునీరు, సాగునీరు, పారిశ్రామిక రంగాల నీటి అవసరానికి, విద్యుత్ ఉత్పత్తికి, ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలను పెంపొందించడానికి వెలకట్టలేని అత్యంత ఆవశ్యకమైన నీటిని మనకు అందిస్తున్నాయి. వాతావరణ మార్పులు, మానవ చర్యల వల్ల వేగంగా కరుగుతున్న హిమాని నదుల వలన భవిష్యత్తులో నీటి కొరత ఉండే అవకాశం లేకపోలేదు. తద్వారా ఈ భూమండలపైన నివసిస్తున్న జీవకోటి కి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 200 కోట్ల మంది ప్రజలు హిమాని నదుల మంచు పర్వతాలు కరగడం ద్వారా లభ్యమయ్యే నీటి ద్వారా త్రాగునీరు, సాగునీరు, మరియు విద్యుత్ శక్తి కోసం హిమాని నదుల పైన ఆధారపడి ఉన్నారు. జలమే జీవం కాబట్టి ఎంతో అమూల్యమైనటువంటి నీటిని ఓడిసిపట్టి, సమస్త జీవకోటికి తగినంత నీరు అందేలా చేయడంతో పాటు ప్రపంచ ఆహార భద్రత మరియు ప్రపంచ శాంతికి ప్రపంచ దేశాలు కృషి చేయాలి, దీనికి కావలసిన విధానపరమైన నిర్ణయాలను ఆయా ప్రభుత్వాలతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రైతులు, యువతి యువకులు తక్షణమే నీటి యాజమాన్య పద్ధతులను అవలంబిస్తూ, మానవ చర్యలు హిమాని నదుల ప్రాంతాలలో తగ్గిస్తూ “హిమాని నదుల సంరక్షణ “చేపట్టడం చేయాలనే ఉద్దేశంతో ప్రపంచ నీళ్ల దినోత్సవం – 2025 మనము జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి కాంక్షిస్తుంది. ప్రపంచ నీటి దినోత్సవం, 1993 నుండి ప్రతి సంవత్సరం మార్చి 22న ఘనంగా వివిధ రకాల ఉద్దేశాలతో నిర్వహించు కుంటున్నాం. దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్య పరుస్తూ గ్రామంలోని రైతు క్షేత్రం నుండి వివిధ ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాలు మరియు దేశాల మధ్య ఉన్న నీటి పంపకం గొడవలు, జల యుద్ధాలను తగ్గిస్తూ ప్రపంచ శాంతి పాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రైతులు, యువతి యువకులు తక్షణమే నీటి యాజమాన్య పద్ధతులను అవలంబిస్తూ, మానవ చర్యలు హిమాని నదుల ప్రాంతాలలో తగ్గిస్తూ “హిమాని నదుల సంరక్షణ “చేపట్టడం చేయాలనే
ఉద్దేశంతో ప్రపంచ నీళ్ల దినోత్సవం- 2025 మనము జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి కాంక్షిస్తుంది. ప్రపంచ నీటి దినోత్సవం, 1993 నుండి ప్రతి సంవత్సరం మార్చి 22న ఘనంగా వివిధ రకాల ఉద్దేశాలతో నిర్వహించుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్య పరుస్తూ గ్రామంలోని రైతు క్షేత్రం నుండి వివిధ ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాలు మరియు దేశాల మధ్య ఉన్న నీటి పంపకం గొడవలు, జల యుద్ధాలను తగ్గిస్తూ ప్రపంచ శాంతి నీళ్లను ఒడిసి పట్టడం ద్వారానే జరుగుతుంది అనే నినాదంతో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు మంచినీటి ప్రాముఖ్యత మరియు వివిధ రకాల నీటి యజమాన్య పద్ధతుల పైన చర్చలు, సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్య పరచాలని సభ్య దేశాలను కోరుకుంటుంది.
నీరు ఒక సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదించిన ఆస్తి, భూమి మీద నివసిస్తున్న సమస్త ప్రాణి శరీరంలో 50 శాతానికి పైగా నీరు ఉంటుంది. మానవ శరీరంలో సుమారు 70 శాతం వరకు నీరు ఉంటుంది. సమస్త ప్రాణకోటికి తాగు నీటితో పాటు మన రోజు వారి కార్యక్రమాలకు, వ్యవసాయం, పరిశ్రమలు, వంట చేయడానికి, ఇతర కార్యక్రమాలకు నీరు చాలా అవసరం. ఈ భూ మండలాన్ని సుమారు 71 శాతం నీటితో ఆక్రమితమైనప్పటికీ పనికొచ్చే మంచినీరు కేవలం 2.5% మాత్రమే. ఈ 2.5% మంచినీటిలో దాదాపు 75.2 శాతం ధ్రువ ప్రాంతాలలో మంచు గా స్తంభింపజేసి ఉంది మరియు మరో 22.6 శాతం భూగర్భప్రపంచవ్యాప్తంగా దీని ద్వారానే జలాలుగా ఉన్నాయి. తాగునీరు, సాగునీరు, వివిధ పరిశ్రమల నడపడానికి, జల విద్యుత్ తయారు చేయడానికి, రోజువారి కార్యక్రమాలు పూర్తి చేయడానికి వాడుతున్నాము. నీరు ప్రజలకు, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలకు మరియు ప్రకృతికి ఒక చోదక శక్తి లాంటిది మరియు ఆహార గొలుసుకు పునాది. ప్రపంచంలో దొరుకుతున్న మంచి నీటితో సుమారు 72% మనం వ్యవసాయానికి వాడుతున్నాము. ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాలి. భవిష్యత్తులో పుష్కలంగా మంచినీరు దొరుకుతుంది. మరియు ఎన్నటికి తరగదు అనే అపోహలో ఉండకుండా మంచినీటి సంరక్షణ, ఒడిసి పట్టుకోవడం, నీటి యజమాన్య పద్ధతులను పాటించడం, పంట మార్పిడి, తక్కువ నీటితో సాగు, సూక్ష్మ సేద్యం మొదలైన చర్యలను చేపడుతూ నీటి కాలుష్యం కాకుండా భవిష్యత్తు తరాలకు ఆహార భద్రత కల్పిస్తూ నీటి కొరత లేకుండా సమస్త జీవుల మనుగడకు చర్యలు చేపట్టవలసిన సమయం ఆసన్నమైనది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, ఆర్థిక అభివృద్ధి పేరుతో చేపడుతున్న పారిశ్రామికరణ,
తరుగుతున్న అడవులు, కాలుష్యం, మితిమీరిన నీటి వినియోగం, వాతావరణ మార్పులు, అతివృష్టి లేదా అనావృష్టి వాటి వలన గత దశాబ్ద కాలంలో ప్రతి వ్యక్తికి సరాసరి సగటున 20% మంచినీటి వనరులు తగ్గినాయి. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం మరియు ఎంతో అత్యంత విలువైన నీటి వనరును తిరిగి పొందలేని స్థితికి మనము తీసుకెళ్తున్నాము. అందుకనే ప్రపంచ వ్యాప్తంగా నీటి వినియోగం, నీటి యజమాన్య పద్దతులు, ఆహార భద్రత, సమస్త జీవుల మనుగడ వాటి పైన అవగాహన కలిగించాలని ఈ ప్రపంచ ఆహార దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం.
నేడు సుమారు ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల మంది ప్రజలు నీటి లభ్యత తక్కువగా ఉండి తీవ్ర ఒత్తిడికి లోన్ అవుతున్నారు. చాలా చిన్న సన్న కారు రైతులు, గ్రామీణ మహిళలు. ఆదివాసి గిరిజన తెగలు, వలసదారులు, శరణార్థులు నీటి కటకటాలకు లోనవుతున్నారు. నీటి కొరత నిరంతరం పెరుగుతున్న సంఘర్షణ కారణంగా ఈ అమూల్య మైన వనరు కోసం పోటీ పెరుగుతోంది. సుమారు 600 మిలియన్ మంది ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా పాక్షికంగా, జలహార వ్యవస్థలైన చేపలు, రొయ్యలు ఇతర మత్స సంపద ద్వారా జీవనోపాధి పొందు తున్నారు… నీటి కాలుష్యం, నిలకడ లేని పద్దతులు, వాతావరణ మార్పుల వలన తీవ్ర సమస్యలను ఎదు ర్కొంటున్నారు.
మన దేశంలో 24,24,540 నీటి వనరులు లెక్కించబడ్డాయి, వాటిలో 97.1% (23,55,055) గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో 2.9% (69,485) మాత్రమే ఉన్నాయి. నీటి వనరులలో ఎక్కువ భాగం అంటే 83.7% వాడుకలో ఉండగా మిగిలిన 16.3% ఎండిపోవడం, నిర్మాణంలో ఉండడం, పూడిక తీయకపోవడం వలన ఇసుక చేరి వినియోగంలో లేకపోవడం, ఉప్పు ఇతర లవణాల శాతం పెరగడం, ధ్వంసమై మరమ్మత్తు చేయలేని విధంగా ఉండడం వలన వాడకంలో లేవు. మనదేశంలో సమృద్ధిగా నీటి వనరులు ఉన్నప్పటికీ పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, వ్యవసాయంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, అడవుల నరికివేత కారణంగా మన దేశం నీటి కొరతవైపు పయనిస్తున్నాము. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 18 శాతం గా ఉన్న మనము కేవలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీటి వనరులలో 4 శాతంతోనే బ్రతుకుతున్నాము. భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నీటి యజమాన్య పద్ధతులు చేపట్టకపోతే మరిన్ని నీటి కష్టాలు దగ్గర్లోనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా జల శక్తి అభియాన్ కార్యక్రమం క్రింద ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి అవసరాలకు వాడాలని చాలా అవగాహన కార్యక్రమాలను ఈ క్రింది ఉద్దేశంతో ప్రతి సంవత్సరం చేపడుతున్నది. 1. ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టడం మరియు సంరక్షించడం, 2. అన్ని నీటి వనరులను లెక్కించడం, జియో-ట్యాగింగ్ & జాబితా తయారు చేయడంబీ నీటి కోసం శాస్త్రీయ ప్రణాళికల తయారీపరిరక్షణ, 3. అన్ని జిల్లాల్లో జల శక్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం, 4. అడవుల పెంపకాన్ని ప్రోత్సహించడం, 5. ప్రతి ఒక్కరికి నీటి యజమాన్య పద్ధతుల పైన అవగాహన కల్పించడం.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించినట్లయితే 2023-24 సంవత్సరంలో సుమారు 25.67 మిలియన్ మెట్రిక్ టన్నుల వడ్లు, (67% బియ్యం రికవరీతో సుమారు 17.12 మిలియన్ మెట్రిక్ టన్నుల బియ్యం), 2.67 మిలియన్ మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, 0.2 మిలియన్ మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలు, 0.34 మిలియన్ మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు, 0.75 మిలియన్ మెట్రిక్ టన్నుల నూనె గింజలు (మొత్తం వంట నూనెల ఉత్పత్తి సరాసరి సుమారు 0.20 మిలియన్ మెట్రిక్ టన్నులు), 2.43 మిలియన్ మెట్రిక్ టన్నుల పండ్లు, 1.46 మిలియన్ మెట్రిక్ టన్నుల కూరగాయలు, 0.18 మిలియన్ మెట్రిక్ టన్నుల పసుపు, 1.17 మిలియన్ మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి, 0.6 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎండు మిరపకాయలు, 6.12 మిలియన్ మెట్రిక్ టన్నుల పాలు మరియు పాల ఉత్పత్తులు, ఉత్పత్తి జరుగుతున్నది. మన రాష్ట్రంలో వరి ప్రధాన పంటగా సాగు చేయడం వలన ఎక్కువ మోతాదులో వినియోగిస్తున్నాము. నీటిని 24 గంటల ఉచిత కరెంటు అందుబాటులో ఉండటం వలన నీటి వినియోగంలో ఎలాంటి యజమాన్య పద్ధతులు పాటించకపోవడం వలన ఎంతో విలువైన నీటిని అవసరానికి మించి ఎక్కువ మోతాదులో వాడుతున్నాము. ఇటువంటి పరిస్థితులలో పంట మార్పిడి ద్వారా తక్కువ నీటితో వివిధ రకాల ఆహార పంటలను సాగు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పెరుగుతున్న వంటనూనెల ధరలు, దేశీయ నూనె గింజల ఉత్పత్తి తగినంత లేకపోవడం వలన మార్కెట్లో వంటనూనెల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దిద్దుబాటు చర్యలు గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నూనె గింజల మరియు ఆయిల్ ఫామ్ సాగు వైపు ప్రోత్సహించడం జరుగుతున్నది. మన రాష్ట్రంలో కూడా రైతులు పంట మార్పిడి చేపట్టి వేరుశనగ, సోయాబీన్, నువ్వులు మరియు పొద్దుతిరుగుడు వంటి నూనె గింజల సాగు పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా తక్షణ కర్తవ్యం గా నీటి వినియోగ యజమాన్య పద్ధతులతో పాటు భవిష్యత్తు నీటి కటకటాల నుండి మనల్ని మనం కాపాడుకుంటూ భూమి మీద నివసిస్తున్న సమస్త మానవ కోటికి సమతుల్య ఆహారం, పోషణ వైవిధ్యం, పోషకార భద్రత మరియు ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఆహార ఉత్పత్తి పంటల సరళిని మార్చి పోషకాహార భద్రత వైపు అడుగులేస్తూ మన పెద్దలు సాగు చేసి తిన్నటువంటి జొన్నలు మరియు మిల్లెట్స్ పంటల సాగు విస్తీర్ణం పెంచడం. తప్పనిసరి పరిస్థితి. మరో ముఖ్యమైన ఆహార పంటలైన పప్పు ధాన్యాలను తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడంతో పాటు మంచి లాభాలను గడించవచ్చు. పప్పుధాన్యాలు అధిక నీటి వినియోగ సామర్థ్యం కలిగి ఉంటాయి మరియు ఇతర ప్రోటీన్ల ఉత్పత్తికి అయ్యే నీటి వినియోగం తో పోలిస్తే అపరాల ప్రోటీన్ల ఉత్పత్తికి కేవలం 10 శాతం మాత్రమే నీటిని వినియోగించుకుంటాయి.
ప్రతి నీటి బొట్టు ను ఒడిసి పట్టుకోవడంతో పాటు, సంరక్షణ, సమర్థ వినియోగం మరియు పంపిణీ ద్వారా తక్కువ నీటితో సాగు చేసే పంటలను ప్రోత్సహించడంతోపాటు సూక్ష్మ సేద్యం, బిందు సేద్యం ద్వారా పండ్లు కూరగాయలను పండిస్తూ, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి చెట్లను నాటడం, అడవులను పెంచడం వంటి దిద్దుబాటు చర్యలను చేపడితేనే ప్రతి ఒక్కరికి కావలసిన త్రాగునీరు, సాగునీరు దొరుకుతుంది మరియు ప్రపంచశాంతి నీళ్లతోనే అది సాధ్యపడుతుంది.