ఉద్యానశోభవ్యవసాయ పంటలు

Inter Cropping: చెరకుతో పాటు ఈ రెండు పంటలను సాగు చేస్తే రెట్టింపు ఆదాయం.!

1
Intercropping in Sugarcane
Intercropping in Sugarcane

Inter Cropping: చెరకు దీర్ఘకాలిక పంటగా పరిగణిస్తారు. దాని పంటకు సిద్ధం కావడానికి 10 – 12 నెలల సమయం పడుతుంది. అటువంటి పరిస్థితిలో, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా, రైతులు ఈ కాలంలో చెరకుతో పాటు పండిరచే అనేక రకాల పంటలను పండిరచవచ్చు. దీని వల్ల రైతులకు చెరకుతో పాటు ఇతర పంటల ద్వారా కూడా లాభాలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టవచ్చు. చెరకు కంటే ముందే వచ్చే అనేక పంటలు ఉన్నాయి. ఈ పంటల నుంచి లాభదాయకమైన పంటలను ఎంచుకోవడం ద్వారా, చెరకు పంట సిద్ధమయ్యే ముందు ఈ పంటను విక్రయించడం ద్వారా రైతు లాభాన్ని పొందవచ్చు.

అటువంటి కొన్ని పంటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పంటలు మీకు అదనపు ప్రయోజనాలను ఇవ్వడమే కాకుండా, భూసారాన్ని కూడా పెంచుతాయి. ఇది చెరకు పంటకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

చెరకుతో ఎలాంటి పంటలు పండిరచవచ్చు?
ఫిబ్రవరి-మార్చిలో చెరకు విత్తిన రైతులు చెరకుతో పాటు పాలకూర, కొత్తిమీర, మెంతు కూర సాగు చేసుకోవచ్చు. విత్తన నిష్పత్తి కింది విధంగా ఉండాలి. మీరు చెరకుతో పాటు పెసర పంట సాగు ను పెంచాలనుకుంటే, దాని నిష్పత్తి 1:1 అంటే ఒక వరుస చెరకు,మరొక వరుసలో పెసర ను నాటండి. మీరు చెరకుతో పాటు ఉల్లిని పెంచాలనుకుంటే, 1:1 నిష్పత్తిలో ఉంచండి.
మరోవైపు, మీరు చెరకుతో కొత్తిమీరను పండిరచాలనుకుంటే, చెరకు, కొత్తిమీర నిష్పత్తిని 1: 3గా ఉంచండి. అదేవిధంగా, మీరు చెరకుతో మెంతులు పండిరచాలనుకుంటే, దాని నిష్పత్తి 1:3 ఉంచండి.

పప్పుధాన్యాల పంటల్లో పెసలు, మినపప్పు వంటి వాటికి మంచి ధరలు లభిస్తాయి. మినుములు,పెసలకు మార్కెట్‌లో డిమాండ్‌ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వాటి ధరలు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి చెరకుతో పాటు పెసలు ,మినుములు సాగు చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. మధ్యప్రదేశ్‌లోని చాలా మంది రైతులు తమ చెరుకుతోటల్లో పలురకాల పంటలను సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. విశేషమేమిటంటే మధ్యప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి సంవత్సరం రైతుల నుంచి కనీస మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెసలు, మినుములు సాగుతో అక్కడి రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు.

చెరకుతో పాటు పెసలు, మినుములు సాగు చేస్తే భూమిలో సారం పెరుగుతుంది. అదే సమయంలో, ఎరువులపై ఖర్చు కూడా తగ్గుతుంది. పప్పుధాన్యాల పంటకు మీరు ఇచ్చే ఎరువు వల్ల చెరకు పంటకు కూడా ప్రయోజనం ఉంటుంది. అదే సమయంలో, మీరు ఈ పంటలకు నీటిపారుదల కోసం అదనపు ఏర్పాట్లు చేయవలసిన అవసరం లేదు.

మీ చెరకు పంటతో పాటు, ఈ పంటలకు కూడా సాగునీరు అందుతుంది. ఈ విధంగా చెరకు పంటతో పాటు పెసలు, మినుములు సాగు చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు. మరోవైపు, చెరకు పంటకు మంచి దిగుబడికి లాభదాయకమైన పెసలు, మినుములు సాగు చేయడం ద్వారా నత్రజని లభిస్తుంది.

Also Read: Fish Farming: వేసవిలో చేపల చెరువుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు.!

Inter Cropping

Inter Cropping

విత్తే విధానం..

చెరకుతో పాటు పెసర పండిరచాలనుకుంటే, చెరకు పంటను నాటేటప్పుడు రైతు రెండు వరుసలు లేదా గట్ల మధ్య సుమారు మూడు అడుగుల దూరం ఉంచాలి. చెరకుతో పాటు పెసర పంటను పండిరచేటప్పుడు రైతు గుర్తుంచుకోవాలి.. అవేంటంటే..? చెరకు నాటిన తరువాత, పెసలను రెండు వరుసలలో స్వదేశీ నాగలితో లేదా ఎద్దుతో నడిచే విత్తన డ్రిల్‌ సహాయంతో గట్లపై విత్తుకోవాలి. మెరుగైన పెసర రకాలను ఉపయోగించాలి. పొలాన్ని సిద్ధం చేసే సమయంలో పెసర సాగులో ఎకరాకు 5 కిలోల నత్రజని 16 కిలోల భాస్వరం వేయాలి.

విత్తడానికి ముందు, విత్తనాలను శుద్ధి చేయాలి, తద్వారా పంటపై తెగుళ్ళు, వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది. దీని కోసం ఒక కిలో పెసర విత్తనాలకు ఒక గ్రాము కార్బండజిమ్‌, రెండు గ్రాముల క్యాప్టాన్‌ ద్రావణాన్ని తయారు చేసి శుద్ధి చేయాలి. ఇప్పుడు శుద్ధి చేసిన విత్తనాలను రైజోబియం కల్చర్‌తో శుద్ధి చేయాలి. ఇందుకోసం కిలో విత్తనానికి 5 గ్రాముల రైజోబియం కల్చర్‌తో శుద్ధి చేయాలి. పెసర పంటలో ఎకరాకు 18 కిలోల చొప్పున డీఏపీ వేయాలి. మొదటి సారి 10`15 రోజుల వ్యవధిలో నీళ్లు పెట్టాలి. దీని తర్వాత అవసరాన్ని బట్టి నీరు అందించాలి.
మినుములు విత్తేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి….

మినుములు విత్తేటప్పుడు, వరుసకు వరుసకు 30 సెంటీమీటర్ల దూరం మొక్కకు 10 సెంటీమీటర్ల దూరం ఉండాలి. మినుముల పంటకు 3 నుంచి 4 సార్లు నీరు అవసరం. మొదటి సారి నీరు కొద్దిగా తడపాలి. ఆ తర్వాత 20 రోజుల వ్యవధిలో నీళ్లు పెట్టాలి.

మొక్క ప్రారంభ దశలో హెక్టారుకు 15 నుంచి 20 కిలోల నత్రజని, 40-50 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్‌ను విత్తే సమయంలో పొలంలో కలపాలి. ఇలా చెరుకు పంటలో అంతర పంటగా పెసర,మినుము సాగు చేసి అదనంగా ఆదాయాన్ని పొందవచ్చు.

Also Read: Cattle Holiday: ఆదివారం మనుషులకే కాదు.. పశువులకి కూడా సెలవు.! 100 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం.. కారణం ఏంటో తెలుసా ?

Leave Your Comments

Fish Farming: వేసవిలో చేపల చెరువుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు.!

Previous article

Minister Niranjan Reddy: తెలంగాణలో సమృద్ధిగా చేపలు – మంత్రి నిరంజన్ రెడ్డి

Next article

You may also like