ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రకారం సంవత్సరానికి ఒక మనిషి తీసుకోవాల్సిన ఆహారం 18 కేజీలు, కానీ మన రాష్ట్రంలో 8.07 కేజీలు మాత్రమే తీసుకుంటున్నారు. మన భారతదేశంలో వార్షిక తలసరి చేపల వినియోగం 4.9 నుండి 8.89 కిలోలకు పెరిగింది, ఇది 3.99 కిలోలు (81.43%) పెరుగుదలతో 4.05% వృద్ధి రేటుతో ఉంది.
చేపలు తినేవారి నిష్పత్తి త్రిపురలో అత్యధికంగా (99.35%) మరియు హర్యానాలో అత్యల్పంగా (20.55%) ఉంది. సాధారణంగా, ఈశాన్య (>95%) మరియు తూర్పు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ మరియు గోవా (>90%), ఆంధ్ర ప్రదేశ్ (91.60%) లలో చేపలు తినేవారి శాతం అత్యధికంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్ (26.45%), హర్యానా (20.55%) మరియు రాజస్థాన్ (22.5%) లలో అత్యల్పంగా ఉంది.
ప్రతిరోజూ చేపలు తినే జనాభా నిష్పత్తి కేరళ (53.5%), గోవా (36.20%), పశ్చిమ బెంగాల్ (21.90%), మణిపూర్ (19.70%), అస్సాం (13.10%) మరియు త్రిపుర (11.50%) లలో అత్యధికంగా ఉంది. అయితే, వారానికి కనీసం ఒక్కసారైనా చేపలు తినేవారిలో, అస్సాం మరియు త్రిపుర (ఒక్కొక్కటి 69%), ఒడిశా (66.8%), పశ్చిమ బెంగాల్ (65.75%), అరుణాచల్ ప్రదేశ్ (65.25%) మరియు తమిళనాడు (58.2%)లలో ఈ నిష్పత్తి ఎక్కువగా ఉంది. కనుక చేపలలో ఉండే పోషక విలువలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరం.
- చేప మాంసకృత్తులతో వచ్చే పెరుగుదల వృక్ష సంబంధ మాంసకృత్తులను తీసుకోవడం వలన వచ్చే పెరుగుదల కన్నా ఎక్కువగా ఉంటుంది.
- ఒమేగా-౩ కొవ్వు ఆమ్లాలు రక్తంలో ఉండే కొలెస్టరాల్ తగ్గించడంలో, అకస్మాత్ గా వచ్చే గుండె నొప్పిని మరియు గుండె జబ్బుల నివారణలో ముఖ్యపాత్ర వహిస్తాయి
- ఒమేగా-౩ కొవ్వు ఆమ్లాలు ఊపిరితిత్తులకు సంభదించిన వ్యాధులను (అస్తమా) తగ్గించటంలో దోహదపడతాయి.
- ఒమేగా-౩ కొవ్వు ఆమ్లాలు మానసిక వ్యాధులతో బాధపడే రోగుల మానసిక వికాసానికి, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధుల తీవ్రతను తగ్గించటం, రుమటాయిడ్ అర్థిరైటిస్ ని రూపుమాపడంలో మరియు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో కణుతుల పెరుగుదల తగ్గించడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు.
- గర్భిణి మహిళలు చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా సుఖప్రసవం జరగటానికి, బిడ్డ సరయిన బరువులో ఉండటానికి దోహదపడతాయి.
- చేపలు/రొయ్యలలో ఉండే విటమిన్ ఎ కంటి చూపుకు ఉపయోగపడుతుంది.
- చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా పిల్లలలో జ్ఞాపక శక్తి పెరగటానికి దోహదపడతాయి
- అయోడిన్ లోపం వలన వచ్చే గాయిటర్ వ్యాధి, చిన్న పిల్లలలో వచ్చే పెరుగుదల లోపాలు సముద్ర ఉత్పతులను ఆహారంలో బాగంగా తీసుకోవడం ద్వారా నివారించవచ్చును.
వివిధ వయస్సుల వారు రోజు వారి ఆహారంలో తీసుకోవాల్సిన మాంసకృత్తుల మోతాదు

ఈ విధంగా చేపలు మన దైనందన ఆహారంలో మంచి స్థానాన్ని ఏర్పరుచుకొని మానవ జీవన విధానాన్ని మెరుగు పరుస్తున్నాయి.
జె. యశ్వంత్ కుమార్ మరియు డా. డి సుధారాణి (మత్స్య శాస్త్రవేత్త) (కార్యక్రమ సమన్వయకర్త), కృషి విజ్ఞాన్ కేంద్రం, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఘంటశాల, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.


























