ఆంధ్రప్రదేశ్ లో సుమారు రెండు లక్షల హెక్టార్లలో ఆక్వా సాగు అనేది చేపట్టడం జరుగుతుంది అందులో 1.5 లక్షల హెక్టార్లు మంచినీటి చేపల పెంపకం మిగిలిన 50 వేల హెక్టార్లలో ఉన్న ఉప్పు నీటి వనరులలో రొయ్యల సాగు చేపడుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చూస్తే రొయ్యల సాగు సుమారు నాలుగు వేల హెక్టార్ల విస్తీర్ణంలో చేపడుతున్నారు. ఉప్పునీటి రొయ్యల పెంపకం రొయ్యల ఎగుమతుల ద్వారా మన రాష్ట్రానికి, దేశానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా మన దగ్గర ఎక్కువగా పెంచే రకాలు – వనామీ మరియు టైగర్ రొయ్య . ఇంతకుముందు ఈ ఉప్పు నీటి చెరువులలో టైగర్ రొయ్యల పెంపకం చేపట్టే వారు, కానీ వైరస్ లేని నాణ్యమైన రొయ్యపిల్లల లభ్యత ప్రధాన సమస్యగా ఉన్నందున, అధిక దిగుబడి, వేగవంతమైన ఎదుగుదల కారణంగా, ప్రస్తుతం రైతులు ఎక్కువగా వెనామీ రొయ్యలు పెంపకం చేపడుతున్నారు.
టైగర్ రొయ్యలతో పోలిస్తే వెన్నమిసాగులో చాలా ప్రత్యేకతల కలిగి ఉన్నాయి
ముఖ్యంగా టైగర్ రొయ్యలతో పోలిస్తే వ్యాధుల ప్రభావం చాలా తక్కువ,
అధిక సాంద్రతలో అంటే చదరపు మీటరుకు 60 నెంబర్ వరకు సాగు చేపట్టే వీలుంటుంది కనుక అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది.
ఇంకా వివిధ రకాల సెలనిటీలలో (0 పిపిఎంనుండి 35 పిపిఎం ) ఈ రొయ్యలను పెంచుకునే వీలుంటుంది
నీటి గుణాల్లో వచ్చే మార్పులు కూడా చాలా వరకు తట్టుకుంటాయి
వన్నమి రొయ్యలకు తక్కువ ప్రోటీన్ ఉన్న మేతలను వాడుకునే అవకాశం ఉంది
పంటకాలం కూడా చాలా తక్కువ అంటే 90 నుండి 125 రోజులలో పంట వస్తుంది
తక్కువ సమయంలో అధిక దిగుబడులు, అధిక రాబడిని పొందే వీలు ఉన్నప్పటికీ చెరువుల తయారీ విషయంలో అవగాహన పూర్తిగా లేకపోవడం, నాణ్యమైన విత్తనాలు లభించక పోవడం మేత ఆరోగ్య యాజమాన్యంలో అవగాహన లేకపోవడం, దీంతో పాటు ప్రస్తుత కాలంలో ఈ హెచ్ పి (E.H.P), వైట్ గట్, విబ్రియో వంటి వ్యాధుల ప్రభావం వలన రైతులు ఎక్కువగా నష్టాల బారిన పడుతున్నారు.
రొయ్యల పెంపకంలో నేల స్వభావం, మట్టి లక్షణాలు చాలా కీలకమైనవి. చెరువు నేల స్వభావం మీద మట్టికి నీటిని నిల్వ ఉంచే శక్తి, సరైన పోషకాల లభ్యత నేల, నీటి లక్షణాల లో ఏర్పడే మార్పులు ఆధారపడి ఉండి, చెరువు లో పెంచే రొయ్యల బ్రతుకుల పెరుగుదల పై ప్రభావం చూపిస్తాయి. సాగు సమయంలో నేలలోని పోషకాలు నీటిలోకి విడుదల అవటం జరుగుతుంది. వృధా అయిన మేతలు ఇతర సేంద్రియ పదార్థాలు బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నం అవ్వడం, plankton అభివృద్ధికి పంట కాలంలో నీటి గుణాలు సమతాస్థితి లో ఉంచడానికి నేల లక్షణాలు కీలక పాత్రను పోషిస్తాయి. రొయ్యల పెంపకానికి నల్లరేగడి నేలలు ఒండ్రుతో కూడిన ఇసుక నేలలు(loam) వంటి నీటిని నిల్వ ఉంచి లక్షణాలు ఉన్న నేలలు అనుకూలమైనవి.
అందువల్ల రైతు సోదరులు రొయ్య పిల్లలను చెరువులో వదిలే ముందు చెరువును సరిగ్గా తయారు చేసుకోవడం వలన పంట కాలంలో వచ్చే చాల రకాల ఇబ్బందుల నుండి పంటను రక్షించుకోవచ్చును.
రొయ్యల సాగుకు ముందు చెరువులు ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే, ముందుగా చెరువు నుండి మేతలతోపాటు వాడే చెక్ ట్రేసు, ఎరిఎటర్లు ఇతర పనిముట్లు అన్నిటిని తొలగింఛి, వాటిపై కుళ్ళుతున్నపదార్దం, జీవులు గాని నత్త గుల్ల గానీ లేకుండా శుభ్రపరుచుకోవాలి
గత పంట తాలూకా నీటిని పూర్తిగా బయటకు తోడేసి తరువాత చెరువుల్లో ఉన్న గవ్వలను నత్త గుళ్ళను పూర్తిగా ఏరి వేయాలి
సేంద్రీయ వ్యర్ద పదార్థాలు ఎక్కువగా చేరడం వలన నేల అడుగుభాగం నల్లగా తయారవుతుంది అందువల్ల ఈ నల్లని మట్టిని ఒకటి నుండి నాలుగు సెంటీమీటర్ల లోతు వరకు పూర్తిగా తీసేసి చెరువు నుండి దూరంగా వేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ గట్ల పై వేయరాదు
తర్వాత చెరువులను 20 నుండి 30 రోజుల వరకు నేల పగుళ్ళు వచ్చే విధంగా బాగా ఎండబెట్టాలి ఈ విధంగా చేయడం వల్ల చాలా రకాల వ్యాధులను వ్యాపింప చేసే వాహకాల గుడ్లను చిన్న చిన్న చేప పిల్లలను చంపేయొచ్చు ఇంకా మిగిలివున్న సేంద్రియ వ్యర్ద పదార్ధాలు కూడా ఆక్సిడేషన్ జరిగే విషవాయువులు బయటకు విడుదల అయిపోతాయి
ఒకవేళ రైతులకు ఎండ గట్టుకునే సదుపాయం లేనట్లయితే, వీలైనంత వరకు నీటిని తీసేసి మిగిలిన నీటిలో 20 పిపిఎం మోతాదులో క్లోరినేషన్ చేసుకోవాలి తరువాత చనిపోయిన జీవాలను అన్నిటినీ ఏరి వేయాలి.
నీటి లోతు 15నుండి 20 సెంటీమీటర్లు ఉన్నప్పుడు అవకాశం ఉన్న పరిస్థితుల్లో కేజ్ వీల్స్ ఉన్న ట్రాక్టర్లతో దున్నాలి. ఈ విధంగా చేయడం వల్ల చాలావరకు హానికారక వాయువులు బయటికి విడుదల అయిపోతాయి ఇలా చేసిన తరువాత sludgeతో ఉన్న నీటిని బయటకు తోడేయాలి
ఈ విధంగా చెరువులను బాగా ఎండగట్టి దున్నిన తర్వాత మట్టి నమూనాలను సేకరించి పరీక్ష చేసుకుని నెల గుణాలు అనుకూల స్థాయిలో ఉండేల చేసుకోవాలి
రొయ్యల సాగుకు మట్టి గుణాలు ఏ విధంగా ఉండాలంటే పీహెచ్ అంటే ఉదజని సూచి 6.5 నుండి 7.5 సేంద్రీయ కర్బనం 1.5 శాతం నుండి 2 శాతం నత్రజని వందగ్రాముల మట్టిలో 50 మిల్లీగ్రాముల నుండి 75 మిల్లీగ్రాముల భాస్వరం 100 గ్రాములు మూడు నుండి ఆరు మిల్లీగ్రాములు ఉండాలి కార్బన్ నైట్రోజన్ లో నిష్పత్తి 20 1న పత్తిలో ఉండేలా చూసుకోవాలి
పరీక్ష చేసిన మట్టి నమూనాలు పీహెచ్ విలువ 7 కన్నా తక్కువ ఉన్నట్లయితే సున్నాన్ని వాడి సరిచేసుకోవాలి నేల పీహెచ్ విలువ 6.5 నుండి 7 మధ్య ఉన్నట్లయితే వ్యవసాయ సున్నం ఒక టన్ను లేదా క్విక్ లైం 300 నుంచి 500 కేజీలు, పీహెచ్ విలువ 6 నుండి 6.5 మధ్య ఉంటే వ్యవసాయం సున్నం ఒకటి నుండి రెండు టన్నులు లేదా క్విక్ లైం 500 కేజీల నుండి ఒకటి టన్నుచొప్పున వాడుకోవాలి పీహెచ్ విలువ 5.5 నుండి 6 మధ్య ఉంటే వ్యవసాయ సున్నం 2 నుండి 3 టన్నులు క్విక్ లైం ఒకటి నుండి 1.5 టన్నులు చొప్పున వాడుకోవాలి
మట్టి గుణాలను పరిశీలించినప్పుడు నత్రజని భాస్వరం సేంద్రీయ కర్బనం పరిమాణాలను మోతాదు తక్కువగా ఉన్నట్లయితే నిపుణుల సలహా మేరకు సేంద్రియ రసాయన ఎరువులను వాడుకోవాలి
సున్నం వాడిని వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువులు వాడరాదు కనీసం వారంపాటు విరామం పాటించడం మంచిది చెరువులో ఒక అడుగు మేర నీరు పెట్టిన తర్వాత ఎరువులను వాడినట్లయితే ప్లాంక్టన్ బాగా అభివృద్ధి చెందుతుంది.
చెరువు లోనికి లేదా రిజర్వాయర్ చెరువు లోనికి నీరు పంపు చేసేటప్పుడు కలుషితం లేని వనరుల నుండి నీరు పెట్టుకునే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. నీటిని పుంపు చేసే టప్పుడు మూడు దశలలో 20, 40, 60 మేష్ ఉన్న ఫిల్టర్ బ్యాగులతో వడగట్టి తోడుకోవడం వలన ఇతర జీవులు గాని వాటి లార్వాలను గాని చెరువు లోనికి రాకుండా ఆపుకోవచ్చు. ఈ ఫిల్టర్ బ్బాగ్స్ చెరువులోకి తోడే నీటి పరిమాణం బట్టి 4 నుండి 10 మీటర్లు పొడవుగా ఉండే ఫిల్టర్ బ్యాగులను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఫిల్టర్ బ్బాగ్స్ లో మిగిలిపోయిన వేస్ట్ ను చెరువులకు దూరంగా వేయాలి. వడగట్టి తోడుకున్న నీటిని రెండు మూడు రోజులపాటు అలా ఉంచడం వల్ల నీటిలో ఉన్న వ్యర్ధ పదార్ధాలు అడుగు భాగానికి చేరుకుని ఇంకా ఏమైనా గుడ్లు, సిస్టులు వంటివి ఉంటే హచ్ జరుగుతాయి. ఆ తర్వాత క్లోరినేషన్ ద్వారా 10 నుండి 20 పిపిఎం వరకు అంటే సుమారు హెక్టారుకు 250 నుండి 500 కేజీలు వరకూ బ్లీచింగ్ పౌడర్ వాడి శుద్ధి చేసుకోవాలి. నీటిలో క్లోరిన్ పోయేంతవరకు నాలుగు నుండి ఆరు రోజులపాటు నిల్వ ఉంచుకోవాలి. మిగిలి ఉన్న క్లోరిన్ తీసివేయడానికి ఎయిరేషన్ ఏర్పాటు చేసుకోవాలి. వెన్నామి రొయ్యల పెంపకం చేపట్టే రైతులు తప్పనిసరిగా రిజర్వాయరు చెరువులను ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత నీటి గుణాలను పరీక్షించుకుని నీటిలో క్లోరిన్ గానీ ఇతర వ్యాధి కారకాలు గానీ లేవని నిర్ధారించుకొని రిజిస్టర్ కాబడిన హచరీల నుండి నాణ్యమైన రొయ్య పిల్లలను తీసుకుని స్టాక్ చేసుకోవాలి.
రైతు సోదరులు రొయ్య పిల్లలను చెరువులో వదిలే ముందు చెరువును సరిగ్గా తయారు చేసుకోవడం వలన రొయ్యల పై ఒత్తిడి తగ్గి ఈ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా పెరగడానికి ఇంకా పంట కాలంలో నీటి గుణాల్లో మార్పులు ఏర్పడకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది
నాణ్యమైన రొయ్య పిల్లల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- వెనామీ రొయ్యలు పెంపకం లో ఆరోగ్యవంతమైన రొయ్య పిల్లలను కోస్టల్ ఆక్వాకల్చర్ అధారిటీ వారిచే రిజిస్టర్ కాబడిన హేచరీల నుండి పీసీఆర్ పరీక్ష జరిపించుకుని ఎటువంటి వ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే పెంపకానికి ఎంచుకోవాలి
- ఎట్టి పరిస్థితులలోనూ సహజ వనరుల నుండి సేకరించిన రొయ్య పిల్లల పెంపకానికి వాడరాదు
- నాణ్యమైన నా వ్యాధి రహిత రొయ్య పిల్లలను ముఖ్యంగా మూడు దశలలో గుర్తించుకోవాలి అవి విజువల్ ఎసెస్మెంట్ పద్ధతి రెండు ఒత్తిడి పరీక్షలు ఇంకా మూడవ దశలో లాబరేటరీ పరీక్షలు జరిపి రొయ్యలు నాణ్యతను నిర్ధారించుకోవాలి
- ముందుగా విజువల్ ఎసెస్మెంట్ పద్ధతి లో రొయ్యలను పరిశీలించినప్పుడు రంగు లేత గోధుమ రంగు లేక బూడిద రంగులో ఉండే పారదర్శకంగా ఉన్నటువంటి రొయ్య పిల్లలను మాత్రమే ఎంచుకోవాలి
- ఎరుపు నీలం ఆకుపచ్చ రంగు గులాబీ రంగులో ఉన్న రొయ్య పిల్లలను తిరస్కరించాలి
- పోస్టు లార్వా దశ 9 నుండి 15 మధ్యలో ఉన్న రొయ్య పిల్లలను పెంపకానికి ఎంచుకోవాలి అంటే పిల్లలు 10 నుండి 15 మిల్లీమీటర్ల పొడవు కలిగి 4 నుండి 7 rostal spines కలిగి ఉండాలి
- ఎంపిక చేసుకున్న రొయ్య పిల్లలు అన్నీ యూనిఫామ్ సైజులో ఉండాలి. కనీసం 95 శాతం పిల్లలు ఒకే సైజులో ఉన్న వాటిని మనం ఎంపిక చేసుకోవాలి
- ఎంపిక చేసుకున్న రొయ్య పిల్లల కండరం ఆహార నాళం నిష్పత్తి 4:1 గా ఉండి ఆహార నాళం ఖాళీ లేకుండా ఆహారం తో నిండి ఉండాలి
- కండరాలు పారదర్శకంగా ఉండి అన్ని ఒకే సైజులో ఉపాంగాలు అంటే కాళ్లు మీసం తోక పూర్తిగా ఏర్పడి ఉండి ఎటువంటి కోరుకుడు గాని necrosis గాని లేకుండా ఉన్న రొయ్య పిల్లలను ఎంపిక చేసుకోవాలి
- తరువాత సుమారు ఐదు వందల రొయ్య పిల్లలను ఒక బేసిన్లో వేసి చేతితో తిప్పినప్పుడు రొయ్య పిల్లలు నీటి ప్రవాహానికి ఎదురీద గలిగే శక్తిని కలిగి ఉండాలి బేసిన్ మధ్యభాగంలో కానీ రొయ్య పిల్లలు చేరినట్లే అయితే రొయ్య పిల్లలు బలహీనంగా ఉన్నాయని గుర్తించి నిరాకరించాడు
- రెండవ దశలో రొయ్య పిల్లలకు ఫార్మలిన్ ఇంకా సెలినిటి ఒత్తిడి పరీక్షలు చేసి ఈ పరీక్షలో 90 నుంచి 95 శాతం బ్రతుకు దళ కలిగివున్న రొయ్య పిల్లలను పెంపకానికి ఎంచుకోవాలి
- మూడవ దశలో సుమారు ఐదు వేల రొయ్య పిల్లలను దగ్గరలో ఉన్న లేబరేటరీలో సాధారణంగా వచ్చే వ్యాధులు అయినటువంటి EHP, WSSV, IHHNV,IMNV, TSV వంటి వ్యాధుల నిర్ధారణకు PCR పరీక్షలు చేయించుకోని ఎటువంటి వ్యాధులు లేవని నిర్దారించుకుని చెరువుల్లో విడుదల చేసుకోవాలి.
డా. సిహెచ్. బాలక్రిష్ణ, డా. జి ఎస్ రాయ్, డా. ఎస్ కిరణ్ కుమార్, డా. వి. హరికుమార్, డా. బి. సునీత, డా. కె. భాగ్య లక్ష్మి, కృషి విజ్ఞాన కేంద్రం, ఆమదాలవలస, శ్రీకాకుళం. Ph : 9440792616.


























