ఆరోగ్యం / జీవన విధానం

గలిజేరు ఆకు ఆరోగ్య ప్రయోజనాలు..

0

ప్రకృతి ఓ ఔషదాల గని. వర్షం పడగానే ఎక్కడపడితే అక్కడ చక చకా మొలిచి కనిపించే మరో అద్భుతమైన మూలిక గలిజేరు. అత్యంత ప్రమాదకర అనారోగ్యాలకు వైద్యాన్ని, ఔషధాలను ప్రకృతిలో లభించే మొక్కలతో తయారు చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో దీనిపేరు పునర్నవ. పునర్ అంటే తిరిగి, నవ అంటే కొత్తగా అని అర్థం, దీని శాస్త్రీయ నామం బోరేవియా డిఫ్యూసా. ఆయుర్వేద మందుల్లో నొప్పిని తగ్గించే ఔషధంగా, రక్తాన్ని వృద్ధి పరచటానికి వాడే ముందుగా తయారు చేసేది ఈ మొక్కతోనే. ఈ మొక్క వర్షాకాలంలో ఎక్కువగా మొలుస్తుంది. నేల మీద పాకే ఈ మొక్క మూడు రకాలు తెలుపు, ఎరుపు, మరియు నలుపు.
ఔషధ గుణాలు మూడింటికీ ఒకేలాగా ఉన్న తెల్ల గలిజేరు ఉత్తమని అంటారు. వాటికి పూచే చిన్న చిన్న పువ్వుల రంగు బట్టి అది ఏ రంగుదో నిర్ణయిస్తారు.
తెల్ల గలిజేరును వేడి నీటిలో మరిగించి తాగితే కఫం, దగ్గు, విషం, పాడు రోగాలు, శరీరానికి కలిగే వాపులు, వాత వ్యాధులు, కడుపుకి సంబంధించిన వ్యాధులు, కాలేయ వాపుని మరియు గుండె బలహీనత వల్ల వచ్చిన వాపుని పోగొడుతుంది. మూత్రపిండాలను బాగు చేసి సక్రమంగా పని చేసేలా చేస్తుంది. నెల రోజులు తింటే కుష్టు రోగమును కూడా హరిస్తుంది. ఈ వేరు నీటిలో అరగతీసి కంటికి పెడితే రేచీకటి తొలగిపోయి కంటి చూపు మెరుగు పడుతుంది. ఈ ఆకు వండుకుని తింటూ ఉంటే రక్తం శుభ్రపడి వృద్ధి చెందుతుంది. ఈ తెల్ల గలిజేరు ఆకు రసం పది గ్రాములు పెరుగులో కలిపి ఉదయం, సాయంకాలం తీసుకుంటే కామెర్లు నయమవుతాయి. అలా మూడు రోజులు తినాలి. తెల్లగలిజేరు ఆకులు పిడికెడు తీసుకుని శుభ్రపరిచి పావు లీటరు మంచినీటిలో వేసి పది నిమిషాలు మరగనివ్వాలి. అనంతరం చల్లార్చి వడపోసిరోజు ఉదయం పరగడుపు ఒక గ్లాసు తీసుకున్నట్లయితే కిడ్నీలు శుద్ధితో పాటు మూత్ర నాళ సమస్యలు పూర్తిగా దూరం అవుతాయి. కానీ ప్రక్రియను 21 రోజులు చేయవలసి ఉంటుంది. ఈ కాషాయం తీసుకున్న అనంతరం ఓ అరగంట ఏమీ తినకూడదు. తెల్ల గలిజేరు వేరు, ఉమ్మెత్త వేరు కలిపి ముద్ద చేసి తింటే పిచ్చికుక్క కరిచినప్పటి విషం విరిగిపోతుంది. తెల్ల గలిజేరు ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి.
గలిజేరు మొక్కను నూరి రసం తీసి దానికి సమానంగా నువ్వుల నూనెని కలిపి నూనె మిగిలేదాకా సన్నని సెగను కాచి వాతం నొప్పులున్న చోట, కీళ్ల నొప్పులకు మర్దనా చేస్తే తగ్గుతాయి. నడకరాని పిల్లలకు ఇదే తైలం మర్దన చేసి తర్వాత స్నానం చేయిస్తే నడక వస్తుందని మూలికా వైద్యులు చెప్తారు. గలిజేరు ఆకు వేడి చేసి కడితే బోదకాలు తగ్గుతుంది. ఎర్ర గలిజేరు చలవ చేసి పైవాటితో పాటు పిత్తాన్ని పోగొడుతుంది. నల్ల గలిజేరు కారం, చేదు రుచి వుండి వాతాన్ని పోగొడుతుంది. ఇది దొరకటం అరుదు. మనకి సామాన్యంగా ఆందుబాటులో ఉండేది తెల్ల గలిజేరు. పప్పులో కలిపి వండుకుంటారు.
ఉప్పు, మిరప కాయలు వేసి రుబ్బిన మినప్పిండిలో గుమ్మడి బదులు తరిగిన గలిజేరు మొక్క కలిపి వడియాలుగా చేసి ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు. ఆకులతో కషాయం చేసి తాగుతారు. ఈ కషాయంలో కొద్దీగా అల్లం రసం కలిపి తాగితే నెలరోజుల్లో శరీరం ఉబ్బు తగ్గుతుంది.
ఈ ఆకు కూరని అతిగా తినకూడదు. తీవ్రమైన హృద్రోగం వున్నవారు వైద్యుడి సలహా తీసుకుని తీరాలి. డయాబెటీస్, అధిక రక్తపోటు ఉన్నవారు చలువ చేసే పదార్థాలు అధికంగా తింటూ ఈ ఆకు కూరని మితంగా తినాలి. పాలిచ్చే తల్లులు, గర్భిణీలు ఈ ఆకు కూర తినకూడదు. ఆరోగ్యం బాగున్న వారు ఈ కాలంలో వారానికి ఒక సారి తిన్నా సరిపోతుంది. కిడ్నీ సమస్యలు వున్నవారు వారానికి రెండు మూడు సార్లు పప్పులో వండుకుని తింటే మంచిది. చాలా త్వరగా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఆకు ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునరుజ్జీవితం చేయగలదు కనుకనే ఇది “పునర్నవ” అయ్యింది.

Leave Your Comments

శ్రీగంధం చెట్లు పెంచడంతో .. సిరులు

Previous article

నెయ్యి వలన కలిగే ఉపయోగాలు..

Next article

You may also like