వార్తలు

విస్తారంగా గోధుమల సాగు..3.36% వృద్ధి

0
Wheat sowing up

Wheat sowing up 3.36% so far దేశంలో గోధుమల పంట వృద్ధి చెందిందని వ్యవసాయ మంత్రిత్వశాఖ పేర్కొంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం  ప్రధాన రబీ పంట అయిన గోధుమల విస్తీర్ణం ప్రస్తుత రబీ సీజన్‌లో 133.84 లక్షల హెక్టార్ల నుండి ఇప్పటివరకు 3.36 శాతం పెరిగి 138.35 లక్షల హెక్టార్లకు చేరుకుంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లో 35.8 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్‌లో 34.98 లక్షల హెక్టార్లు, పంజాబ్‌లో 29.45 లక్షల హెక్టార్లు, హర్యానాలో 13.78 లక్షల హెక్టార్లు, రాజస్థాన్‌లో 13.37 లక్షల హెక్టార్లలో గోధుమలు సాగయ్యాయి. దేశంలో గోధుమలు పండించే ప్రధాన రాష్ట్రాలు ఇవే.

Wheat sowing up 3.36% so far

గోధుమలతో పాటు, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం ఈ సీజన్‌లో నవంబర్ 26 నాటికి 94.02 లక్షల హెక్టార్ల నుంచి 97.53 లక్షల హెక్టార్లకు పెరిగింది. ముతక తృణధాన్యాలు మరియు న్యూట్రి తృణధాన్యాలు విత్తిన విస్తీర్ణం క్రితం సంవత్సరంతో పోలిస్తే 25.87 లక్షలహెక్టార్లకు తగ్గుముఖం పట్టింది. నూనె గింజల విస్తీర్ణం ఈ సీజన్‌లో 60.15 లక్షల హెక్టార్ల నుంచి ఇప్పటి వరకు 76.60 లక్షల హెక్టార్లకు పెరిగింది. 2021-22 పంట సంవత్సరంలో ఈ రబీ సీజన్‌లో ఇప్పటి వరకు రబీ పంటల మొత్తం విస్తీర్ణం 346.13 లక్షల హెక్టార్లుగా ఉందని ప్రభుత్వం చెప్తుంది. Wheat sowing up

Wheat sowing up 3.36% so far

భారతదేశంలో పంట సంవత్సరం జూలై నుండి జూన్ వరకు ఉంటుంది. అయితే సాధారణ రబీ విస్తీర్ణం 625.14 లక్షల హెక్టార్లలో ఇప్పటి వరకు 50 శాతానికి పైగా విత్తనం చేపట్టారు. రబీలో విత్తడం అక్టోబర్‌ నుంచి ప్రారంభం కాగా, కోత మార్చి నుంచి ప్రారంభమవుతుంది. Eruvaaka

Leave Your Comments

వ్యవసాయంపై పార్లమెంటరీ ప్యానెల్ సమావేశం వాయిదా…

Previous article

కాంగ్రెస్ వరి దీక్ష !

Next article

You may also like