గత మూడు రోజుల వాతావరణం
గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడ తేలికపాటి ఓ మోస్తారు వర్షాలు కురుసాయి. పగటి ఉష్ణోగ్రతలు 32 నుండి 39 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుండి 28 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి.
రాబోవు ఐదు రోజుల వాతావరణ విశేషణ (ఈరోజు నుండి) :-
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు ఐదు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాట నుండి మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 33 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుండి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు.
హెచ్చరిక :-
మొదటి రోజు :-
ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30 నుండి 40 కి.మీ) వేగంతో తెలంగాణ రాష్ట్రంలో అదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపూర్, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
రెండో రోజు :-
ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30 నుండి 40 కి.మీ) వేగంతో తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది.
మూడో రోజు :- హెచ్చరికలు లేవు.
నాల్గవ రోజు :- హెచ్చరికలు లేవు.
ఐదో రోజు :- హెచ్చరికలు లేవు.
వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు :-
- నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి మే 26వ తేదీన ప్రవేశించి మే 28వ తేదీ రాష్ట్రమంతటా విస్తరించాయి.
- నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో 15 రోజులు ముందుగా వచ్చినప్పటికీ రైతులు వర్షాధార పంటలైన ప్రత్తి , సొయా చిక్కుడు ,మొక్కజొన్న, జొన్న, కంది ,పెసరు మొదలగు పంటలు సాధారంణంగా విత్తే సమయంలోనే అంటే జూన్ 15వ తేదీ నుండి నేల 15 – 20 సెం. మీ . తడిచిన తరువాతనే పంటలను విత్తుకోవాలి .
- జూన్ మాసంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం సూచనలున్నందున (108% శాతం) రైతులు అదిక వర్షపు నీటిని పొలం నుండి బయటకు తీసేయడానికి మురుగు కాలువలు ఏర్పరచుకోవాలి.
- వర్షాధారపు పంటలు సరైన సమయంలో వితుక్కోవడానికి విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందులు సేకరించుకోవాలి.
- వేరుశనగ, సోయా చిక్కుడు, జొన్న, పెసర, కంది, మరియు మినుము పంటలను విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి.
- రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నందున రైతులు చెట్ల క్రింద నిలబడరాదు మరియు పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల క్రింద ఉంచరాదు.
- ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు మరియు చెరువులు , నీటి గుంటలకు దూరంగా ఉండవలెను.
- తేలికపాటి నుండి మోస్తారు వర్షం కురిసే సూచనలు ఉన్నందున కోసిన పంట (వరి, మొక్కజొన్న, పెసర, మినుము, జొన్న, పొద్దు తిరుగుడు, నువ్వులు మొదలు పంటలు) ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలెను. మార్కెట్ కు తరలించిన ధాన్యం తప్పకుండా టర్ఫలిన్ తో కప్పి ఉంచవలెను.
- వర్షాలు కురిసే సూచనలున్నందున మామిడి మరియు కూరగాయ పంటలను కోసుకొని మార్కెట్కు తరలించవలెను.
- వర్ష సూచనలు ఉండ వర్ష సూచనలు ఉన్నందున తాత్కాలికంగా పురుగు మందులు పిచికారి చేయడం వాయిదా వేసుకోవాలి.
- ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని వరి సాగు చేసే రైతులు పచ్చిరొట్ట పైరును (జనుము, జిలుగా, పెసర, పిల్లి పెసర, ఉలవలు మొదలైనవి) విత్తుకోవాలి.
వరి :-
వరి నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు దీర్ఘకాలిక (140 రోజులు ఎక్కువ) వరి రకాలు నారుమళ్ళు పోసుకోవడానికి ఇది అనువైన సమయం.
ప్రత్తి :-
ప్రత్తి పంటను జూలై 20వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు.
ప్రత్తి వర్షాధార పంట కావున, రైతులు వారికి అనుకూలమైన బిటా రకాలు బోదెలు మరియు కాలువ పద్ధతిలో విత్తుకోవాలి.
ఎక్కువ వర్షాలు పడినప్పుడు కూడా కాలువ ద్వారా నీటిని తీసివేయుటకు అనుకూలం.
మొక్కజొన్న:-
మొక్కజొన్న పంటను జూలై 15వ తేదీ వరకు మధ్య మరియు దీర్ఘకాలిక (90 నుండి 100 రోజులు మరియు 100 నుండి 120 రోజులు) రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకొనుటకు అనుకూల సమయం.
మొక్కజొన్న శాకీయ దశలో ఎక్కువ నీటిని మరియు ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి పంటను బోదెలు మరియు కాలువల పద్ధతిలో సాగు చేసుకోవలెను.
జొన్న :-
జొన్న పంటను జూన్ 30వ తేదీ వరకు విత్తుకోవచ్చును.
జొన్నని ఏక పంటగా లేదా కందిపప్పు కందితో అంతర్పంటగా సాగు చేసుకోవచ్చు.
ఆముదం :-
ఆముదం పంటను జూలై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు.
కంది :-
కంది పంటను జులై 15వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు.
కందిని ఎక పంట లేదా ప్రత్తి ,మొక్కజొన్న, జొన్న, సొయా చిక్కుడు, పెసలు మరియు మినుములో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు.
కంది పంటను విత్తే ముందు విత్తనానికి 2.5 గ్రా “కెప్టెన్” లేదా 3గ్రా “థైరామ్” మరియు 10 గ్రాముల “ట్రైకోడెర్మా విరిడే” మందుతో కిలో విత్తనానికి కలిపి విత్తుకున్నట్లయితే విత్తనం లేదా భూమి ద్వారా సంక్రమించే శీలింద్రాల నుండి పంటను కాపాడుకోవచ్చు.
పెసర మరియు మినము :-
పెసర మరియు మినము పంటను జూలై 15వ తేదీ వరకు వితుక్కోవచ్చును.
పెసర మరియు మినుము ఎకపంట లేదా ప్రత్తి మరియు కందితో అంత పంట సాగు చేసుకోవచ్చు.
వరి సాగు చేసే పొలాల్లో ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాలలో పెసరను పైరుగా లేని చోట లేనిచో పచ్చి రొట్టెగా విత్తుకోవాలి.
సోయా చిక్కుడు :-
సోయా చిక్కుడు పంటను జూలై మొదటి వారం నుండి విత్తుకొనుటకు అనుకూల సమయం.
నీటి వసతి గల తేలికపాటి నేలలు కూడా సోయాచికుడు సాగుకు అనుకూలం.
ఎత్తు మడుగు మరియు కాలువల (Broad Bed and Furrow – BBF ) పద్ధతిలో విత్తుకున్నట్లయితే విత్తన మోతాదు తగ్గడంతోపాటు సరైన సాంద్రతలో మొక్కలు ఉండి సాగు ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు వస్తాయి.
ఈ పద్ధతిలో భూమిలోకి ఎక్కువ తేమ ఉండి పంట నీటి యద్దడిని తట్టుకుంటుంది. అదేవిధంగా ఎక్కువ నీటిని పొలం నుండి తీసివేయటానికి కాలువలు ఉపయోగపడతాయి.
చెరుకు :-
తోట వయస్సు 4 నెలలప్పుడు (జూన్ – జూలై మాసాల్లో) మొక్కల వరసల మొదళ్ళ కు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. దీని వలన అధిక వర్షాలు మరియు తుఫాను గాలులకు పంట పడిపోకుండా కాపాడుకోవచ్చు.


























