తెలంగాణవార్తలు

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (PJTAU) వాక్ – ఇన్ – కౌన్సిలింగ్

0

ఈనెల 13వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో PJTAU – WSU (western sydney university) డ్యూయల్ డిగ్రీ కోర్సులకి మరియు NRI/NRI ప్రాయోజిత కోటా B.Sc(ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులకి వాక్ – ఇన్ – కౌన్సిలింగ్
ఈనెల 13వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్ డిగ్రీ BSC (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కోసం వాక్-ఇన్-కౌన్సిలింగ్ ను నిర్వహిస్తున్నట్లు PJTAU రిజిస్ట్రార్ డాక్టర్ G.E.CH. విద్యాసాగర్ తెలిపారు.
అదేరోజు అనగా నవంబర్ 13వ తేదీ (గురువారం) మధ్యాహ్నం రెండు గంటలకు NRI/NRI ప్రాయోజిత కోటా BSC (ఆనర్స్) అగ్రికల్చర్, B.Tech (ఫుడ్ టెక్నాలజీ), B.Tech (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్), BSC (ఆనర్స్), కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో సీట్ల భర్తీకి వాక్-ఇన్-కౌన్సిలింగ్ జరగనుందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఈ రెండు కౌన్సిలింగ్ లు రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్ మెంట్ (C-NARE) ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు G.E.CH విద్యాసాగర్ వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలు, వెబ్ సైట్ లో పేర్కొన్న రుసుముతో కౌన్సిలింగ్ కు హాజరుకావాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలు విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www.pjtau.edu.in లో చూడవచ్చని రిజిస్ట్రార్ డాక్టర్ G.E.CH. విద్యాసాగర్ తెలిపారు.

Leave Your Comments

కేంద్ర పరిశీలన బృందానికి రైతు సంఘాల నేతలు విజ్ఞప్తి 

Previous article

ప్లాస్టిక్ రహిత విశ్వవిద్యాలయంగా తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ

Next article

You may also like