వార్తలు

తెలంగాణ పాడి రైతులకు రాష్ట్ర సర్కార్ బంపర్ ఆఫర్..

0

పాల ఉత్పత్తే ప్రధాన జీవనాధారంగా బ్రతికే పాడి రైతులను ఆదుకోవడంతో పాటు రాష్ట్రంలో పాల కొరతను అధిగమించేందుకు సర్కార్ భారీ మొత్తంలో బర్రెలు, ఆవులను కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. రానున్న రెండేళ్లలో సుమారు 800 కోట్ల రుణాలను పాడి రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పాడి రైతులు ఏ రాష్ట్రం నుంచైనా పాడి పశువులను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. అయితే ముర్రా, సంకర జాతి పశువులను మాత్రమే కొనుగోలు చేయాలని షరతు విధించింది. ఒక్కో పాడి పశువు కొనుగోలుకు సుమారు 75 వేల రూపాయల వరకు చెల్లిస్తారు. అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పశువులు కావడంతో అవి ఇక్కడి వాతావరాణానికి అలవాటు పడే వరకు సుమారు నాలుగు సంవత్సరాల పాటు ఇన్సూరెన్స్ కల్పించనున్నారు. అందుకు గాను రైతులు ప్రతి నెల కొద్ది మొత్తంలో నగదు చెల్లించాల్సి ఉంటుంది.
కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన పాడి రైతుకు అండగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. పాడి రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు భారీ మొత్తంలో రుణాలు అందించేందుకు సిద్ధమైంది. ఓ వైపు రైతుకు అండగా నిలుస్తూనే మరో వైపు రాష్ట్రంలో పాల కొరతను అధిగమించేందుకు కృషి చేస్తోంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున బర్రెలు, ఆవులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. స్త్రీ నిధి పథకం ద్వారా సుమారు 800 కోట్ల రూపాయల వరకు పాడి రైతులకు రుణాలు అందించనుంది. రానున్న రెండేళ్లలో సుమారు లక్ష బర్రెలు, ఆవులు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనితో కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన పాడి రైతులకు ఊరట లభించినట్లైంది .
రుణాలు అందించడంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యతనిస్తోంది సర్కారు. ఇప్పటి వరకు 14 వేల 476 బర్రెలు, ఆవులను పాడి రైతులకు అందించింది. రైతులు ఇతర రాష్ట్రాల నుంచి పశువులను కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది. అయితే అధికంగా పాలనిచ్చే ముర్రా, సంకర జాతి వాటినే కొనుగోలు చేయాలని షరతు విధించింది. పాడి రంగంలో అనుభవం ఉన్న రైతులకు నాలుగు బర్రెలు, ఆవులకు కూడా రుణం అందిస్తారు. ఒక్కో బర్రె కొనుగోలుకు సుమారు 75 వేల వరకు చెల్లిస్తారు. దీనితో పాటే రెండు నెలలకు సరిపడా దాణా కోసం 7,200 రూపాయలు అందిస్తారు. రవాణా ఖర్చుల కింద 3 వేలు, రవాణా సమయంలో బర్రె ఇన్సూరెన్స్ కు 443 రూపాయలు అందిస్తారు. నాలుగేళ్ల వరకు ఇన్సూరెన్స్ కింద 5088 రూపాయల వరకు అందిస్తారు. ఈ రుణాన్ని 11.5 శాతం వడ్డీకే అందజేస్తారు. గోపాల మిత్ర, పాలమిత్రల ద్వారా ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. పాడి రైతులు ఋణం తీసుకున్న తరువాత మూడో నెల నుంచి 2524 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

Leave Your Comments

రైతులకు ఖచ్చితమైన మార్కెటింగ్ సమాచారం అవసరం..

Previous article

తెగులును నివారించేందుకు పిచికారీ చేస్తే పంటే నాశనం..

Next article

You may also like