వార్తలు

పుట్టగొడుగులు, నాటుకోళ్ల పెంపకంతో స్వయం ఉపాధి..

0

ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాలేదని బాధపడే వారు ఎందరో ఉన్నారు. ఇంత చదువు చదివి ఉద్యోగం రాక బతికేది ఎలాగో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఉపాధి మార్గం అన్వేషణలో అష్టకష్టాలు పడుతున్నారు. అలాంటి నిరుద్యోగ యువతకు ఈ దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. డిగ్రీ చదివిన ఆ దంపతులు ఉద్యోగం రాలేదని చింతించలేదు. తమ దురదృష్టాన్ని తిట్టుకుంటూ కాలం వెల్లదియ్యలేదు. పుట్టగొడుగులు, నాటుకోళ్ల పెంపకంతో స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకొని అధికంగా నిలదొక్కుకుని స్థిరపడ్డారు పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. ఆ దంపతులు డిగ్రీ చదివారు. కుటుంబ పోషణతో పాటుగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు స్వయం ఉపాధిని మార్గంగా ఎంచుకున్నారు. ఒకరు పాల పుట్టగొడుగులు, మరొకరు నాటు కోళ్ల పెంపకాన్ని ఉపాధిగా ఎంచుకున్నారు. కర్నూల్ జిల్లా నందికొట్కూరు పట్టణం కురవ పేటకు చెందిన దంపతులు అరుణకుమారి, ఉదయ్ కుమార్ రెండేళ్ల కిందట మోక్ష మష్రూమ్స్ను ప్రారంభించారు. ఇది కొలిక్కి వచ్చిన తర్వాత పుట్టగొడుగుల పెంపకం బాధ్యతను భార్యకు అప్పగించి ఉదయ్ కుమార్ నాటుకోళ్ల పెంపకం ప్రారంభించారు.
పుట్టగొడుగుల పెంపకం: పెట్టుబడి.. వ్యయం
కిలో 150 చొప్పున 50 కిలోల విత్తనానికి రూ.7,500.
స్టెరిలైజేషన్ ఫార్మలిన్ లీటరు రూ.450
కార్బండిజమ్ కిలో రూ.100
డెటాల్ రూ. 100
ప్లాస్టిక్ కవర్లు, రబ్బరు బ్యాండ్లు రూ. 150
వరి గడ్డి రూ. 1000
మొత్తం రూ. 9,400 అవుతుంది.
గడ్డిని ఆరబెట్టుకునేందుకు టార్పాలిన్, నీటి కోసం డ్రమ్ము అవసరం అవుతాయి.
కిలో గడ్డికి 600 గ్రాములు పుట్టగొడుగులు వస్తాయి.
50 కిలోల విత్తనానికి 30 కిలోల పుట్టగొడుగుల దిగుబడి వస్తుంది.
ఇలా మూడు కోతలు వస్తాయి.
మార్కెట్ లో కిలో రూ. 400 చొప్పున విక్రయిస్తే కోతకు రూ. 12 వేలు వస్తాయి.
తయారీ విధానం:
పాల పుట్టగొడుగుల పెంపకానికి వేడితో కూడిన వాతావరణం అవసరం.
విత్తనం,గడ్డి, మట్టి స్పాన్ తీసుకుని గడ్డిని 3,4 అంగుళాలు కట్ చేసుకుని 24 గంటలు నానబెట్టాలి.
గడ్డిని బాయిల్ కూడా చేసుకోవచ్చు. గడ్డిని క్లీన్ చేసేందుకు నీటిలో ఫార్మల్ డిహైడ్ వేస్తారు.
వాటిలో చిన్న పురుగులు ఉన్నా చనిపోతాయి.
నీరు కింద పోసిన తర్వాత గడ్డిని ఆరబెట్టుకుని గడ్డిలో 20 శాతం తేమ ఉండేలా చూసుకోవాలి.
ప్లాస్టిక్ కవర్ తీసుకుని మొదటి లేయర్ గడ్డి తర్వాత విత్తనం ఇలా ఐదు లేయర్లు విత్తనం వేసుకోవాలి.
కిలో స్పాన్ కు ఆరు బ్యాగులు చేసుకోవాలి.
21 రోజులు డార్క్ రూంలో ఉంచాలి.
గాలిలో తేమ 85 శాతం, ఉష్ణోగ్రత 35 శాతం ఉండేలా చూసుకోవాలి.
గడ్డిలో సమస్య ఉంటే పసుపు, నలుపుల్లో కనిపిస్తాయి. వాటిని పక్కకు తీసి వేయాలి. తెల్లగా ఉన్నవి ఆరోగ్యంగా ఉన్నట్లుగా గుర్తించి కవరును రెండుగా కత్తిరించాలి.
50 కిలోల మట్టికి ఒక్క కిలో చాక్ పౌడర్ కలిపి కట్ చేసిన కవర్స్ ( బెడ్స్) పై ఒక అంగుళం మట్టి వేసుకోవాలి.
మట్టి తడిచేలా నీటి పిచికారీ చేయాలి. ఇలా రోజూ రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి.
వేసవిలో అయితే రెండు సార్లు తప్పనిసరిగా వారం రోజులు చేసుకుంటే సూదిమొనలు లాగా మొలకలు కనిపిస్తాయి.
4,5 రోజులకు 3,4 అంగుళాలు వస్తుంది. పంట కాలం 40 రోజులు. ఒకే బెడ్ నుంచి మూడు పంటలను తీసుకోవచ్చు.

Leave Your Comments

రామాఫలం ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

నువ్వు పంటలో సస్య రక్షణ చర్యలు..

Next article

You may also like