వార్తలు

పీఎం కిసాన్ స్కీమ్ కొత్త రూల్స్..

0

మోదీ సర్కార్ రైతుల కోసం ప్రత్యేక స్కీమ్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అదే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ స్కీమ్ లో రూల్స్ మారాయి. ఈ స్కీమ్ లో చేరిన రైతులకు ఏడాదికి రూ.6వేలు లభిస్తాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు. మూడు విడతల్లో రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. మీరు కూడా ఈ స్కీమ్ ఉంటే కచ్చితంగా ఒక విషయం తెసుకోవాలి. కొత్తగా ఈ స్కీమ్ లో చేరే వారికి ఈ రూల్ వర్తిస్తాయి.

ఇకపై పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందాలని భావిస్తే ఖచ్చితంగా పొలం తన పేరు మీదనే ఉండాలి. వ్యవసాయం చేస్తున్నా కూడా పొలం తల్లితండ్రుల పేరుపై ఉంటే మాత్రం పీఎం కిసాన్ స్కీమ్ రూ.6వేలు రావు. ఇంకా పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా పీఎం కిసాన్ డబ్బులు రావు. అంతేకాకుండా ఇంట్లో ఎవరైనా నెలకు రూ.10వేలకు పైగా పెన్షన్ తీసుకుంటున్నా, రాజ్యాంగబద్ధమైన పదవీలో ఉన్న కూడా పీఎం స్కీమ్ కింద డబ్బులు పొందడం వీలు కాదు. కాగా ఇందు కోసం మీరు పెట్టుకున్న అప్లికేషన్ ని రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేస్తేనే కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి. కొత్త రూల్స్ కొత్తగా స్కీమ్ లో చేరే వాళ్లకి వర్తిస్తాయి.

 

Leave Your Comments

కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు శుభవార్త..

Previous article

పొన్నగంటి ఆకుతో ఆరోగ్య ప్రయోజనాలు

Next article

You may also like