PJTSAU Diploma 2022: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ డిప్లోమా కోర్సులకు ఆన్ లైన్ దరఖాస్తు గడువు పొడగింపు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయము వివిధ డిప్లోమా కోర్సుల ప్రవేశము కొరకు ఆన్ లైన్ దరఖాస్తు గడువును 16-08-2022 వరకు పొడిగించినట్లుగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్. సుధీర్ కుమార్ తెలిపారు.
మూడు సంవత్సరముల వ్యవసాయ ఇంజనీరింగ్ డిప్లొమా మరియు రెండు సంవత్సరాల వ్యవసాయ మరియు సేంద్రియ డిప్లోమా కోర్సులు ఇంగ్లీష్ మీడియంలో బోధింపబడుతాయి. ఈ కోర్సుల కౌన్సిలింగ్ ఆగష్టు చివరి వారంలో నిర్వహిస్తామని, వివరాల కొరకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.pjtsau.edu.in ను ఎప్పటికప్పుడు చూడాలని రిజిస్ట్రార్ సూచించారు.

PJTSAU Diploma 2022
డిప్లమా కోర్సుల పూర్తి వివరాలు, సీట్లు, ఫీజులు, మొదలగు సమగ్ర సమాచారము కొరకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.pjtsau.edu.in చూడవచ్చును.
వివిధ సంబంధిత డిగ్రీ కోర్సులలో ప్రవేశము కొరకు డిప్లోమా పూర్తిచేసిన అభ్యర్థుల అర్హత గురించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన G.O ప్రతిని విశ్వవిద్యాలయ వెబ్ సైట్ పొందుపరిచినట్లు గా రిజిస్ట్రార్ తెలిపారు.