వార్తలు

సేంద్రియ వ్యవసాయం చేస్తున్న 104ఏళ్ల రైతు పాపమ్మాళ్ కి పద్మశ్రీ అవార్డు..

0

కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం దక్షిణాదిలోనే మొట్ట మొదటిదన్నవిషయం తెలిసిందే. ఈ విద్యాసంస్ద 50 సం.ల క్రితం నుంచే రైతులకు సేంద్రియ వ్యవసాయాన్ని నేర్పిస్తూ ఉంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం 104ఏళ్ల పాపమ్మాళ్ రసాయనిక రైతుగా 30ఏళ్ల వ్యవసాయానుభావం తర్వాత.. 50 సం.ల  క్రితం.. కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వ విద్యాలయం నుంచి సేంద్రియ వ్యవసాయం నేర్చుకున్నారు. అనుదినం తానే నడుము వంచి పొలం పనులు చేసుకుంటున్న ఈ మహా రైతమ్మను పద్మశ్రీ పురస్కారం వరించింది.

పొట్టకూటి కోసం ఎంత కష్టమైనా పడకతప్పదు. తన చిన్నప్పుడే అమ్మనాన్న చనిపోయారు, వారు నడిపే టీ బంకు మూతపడటంతో చెల్లితో కలిసి నానమ్మ దగ్గరకు చేరుకున్నారు. తన నానమ్మది కూడా ఫలసరుకుల దుకాణం పెట్టుకుని జీవితాన్ని నెట్టుకొచ్చే పేద కుటుంబం కావడంతో.. ఆమెకు సహకరిస్తూ రెండో క్లాసులోనే చదును మానేశారు. 20ఏళ్లకే పెళ్ళయింది. పదేళ్ళ క్రితం భర్త చనిపోయాడు.పిల్లలు లేకపోవడంతో సోదరి పిల్లలనే తన పిల్లలుగా చేర దీశారు. పొదుపుచేసిన సొమ్ముతో పది ఎకరాలు కొని సాగులోకి దిగారు. తదనంతరం కుటుంబ అవసరాల కోసం 7.5 ఎకరాలు అమ్మివేశాను. 2.5 ఎకరాల పొలంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుతం అరటి పంట పెట్టారు.

ఆవు పేడ, మూత్రం, గడ్డి, బెల్లం మిశ్రమాలను వాడతాను. ఆవుపేడ, లవంగాలు, ఉప్పును ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి పొలంలో భూమిలో పాతి పెట్టాలి. 15రోజులకు ఒకసారి మూత తీసి ఆ మిశ్రమాన్ని కలియబెట్టాలి. 2 నెలల తరువాత బయటకు తీసి మొక్కల పాదుల్లో చల్లాల్లి. వేపాకు ఎండ బెట్టి పొడి చేసి,వెల్లుల్లి పొడి, నీటితో కలిపి ద్రావణం తయారు చేసుకొని పంటలపై చల్లితే పురుగు పుట్టదు అని రైతమ్మ చెప్పారు.

తెల్లవారుజామునే లేచి ఇప్పటికీ వేప పుల్లతోనే పళ్ళు తోముకుంటారంటా ఆమె. కాలకృత్యాలు ముగించుకుని ఒక చెంబు నిండా గోరువెచ్చని నీళ్ళు, రాగి గంజీ తాగుతారు. ఎప్పుడైనా చికెన్ సూప్ సేవిస్తారంటా, అరటి ఆకు లోనే భోజనం చేస్తారంటా ఆమె. ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలతోనే తను భోజనం చేస్తుందట. కూలీలకు అయ్యో ఖర్చు భరించలేక తానే ఉదయం నుంచి చీకటి పడే వరకు పొలం దగ్గరే ఉంటదంట ఆమె. దాదాపు 80 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా.. ఎప్పుడూ అలసి పోలేదు. నాకు 104 ఏళ్ళు వచ్చాయంటే నమ్మబుద్ది కావడంలేదు. నిరంతరం పొలంలో పనులు చేయడం, ఆహారపు అలవాట్లే నా ఆరోగ్యానికి రహస్యం అనుకుంటాను అని అన్నారు.

ఆరోగ్యకరమైన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తేవడంలో ఎంతో ఆనందం ఉంది. సేంద్రియ వ్యవసాయం అనేది ఒక రకంగా సహజ సేవ. రసాయనాలతో ఆహార పంటల సాగును పూర్తిగా మాన్పించాలి.సేంద్రియ సాగులోని బాగు గురించి భావితరాలకు అవగాహన కల్పించాలి అని పాపమ్మాళ్ అంటున్నారు.

పొట్ట గడవటం కోసం నా మానాన నేను చేసుకుంటున్న సేంద్రియ వ్యవసాయం పద్మశ్రీ అవార్డుకు తెచ్చి పెడుతుందని నేనెప్పుడూ ఊహించలేదు.అసలు పద్మశ్రీ అవార్డు ఒకటి ఉంది అని కుడా నాకు తెలియదు. కేంద్ర ప్రభుత్వం నాకు పద్మశ్రీ ప్రకటించగానే మారుమూల గ్రామంలో ఉంటున్న నా వద్దకు ప్రజలు,బంధువులు, ముఖ్యంగా విలేకరులు తండోపతండాలుగా రావడం ప్రారంభించారు. ఈ హడావిడితోనే పద్మశ్రీ అవార్డు గొప్పతనం గురించి తెలిసింది. ఈ గుర్తింపు, గౌరవం నాకు కాదు సేంద్రియ వ్యవసాయానికే అని భావిస్తున్నారు రైతు పాపమ్మాళ్.

Leave Your Comments

టమోట, వంగ, పచ్చి మిరప మరియు బెండ పంటలలో సమగ్ర సస్యరక్షణ

Previous article

మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు – నివారణ చర్యలు

Next article

You may also like